India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

IND, AUS మధ్య ఐదో టెస్ట్ (పింక్ టెస్ట్) ఈనెల 3 నుంచి జరగనుంది. ఈ మ్యాచుకు స్టేడియం మొత్తం పింక్ కలర్లో దర్శనమివ్వనుంది. AUS ప్లేయర్లు సైతం పింక్ క్యాప్స్ ధరిస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ మెక్గ్రాత్ ఫౌండేషన్కు మద్దతుగా 2009 నుంచి పింక్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. 2008లో తన భార్య క్యాన్సర్తో చనిపోవడంతో మెక్గ్రాత్ ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్ రోగుల కోసం ఫండ్స్ సేకరిస్తున్నారు.

కొత్త ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. రూ.14.50 తగ్గడంతో ఢిల్లీలో గ్యాస్ ధర రూ.1804కు చేరింది. ప్రస్తుతం HYDలో సిలిండర్ ధర రూ.2014గా ఉంది. ఇవాళ్టి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ప్రతినెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తాయి.

నోస్ట్రడామస్, బాబా వంగా ఇద్దరూ ఎన్నో ఏళ్ల ముందుగానే పలు ఘటనల్ని కచ్చితత్వంతో అంచనా వేశారు. 2025 గురించి వీరు చెప్పిన జోస్యం పాశ్చాత్య దేశాల ప్రజల్ని భయపెడుతోంది. ఈ ఏడాది ఐరోపాలో ప్రపంచయుద్ధం స్థాయిలో పరిస్థితులు నెలకొంటాయని వారు చెప్పారు. బ్రిటన్లో మహమ్మారి తిరిగి వస్తుందని, USలో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని అన్నారు. ప్రపంచ ఆధిపత్యం తూర్పుదేశాల చేతికి వస్తుందని జోస్యం చెప్పారు.

AP: కోస్తా తీరంలో కీలకమైన కత్తిపూడి-ఒంగోలు హైవే విస్తరణకు అడుగులు పడుతున్నాయి. దీనిని 4, 6 వరుసలుగా విస్తరించేందుకు DPR తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం ఈ రోడ్డు 2 వరుసలుగా ఉంది. 390KM ఉండే ఈ రహదారిలో తొలుత కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు, రెండో దశలో మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు విస్తరణ పనులు చేపడతారు. అలాగే ఆకివీడు నుంచి పాలకొల్లు వరకు 40కి.మీ విస్తరణ కూడా జరగనుంది.

న్యూ ఇయర్ సందర్భంగా పలు టాలీవుడ్ సినిమాల నుంచి పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా తదితర సినిమాలు పోస్టర్లను రిలీజ్ చేశాయి. 2025లో మీరు ఏ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.

కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేశాం. 2025లో మీరు ఏమైనా రెజల్యూషన్స్ పెట్టుకున్నారా? ఏదైనా సాధించాలని, ఉద్యోగం పొందాలని, జీతం పెరిగే ఉద్యోగం దొరకాలని, జీవితం మారాలని, పొదుపు చేయాలని, మందు, సిగరెట్ మానేయాలని, పెళ్లి చేసుకోవాలని, డైట్ ఫాలో కావాలని, జిమ్కు వెళ్లాలని, మందు తాగకూడదని, దూరమైన వారితో తిరిగి మాట్లాడాలని.. ఇలా మీ రెజల్యూషన్స్ ఏంటో? కామెంట్ చేయండి. వాటిని ఇవాళ్టి నుంచే ప్రారంభించండి.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత అర్ధరాత్రి 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్లో అత్యధికంగా 236, సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్ 177, సెంట్రల్ జోన్ 102, సౌత్ వెస్ట్ జోన్లో 179 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిన సంగతి తెలిసిందే.

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్షలు రేపటి నుంచి ఈనెల 20 వరకు జరగనున్నాయి. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పేపర్-1కు 94,327 మంది, పేపర్-2కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 17 జిల్లాల పరిధిలో 92 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉ.9 నుంచి ఉ.11.30 వరకు మొదటి సెషన్, మ.2-సా.4.30 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.

కేరళకు చెందిన నిమిష ప్రియ అనే నర్సు 2011లో భర్తతో కలిసి యెమెన్లో స్థిరపడ్డారు. ఆదిబ్ మెహదీ అనే స్థానికుడిని భాగస్వామిగా చేసుకుని క్లినిక్ ప్రారంభించారు. భర్త స్వదేశానికి వచ్చిన సమయంలో మెహదీ ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె మత్తు మందు ఇవ్వగా, డోసు ఎక్కువై అతడు మరణించాడు. ఈ కేసు విషయంలో 2017 నుంచి ప్రియ యెమెన్ జైల్లోనే ఉన్నారు. తాజాగా ఆ దేశాధ్యక్షుడు ఆమెకు మరణశిక్ష ఖరారు చేశారు.

AP: ఎయిర్ పోర్టును తలపించేలా సకల హంగులతో కూడిన క్రూజ్ టెర్మినల్ విశాఖలో రెడీ అయింది. కేంద్ర పర్యాటక శాఖ, వైజాగ్ పోర్టు సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. విమానాశ్రయాల తరహాలోనే దీనిలో కస్టమ్స్ కౌంటర్లు, షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్టులు ఉంటాయి. ఈ ఏడాది ఇక్కడ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడి నుంచి విదేశాలకు క్రూజ్ షిప్స్ నడపనున్నారు.
Sorry, no posts matched your criteria.