India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళల క్రికెట్లో ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో బంగ్లాదేశ్ ప్లేయర్ ఫరీహా ఇస్లామ్ త్రిస్న హ్యాట్రిక్ సాధించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 4, 5, 6 బంతులకు వికెట్లు తీశారు. మొత్తంగా 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. కెరీర్లో ఆమెకు ఇది రెండో హ్యాట్రిక్ కావడం విశేషం. ఆసీస్ 161/8 స్కోర్ చేయగా, ఛేజింగ్లో బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేశారు. 20 ఓవర్లలో 103/9 స్కోర్ చేసి జట్టు ఓడిపోయింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో జరగనున్న తొలి లోక్సభ ఎన్నికలు కావడంతో అక్కడి ప్రజల తీర్పుపై ఆసక్తి నెలకొంది. జమ్మూలో పట్టు సాధించిన BJP కశ్మీర్లోనూ ఖాతా తెరవాలనుకుంటోంది. గుజ్జర్లు, ST వర్గంలో చేర్చినందుకు పహారీలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారనేది బీజేపీ అంచనా. అనంత్నాగ్ నియోజకవర్గంలోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో వీరి ఓటు బ్యాంక్ ఎక్కువ. బారాముల్లాలో సైతం వీరి ఓటు బ్యాంక్ ఉంది.
<<-se>>#Elections2024<<>>
ఇక శ్రీనగర్లో ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాలు నేషనల్ కాన్ఫరెన్స్ గుప్పిట్లో ఉన్నాయి. ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని ఈ పార్టీ మరోసారి ఇక్కడ గెలవాలని భావిస్తోంది. ఇండియా కూటమిలో NC, PDP భాగమైనా.. సీట్ల పంపిణీకి NC ససేమిరా అంటోంది. అనంతనాగ్ సీటు పీడీపీకి కేటాయించాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించి ఒంటరి పోరుకు సిద్ధమైంది.
<<-se>>#Elections2024<<>>
ఈ నేపథ్యంలో కశ్మీర్లో పీడీపీ ఒంటరి పోరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ NC, PDPలు… సమర్థిస్తూ BJP కశ్మీర్లో పోటీకి దిగనున్నాయి. మరోవైపు జమ్మూలో ఈసారి గెలిచి తీరాలని కాంగ్రెస్ భావిస్తోంది. లద్ధాక్లో స్థానికుల నిరసన ఎన్నికలపై ప్రభావం చూపించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ రైట్స్పై స్థానికులు పోరాడుతున్నారు.
<<-se>>#Elections2024<<>>
లెజెండ్ సినిమా తర్వాత విలన్ పాత్రలకు కేరాఫ్గా మారారు జగపతిబాబు. అయితే, ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ను తాను సద్వినియోగం చేసుకోలేకపోయానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా పేరు అనౌన్స్ చేసినప్పుడు జగపతిబాబు విలన్ ఏంటి అన్నారు చాలామంది. ఆ సినిమా విజయం నాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే, సక్సెస్ను సరిగ్గా వాడుకోలేకపోయాను. ఆ తర్వాత కొన్ని మంచి పాత్రలు మాత్రమే చేయగలిగాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
AP: స్కిల్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబులో మార్పు రాకపోవడం ఆయన కర్మ అని YCP MP విజయసాయిరెడ్డి Xలో విమర్శించారు. ‘22 కేసుల్లో స్టే తెచ్చుకుని వ్యవస్థలను మేనేజ్ చేసిన బతుకు మీది. మీడియా, వ్యవస్థల్లో మీరు నాటిన విత్తనాలు వృక్షాలై మీకు గొడుగు పడుతున్నాయి. లేదంటే 30 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తూ ఉండేవారు. మిమ్మల్ని మించిన అవినీతి రాజకీయనాయకుడు దేశంలోనే లేరు’ అని ఫైరయ్యారు.
AP: అసెంబ్లీకి పోటీ పడబోయే 114 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇటీవల APCC చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు ఇందులో చోటు దక్కింది. నందికొట్కూరు నుంచి ఆర్థర్, చింతలపూడి నుంచి ఎలీజా పోటీ చేయనున్నారు. అలాగే శింగనమల నుంచి మాజీ మంత్రి శైలజానాథ్, కోడుమూరు నుంచి మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ బరిలో దిగనున్నారు.
ఏపీ రాజకీయాలపై ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నేత నరేశ్ సంచలన ట్వీట్ చేశారు. ‘రాష్ట్రంలో అధికార మార్పిడికి ముందు పెద్ద రక్తపాతం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నా నమ్మకం’ అని రాసుకొచ్చారు. ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈరోజుతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఆయన భార్య సాక్షీ సింగ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. 13 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదేరోజున ధోనీ సారథ్యంలోని టీమ్ఇండియా 2011 వరల్డ్ కప్ను గెలిచింది. అలాగే ఏప్రిల్ 2, 2018న లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ధోనీ అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఈ రెండింటి ఫొటోలను ఆమె ఇన్స్టాలో పంచుకున్నారు.
విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజైంది ‘లైగర్’. విడుదలకు ముందే దాని కలెక్షన్ల గురించి విజయ్ చాలా గొప్పగా చెప్పారు. తీరా రిలీజయ్యాక మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఇకపై మాత్రం అలా మాట్లాడనని అంటున్నారాయన. ఆ సినిమా చెప్పిన పాఠం తర్వాత విడుదలకు ముందే సినిమా గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని, ఇది తనకు తానే విధించుకున్న శిక్ష అని ఓ ఇంటర్వ్యూలో విజయ్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.