India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొత్త ఏడాది సందర్భంగా హైదరాబాద్లో ఇవాళ రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని TG ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. 9177624678 నంబర్కి కాల్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ అందిస్తామంది. నగర పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలను నివారించేందుకు తమ వంతు బాధ్యతగా ఈ సేవలు అందిస్తామని పేర్కొంది.

ఈ ఏడాది మెగా ఫ్యాన్స్కు అనేక తీపి గుర్తులను మిగిల్చింది. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారంతో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి ఏపీకి Dy.CM అయ్యారు. పాలనలోనూ గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఇక రామ్ చరణ్ ఈ ఏడాది డాక్టరేట్ అందుకోగా నాగబాబుకు ఏపీ మంత్రి వర్గంలో చోటు ఖరారైంది. దీంతో ఈ ఏడాది మెగా నామ సంవత్సరమని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో భారత ప్లేయర్ అశ్విన్(537 W)ను ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ అధిగమించారు. బాక్సింగ్ డే టెస్టులో 5 వికెట్లు తీయడంతో 538 వికెట్లతో 7వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో మురళీధరన్(800), షేన్ వార్న్(708), అండర్సన్(704), కుంబ్లే(619), బ్రాడ్(604), మెక్గ్రాత్(563) ముందు వరుసలో ఉన్నారు.

పార్లమెంటు ఆవరణలో ఇటీవల అధికార, విపక్షాల మధ్య జరిగిన తోపులాటలో గాయపడిన BJP MP ప్రతాప్ చంద్ర ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు రాహుల్ విపక్ష నేతగా కాకుండా బౌన్సర్గా ప్రవర్తించారని మండిపడ్డారు. BJP MPలను రాహుల్ నెట్టుకుంటూ వచ్చారని, దీంతో ఎంపీ ముకేశ్ తన మీద పడడంతో గాయపడినట్టు తెలిపారు. జగన్నాథుడి దయతోనే తాను కోలుకున్నట్టు పేర్కొన్నారు.

విదేశాల నుంచి ఇండియాకు ఎంత బంగారం తీసుకురావచ్చనే దానిపై చాలా మందికి ఓ సందేహం ఉంటుంది. ఏడాది కంటే ఎక్కువరోజులు విదేశాల్లో ఉండి ఇండియాకు వచ్చేవారిలో మగవారు 20గ్రా, ఆడవారు 40గ్రా బంగారాన్ని పన్ను లేకుండా తెచ్చుకోవచ్చు. దాటితే పన్ను చెల్లించాలి. టీవీలకు 38.50% పన్ను. 2 లీటర్ల ఆల్కహాల్కు ట్యాక్స్ ఉండదు. ఒక ల్యాప్టాప్ తెచ్చుకోవచ్చు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ రూ.50వేల కంటే తక్కువ ఉంటే ట్యాక్స్ ఫ్రీ.

AP: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం ఘటనలో నిందితులకు 12 రోజులు రిమాండ్ విధించారు. దీంతో వారిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. నిందితులుగా గోదాము మేనేజర్ మానస తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావు తదితరులు ఉన్నారు. ఈ కేసులో A1గా ఉన్న పేర్ని జయసుధకు నిన్న ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.

కొత్త ఏడాదిని ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు, డిస్కౌంట్ కూపన్లు, ఆఫర్ కూపన్లు, ఫ్రీ ఈవెంట్ పాస్లు, APK ఫైల్స్ వంటివి పంపి మీ సమాచారాన్ని హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. లింక్లు క్లిక్ చేయమని కోరే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇలాంటి వాటిపై <

TG: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. జనవరి 3న మహిళా శక్తి పథకం కింద 32 డ్వాక్రా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను అందించనుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఇందులో రూ.6లక్షలను (60%) సబ్సిడీగా నిర్ణయించగా వీటిని రూ.4లక్షలకే అందించనుంది. వడ్డీ లేని రుణం కింద రూ.4లక్షలు సెర్ప్ బ్యాంకుల నుంచి ఇప్పించనుంది.

ఢిల్లీలో మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణానికి స్థలం లభ్యతపై CPWD అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. స్మారకం నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేయాల్సి ఉంది. ట్రస్టుకు కేంద్రం భూమి అప్పగిస్తుంది. అనంతరం School of Planning & Architecture ఇచ్చే డిజైన్ ఆధారంగా స్మారకం నిర్మించాలి. ట్రస్టు నిధులు బదిలీ చేస్తే CPWD నిర్మిస్తుంది. వాజ్పేయి స్మారకం నిర్మాణంలో ఇదే విధానాన్ని అనుసరించారు.

స్టార్ హీరోయిన్ సమంత వల్లే తనకు బాలీవుడ్ మూవీ ‘బేబీ జాన్’లో నటించే అవకాశం వచ్చినట్లు మహానటి కీర్తి సురేశ్ చెప్పారు. ఈ సినిమాకు సమంతానే తనను రిఫర్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వరుణ్ ధవన్ ఈ విషయాన్ని తనకు చెప్పినట్లు కీర్తి తెలిపారు. కాగా ‘బేబీ జాన్’ మూవీ ‘తేరి’కి రీమేక్గా తెరకెక్కింది. తేరి సినిమాలో సమంత లీడ్ రోల్లో నటించారు.
Sorry, no posts matched your criteria.