India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని సీఎం రేవంత్, మంత్రులు నిర్ణయించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పూల బొకేలు, స్వీట్ బాక్సులు, శాలువాలు తీసుకురావద్దని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు ఆదేశాలు జారీ చేశారు. మన్మోహన్ సింగ్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

TG: ఇప్పటివరకు 125.50 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సదుపాయాన్ని వినియోగించుకుని, రూ.4,225 కోట్ల రవాణా ఖర్చులను ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ స్కీం ప్రారంభించకముందు రోజూ సగటున 45 లక్షల మంది రాకపోకలు సాగించేవారని, ఇప్పుడా సంఖ్య 58 లక్షలకు పెరిగిందన్నారు. RTC లాభాల్లోకి వచ్చిందని, రద్దీకి అనుగుణంగా ఏడాది కాలంగా 1,389 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

AP: మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ను పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 10.5 శాతం మార్జిన్ వల్ల నష్టపోతున్నామని, పెంచాలని షాపుల యజమానులు ప్రభుత్వాన్ని కోరడంతో 14 శాతానికి పెంచాలని చంద్రబాబు నిర్ణయించారు. మరోవైపు రూ.99కి మద్యం అన్ని చోట్లా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల లిక్కర్, నకిలీ మద్యం రాకుండా చూడాలన్నారు.

AP: రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో గీత కులాలకు 10% షాపులు కేటాయించాలని, వారం రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీని ప్రకారం 340 షాపులు గౌడ, శెట్టి బలిజ, ఈడిగ, గామల్ల, కలాలీ, శ్రీసాయన, శెగిడి, గౌండ్ల, యాత, సోంది వంటి కులాలకు కేటాయిస్తారు. ఒక్కొక్కరు ఎన్ని షాపుల కోసమైనా ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక వ్యక్తికి ఒకటే దుకాణం కేటాయిస్తారు.

2025లో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్(WAVES) నిర్వహిస్తామని PM మోదీ ప్రకటించడంపై హీరో రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘మోదీ ప్రభుత్వం మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలను ప్రోత్సహించడం ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ సహకారానికి వేవ్స్ అసలైన గేమ్ ఛేంజర్ కానుంది’ అని ట్వీట్ చేశారు. వేవ్స్ సమ్మిట్లో ప్రపంచ దేశాల ప్రముఖులు పాల్గొంటారని ఇటీవల మన్కీబాత్లో ప్రధాని వెల్లడించిన విషయం తెలిసిందే.

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ అదరగొడుతున్నారు. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన అతను 3 సెంచరీల సాయంతో 430 రన్స్ చేశారు. అన్నిట్లోనూ నాటౌట్గానే ఉండటం విశేషం. ప్రస్తుతం టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నారు. కరుణ్ J&Kపై 112*, ఛత్తీస్గఢ్పై 44*, చండీగఢ్పై 163*, తమిళనాడుపై 111* పరుగులు బాదారు. ఇతను భారత్ తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

సంవత్సరం మారడంతో ప్రతి ఇంట్లో 2025 క్యాలెండర్ సందడి చేస్తుంది. ప్రతి నెలకు ఒక సెపరేట్ పేజీ కాకుండా ఏడాదిలోని అన్ని తేదీలు ఒకే పేజీలో ఉంటే ఎలా ఉంటుంది. సూపర్ కదా! అలాంటి క్యాలెండరే మీ కోసం. పై ఫొటోలోని క్యాలెండర్లో ఏడాదికి సంబంధించిన అన్ని తేదీలు, వారాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. మరి ఈ సింపుల్ ONE PAGE CALENDARను మీ సన్నిహితులతో పంచుకోండి.
>>SHARE IT

స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్పై వడ్డీ రేట్లను మరోసారి కేంద్రం యథాతథంగా ఉంచింది. JAN 1 నుంచి MAR 31 వరకు పాత రేట్లే కొనసాగుతాయని నోటిఫికేషన్ జారీ చేసింది. సుకన్య సమృద్ధి యోజనకు 8.2%, మూడేళ్ల టర్మ్ డిపాజిట్కు 7.1%, PPFకు 7.1%, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్కు 4% వడ్డీ లభిస్తుందని తెలిపింది. కిసాన్ వికాస్ పత్ర పథకం(115 నెలల కాలపరిమితి)పై 7.5%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్పై 7.7% వడ్డీ ఇస్తామంది.

భారత పర్యాటకులను ఆకర్షించేందుకు అమెరికన్ హోటళ్లు వినూత్న పంథా అనుసరిస్తున్నాయి. ఛాయ్, సమోసా అమ్ముతున్నాయి. లాంజుల్లో భారతీయ టీవీ ఛానళ్లను పెడుతున్నాయి. 2024లో 19 లక్షల భారతీయులు USలో పర్యటించారు. 2019తో పోలిస్తే ఇది 48% ఎక్కువ గ్రోత్. విజిటింగ్, బిజినెస్ వీసాలు పెరగడం ఇందుకో కారణం. మరోవైపు చైనా, జపాన్, సౌత్ కొరియా పర్యాటకులు 50-25% వరకు తగ్గిపోయారు. అందుకే భారతీయులకు ఎక్కువ మర్యాదలు అన్నమాట.

TG: సీఎం రేవంత్ రెడ్డి జనవరి 13న ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే క్రీడా విశ్వవిద్యాలయం కోసం క్వీన్స్ల్యాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. అక్కడి విధానాలను పరిశీలించనున్నారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు, స్పోర్ట్స్ ఛైర్మన్, ఎండీ JAN 14, 15, 16, 17 తేదీల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు.
Sorry, no posts matched your criteria.