News August 30, 2025

హైనాల ప్రేమకథ: నాలుగేళ్ల తర్వాత ముగింపు!

image

జపాన్‌లోని మారుయామా జూలో నిర్వాహకులు చేసిన పని నవ్వులు పూయిస్తోంది. జూలో రెండు హైనాలను ఉంచి వాటి పిల్లల కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇన్నేళ్లయినా పిల్లలు ఎందుకు పుట్టట్లేదని టెస్టులు చేయగా అవి రెండూ మగవే అని తేలింది. ఆడ, మగ హైనాల మర్మావయాలు ఒకేలా ఉండటంతోనే గుర్తించలేకపోయినట్టు తెలిసింది. ఇది అంతరించిపోతున్న జాతుల పునరుత్పత్తికి సైన్స్ ఎంత కీలకమో తెలియజేస్తోంది.

News August 30, 2025

అసెంబ్లీలో క్యాబినెట్ సమావేశం.. 42శాతం రిజర్వేషన్ల జీవోపై చర్చ

image

TG: అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చిస్తున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై జీవో విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపై కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థిక సాయం కోరుతూ తీర్మానం చేయనున్నట్లు సమాచారం.

News August 30, 2025

కాళేశ్వరం నివేదికపై హైకోర్టులో హరీశ్‌రావు పిటిషన్

image

కాళేశ్వరం నివేదికపై మాజీమంత్రి హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ‘వాస్తవాలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మేం ప్రజలకు నిజాలను వివరిస్తాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే ప్రభుత్వానికి ఎందుకు భయం? నిజాలు తేల్చాల్సింది కోర్టులు మాత్రమే’ అని పేర్కొన్నారు.

News August 30, 2025

చెంపదెబ్బ వీడియో.. శ్రీశాంత్ భార్య ఫైర్

image

IPL-2008లో శ్రీశాంత్‌ను హర్భజన్ చెంపదెబ్బ కొట్టిన <<17553113>>వీడియోను<<>> మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి ఇన్‌స్టా వేదికగా ఫైరయ్యారు. ‘లలిత్, మైకేల్ క్లార్క్ ఇలా చేయడం అమానుషం. చౌకబారు ప్రచారాలకు ఎప్పుడో జరిగిన విషయాన్ని లేవనెత్తడమేంటి? అసలు నిజాన్ని బయటపెట్టాలి. ఈ వీడియోతో ఆటగాళ్లు, కుటుంబాన్ని బాధపెట్టిన క్లార్క్, లలిత్‌పై కేసు పెట్టాలి’ అని మండిపడ్డారు.

News August 30, 2025

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

image

TG: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప తీర్మానం అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఉదయం 9 గంటలకు సభ మొదలవనుంది. ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చకు అనుమతించనుంది. అయితే దీనికి మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.

News August 30, 2025

విపత్కర పరిస్థితులు.. విరాళాలిస్తారా?

image

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేశాయి. రూ.వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ, నష్ట తీవ్రత అధికంగా ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సినీ, వ్యాపార రంగ ప్రముఖులు తమ వంతు సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు కోరుతున్నారు. గతంలోనూ వీరు CM రిలీఫ్ ఫండ్‌కు సాయం చేశారు.

News August 30, 2025

నా హత్యకు కుట్ర పన్నింది ఎవరో తేల్చాలి: కోటంరెడ్డి

image

AP: తన హత్యకు కుట్ర పన్నారు అన్న వార్తలపై నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి <<17554192>>శ్రీధర్ రెడ్డి<<>> స్పందించారు. ‘నన్ను చంపితే రూ.కోట్లు ఇస్తానని ఎవరు చెప్పారో పోలీసులు తేల్చాలి. YCP నేతలు, రౌడీ షీటర్ల బుడ్డ బెదిరింపులను నేను కాదు కదా.. నా మనవడు, నా మనవరాలు కూడా లెక్క చేయరు. ప్రతి మనిషికి ఏదో రోజు మరణం వస్తుంది. భయపడుతూ బతికే అలవాటు నాకు లేదు’ అని తెలిపారు.

News August 30, 2025

కుటుంబసభ్యులను కోల్పోయాం.. వారిని భర్తీ చేయలేం: RCB

image

బెంగళూరు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి RCB యాజమాన్యం తాజాగా పరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున అందించినట్లు ట్వీట్ చేసింది. ‘RCB కుటుంబంలోని 11 మందిని కోల్పోయాం. వారు మనలో భాగం. ఎన్ని డబ్బులిచ్చినా వారి స్థానాన్ని భర్తీ చేయలేం. కానీ మొదటి అడుగుగా రూ.25లక్షలు ఇచ్చాం’ అని ట్వీట్ చేసింది. ఘటన జరిగిన 3 నెలల తర్వాత RCB ఈమేరకు స్వయంగా స్పందించింది.

News August 30, 2025

సభలో మాగంటి మృతిపై సంతాప తీర్మానం

image

TG: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గోపీనాథ్ సేవలను గుర్తు చేసుకున్నారు. వివిధ పదవులతో జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. మాగంటితో తనకున్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని సభలో సీఎం పంచుకున్నారు. ఆయన అకాల మరణం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటన్నారు.

News August 30, 2025

అప్పులను కాదు.. ఆస్తులను కొనండి: గోయెంకా

image

ప్రస్తుతం గొప్పలకు పోయి అప్పులు చేస్తోన్న యువతకు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా పలు సూచనలు చేశారు. ‘మీ ఆదాయానికి తగ్గట్టు జీవించండి. ముందు నుంచే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. ఖర్చు చేసే ముందు పొదుపు చేయండి. అత్యవసర నిధిని ఉంచుకోండి. అధిక ఆదాయ నైపుణ్యాన్ని నేర్చుకోండి. అప్పులను కాదు ఆస్తులను కొనండి’ అని ఆయన ట్వీట్ చేశారు. share it