News April 2, 2024

తెలంగాణలో ‘కరవు’ రాజకీయాలు

image

రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థత వల్లే కరవు వచ్చిందని ప్రతిపక్ష BRS ఆరోపిస్తుంటే.. ఇది గత ప్రభుత్వం చేసిన పాపమే అని కాంగ్రెస్ అంటోంది. ఎండిన పంటలను పరిశీలించేందుకు కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే.. అసెంబ్లీకి రాని కేసీఆర్ అరెకరం కోసం రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నష్టపోయిన రైతులను గాలికి వదిలేసి ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

News April 2, 2024

ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నా: రఘురామ

image

ప్రజల కోసమే సీఎం జగన్‌తో తాను ప్రాణాలకు తెగించి పోరాడుతున్నానని నరసాపురం ఎంపీ రఘురామక‌ృష్ణరాజు తెలిపారు. ‘జగన్‌పై ఉన్న కేసుల్లో ఏ పురోగతీ లేకపోవడం దురద‌ృష్టకరం. రాష్ట్రం నుంచి ఎవరూ స్పందించకపోయినా నేను కోర్టులో పిటిషన్ వేశాను. అందుకే జగన్ నన్ను చంపించే ప్రయత్నం చేశారు. ప్రజల కోసం అన్నీ ఓర్చుకున్నాను. కూటమి ఏర్పాటు కోసం నేను ఎన్నో రోజులు ఢిల్లీలో ఉండి రహస్యంగా కృషి చేశాను’ అని పేర్కొన్నారు.

News April 2, 2024

ఈ ఫలితాన్ని ఊహించలేదు: హార్దిక్

image

నిన్నటి మ్యాచులో రాజస్థాన్ చేతిలో ఓటమిపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మ్యాచులో ఈ ఫలితాన్ని ఊహించలేదని చెప్పారు. కోరుకున్న విధంగా ఆరంభం దక్కలేదన్నారు. రాబోయే మ్యాచుల్లో ఉత్తమ ప్రదర్శన ఇవ్వగలమనే నమ్మకం ఉందన్నారు. దీని కోసం ధైర్యంగా ఆడాల్సి ఉంటుందన్నారు.

News April 2, 2024

OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా?

image

‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ నటించిన ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్ సినిమా ‘గామి’ OTT స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం ఏప్రిల్ 12న జీ 5 OTTలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కాగిత విద్యాధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అభినయ, సమద్ తదితరులు నటించారు.

News April 2, 2024

ముఖంపై త్రివర్ణ పతాకం.. ఆలయంలోకి నో పర్మిషన్!

image

అమృత్‌సర్‌ గోల్డెన్ టెంపుల్‌ సిబ్బంది భక్తులతో ప్రవర్తించిన తీరుపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత జాతీయ జెండాను ఫేస్‌పెయింట్ వేసుకున్న తనను టెంపుల్‌లోనికి అనుమతించలేదని ఓ నెటిజన్ రెడిట్‌లో పోస్ట్ చేయడంతో దీనిపై చర్చ మొదలైంది. గేటు వద్ద ఉన్న సిబ్బంది కూడా మొరటుగా ప్రవర్తించారని చెప్పారు. అయితే, 2023లోనూ ఓ యువతికి ఇలాంటి ఘటనే ఎదురైందని మరో నెటిజన్ గుర్తు చేశారు.

News April 2, 2024

ఆ ముగ్గురిలో ఎంపీ టికెట్ దక్కేదెవరికో?

image

TG: సీనియర్ నేత కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య పార్టీ మారడంతో వరంగల్ ఎంపీ అభ్యర్థిపై BRS కసరత్తు చేస్తోంది. పార్టీ మారిన మూడు రోజులకే కావ్యకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ కేటాయించడంతో ఆమెను ఓడించేందుకు తగిన ప్రత్యర్థిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో మాజీ MLA రాజయ్య, పెద్ది స్వప్న, పరంజ్యోతి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు టికెట్ దక్కించుకుంటారో వేచి చూడాలి.

News April 2, 2024

పుష్ప-2 అప్డేట్ ఇదేనా..?

image

పుష్ప-2 నుంచి ఇవాళ క్రేజీ అప్డేట్ రానున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్‌ ట్విటర్‌లో ‘పుష్ప-2’‌ను ట్రెండ్ చేస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్‌ను బీట్ చేసే మరో అప్డేట్ రానుందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. మరికొందరేమో సాంగ్ లేదా టీజర్ వదిలితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేం కోరుకుంటున్నారు?

News April 2, 2024

‘ప్రాజెక్ట్ టైగర్’కు 51 ఏళ్లు.. 70% పులులు భారత్‌లోనే!

image

దేశంలో పులుల సంరక్షణ, వాటి సంఖ్యను పెంచేందుకు భారత ప్రభుత్వం APR 1, 1973న ‘ప్రాజెక్ట్ టైగర్‌’ను ప్రారంభించింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ 51ఏళ్లు పూర్తి చేసుకుందని ఓ IFS అధికారి ట్వీట్ చేశారు. మొత్తం 9 టైగర్ రిజర్వ్‌లలో పులుల సంరక్షణ కొనసాగుతోందన్నారు. దీంతో 2006లో 1411 పులులుండగా.. 2022లో వాటి సంఖ్య 3682కి చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో 70% ఇండియాలోనే ఉన్నట్లు వెల్లడించారు.

News April 2, 2024

అన్నమయ్య జిల్లా సిద్ధమా?: YS జగన్

image

AP: సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలో ముగించుకుని ఆరో రోజు అన్నమయ్య జిల్లాకు చేరుకుంది. ఈక్రమంలో ‘అన్నమయ్య జిల్లా సిద్ధమా?’ అని జగన్ ట్వీట్ చేశారు. ప్రజలను కలుస్తూ పార్టీకి మద్దతివ్వాలని కోరుతూ ఆయన ఇవాళ జిల్లాలో బస్సు యాత్ర చేయనున్నారు. నిన్నటి సత్యసాయి జిల్లా సభకు భారీగా ప్రజలు తరలివచ్చినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.

News April 2, 2024

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం

image

టాలీవుడ్‌లో మరో <<12970907>>విషాదం<<>> నెలకొంది. చిత్రకారుడు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ పిట్టంపల్లి సుదర్శన్ కన్నుమూశారు. నల్గొండ(D) మిర్యాలగూడలోని తన స్వగృహంలో గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. 1988లో విడుదలైన దాసి సినిమాకు ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు. జాతీయ అవార్డు జ్యూరీలోనూ సభ్యుడిగా పనిచేశారు. మంగళవారం మిర్యాలగూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.