News April 2, 2024

రిషి సునాక్‌కు మెగా పోల్ షాక్

image

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు సివిల్ సొసైటీ ప్రచార సంస్థ మెగా పోల్ షాక్ ఇచ్చింది. అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగులుతుందని అంచనా వేసింది. 15,029మందిపై ఈ పోల్‌ను నిర్వహించారు. అధికార పార్టీతో పోలిస్తే ప్రతిపక్ష లేబర్ పార్టీ 19పాయింట్ల ఆధిక్యంలో ఉందని, 286 సీట్ల మెజారిటీ సాధిస్తుందని జోస్యం చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 250 చోట్ల అధికార పార్టీ ఓడిపోతుందని తెలిపింది.

News April 2, 2024

సునీత మరో రబ్రీ దేవి అవుతారా?

image

లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉన్నారు. జైలు నుంచే సర్కార్ నడిపిస్తానని చెప్పినా.. ఆ జైలులో సీఎం ఆఫీస్ ఏర్పాటు సదుపాయాలు లేవని తెలుస్తోంది. దీంతో ఆయన సతీమణి సునీతపై అందరి దృష్టి నెలకొంది. గతంలో బిహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉన్నప్పుడు ఆయన భార్య రబ్రీ దేవి ప్రభుత్వాన్ని నడిపించినట్లే సునీత కూడా చేస్తారేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News April 2, 2024

IPL: ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఎవరివంటే..

image

ఐపీఎల్‌లో 14 మ్యాచులు పూర్తయ్యాయి. 3 మ్యాచుల్లో 181 పరుగులతో RCB బ్యాటర్ కోహ్లీ, RR ప్లేయర్ పరాగ్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ 167 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ వేటలో ఉన్నారు. ఇక బౌలర్లలో సీఎస్కే బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ 7 వికెట్లతో టాప్‌లో ఉండగా.. ఆర్ఆర్ స్పిన్నర్ చాహల్ 6 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

News April 2, 2024

నిప్పుల కుంపటి.. సెగలు కక్కుతున్న భానుడు

image

AP: పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో నేడు, రేపు వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. నంద్యాల(D) పాణ్యంలో గరిష్ఠంగా 43.7, కర్నూలు(D) నందికొట్కూరులో 43.3, గూడూరులో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News April 2, 2024

స్వల్పంగా పెరిగిన పత్తి విత్తన ధరలు

image

TG: కేంద్రం మరోసారి పత్తి విత్తనాల ధరలు పెంచింది. దీంతో గతేడాది 475గ్రాముల ప్యాకెట్ ధర రూ.853 ఉండగా.. ఇప్పుడు రూ.864కి చేరింది. కంపెనీల డిమాండ్లకు అనుగుణంగా కేంద్రం ఏటా ధరలు పెంచుతోంది. 2020-21లో ప్యాకెట్ ధర రూ.730 ఉండేది. ఇప్పుడు రూ.864కు చేరింది. ఇక తెలంగాణలో వరి తర్వాత అత్యధికంగా సాగవుతున్న పంట పత్తి. ఇప్పటికే వర్షాభావంతో అల్లాడుతున్న అన్నదాతలకు ఈ ధరల పెరుగుదల మరికొంత భారం కానుంది.

News April 2, 2024

ట్విటర్ ట్రెండింగ్‌లో ‘వడాపావ్’

image

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం పొందింది. సొంత గడ్డపై ముంబై ప్లేయర్లు డకౌట్ అవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఎక్కువ సార్లు జీరో డిజిట్‌కే వెనుదిరగడంతో ‘వడాపావ్’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. వరుసగా ఓడిపోతున్నప్పటికీ ప్లేయర్లు గెలవాలన్న కసితో ఆడట్లేదని విమర్శిస్తున్నారు. దీంతో ‘వడాపావ్’ హాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండవుతోంది.

News April 2, 2024

వైఎస్ జగన్ యాత్ర నేటి షెడ్యూల్

image

ఏపీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర 6వ రోజుకు చేరింది. ఈరోజు ఉదయం 9 గంటలకు చీకటిమానిపల్లె నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. గొల్లపల్లి మీదుగా జగన్ అంగళ్లు గ్రామం చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30గంటలకు మదనపల్లెలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నిమ్మనపల్లి, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లెకు చేరుకుంటారు. రాత్రికి అమ్మగారిపల్లె శివారులో బస చేయనున్నారు.

News April 2, 2024

వాళ్లు అసలు మనుషులే కాదు: వాట్సన్

image

ఐపీఎల్‌లో అదరగొడుతున్న రిషభ్ పంత్ ప్రయాణం స్ఫూర్తిదాయకమన్నారు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్. పంత్‌ నుంచి కూడా ప్రేరణ పొందనివారు అసలు మనుషులే కాదని అభిప్రాయపడ్డారు. ‘ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన రిషభ్ తిరిగి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం నమ్మశక్యంగా లేదు. దారిలో పడేందుకు కొంచెం సమయం తీసుకున్నారు కానీ సెట్ అయ్యాక తనదైన స్టైల్‌లో అద్భుతమైన షాట్లు ఆడారు’ అని వాట్సన్ పేర్కొన్నారు.

News April 2, 2024

వామ్మో.. ఇక బంగారం కొనలేమా?

image

బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం సోమవారం రూ.71,300కు చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రూ.64 వేలకు పైగా పలికింది. మరోవైపు వెండి ధర ఎంత పెరుగుతుందనే విషయంలో నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ఈ నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో ధర పెరుగుదలతో ఇక బంగారం కొనలేమా? అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

News April 2, 2024

కొవ్వూరు కింగ్ ఎవరో?

image

AP: తూ.గో(D)లోని SC రిజర్వ్డ్ నియోజకవర్గం కొవ్వూరు. 1999, 2019 ఎన్నికలు మినహా 1983 నుంచి ఇక్కడ TDP గెలుస్తూ వస్తోంది. ఈసారి అభ్యర్థుల్ని మార్చిన TDP, YCP.. గోపాలపురం సిట్టింగ్, మాజీ MLAలని ఇక్కడ బరిలోకి దింపాయి. YCP నుంచి తలారి వెంకట్రావు, TDP తరఫున వెంకటేశ్వరావు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి కొవ్వూరుని మళ్లీ కంచుకోటగా మార్చుకోవాలని TDP.. పట్టు నిలుపుకోవాలని YCP వ్యూహాలు రచిస్తున్నాయి. <<-se>>#ELECTIONS2024<<>>