India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వచ్చే పదేళ్లలో భారత్లో 10 ట్రిలియన్ యెన్ (జపాన్ కరెన్సీ)ల పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని PM మోదీ పేర్కొన్నారు. జపాన్ PM షిగేరు ఇషిబాతో ఆర్థిక సదస్సు అనంతరం మోదీ మాట్లాడారు. జపాన్ కంపెనీలు భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నామని మోదీ చెప్పారు. సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, స్పేస్, గ్రీన్ ఎనర్జీ, హైస్పీడ్ రైలుపై పరస్పర సహకారం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు.

తెలుగు భాష గొప్పతనం గురించి ఇప్పటి పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు పదాలు పలకడం వల్ల మన ఆరోగ్యమూ మెరుగవుతుంది. ఇది శరీరంలోని 72వేల నాడులను యాక్టివ్ చేసి మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. దేశంలో నాలుగో, ప్రపంచంలో 16వ అతిపెద్ద భాష కూడా తెలుగే. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామాల మధ్య ఉన్న భాగాన్ని ‘త్రిలింగ దేశం’ అనేవారు. ఈ ‘త్రిలింగ’ పదం నుంచే తెలుగు పదం వచ్చింది. share it

AP: భవిష్యత్తులో ఏఐ రెవల్యూషన్ రాబోతుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. దీంతో ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. విశాఖ జిల్లాలో సైయెంట్ ఫౌండేషన్ సహకారంతో 50 స్కూళ్లలో ఏఐ ల్యాబ్స్ను మంత్రి ప్రారంభించారు. ‘విద్యార్థులే మన భవిష్యత్తు, ఆస్తి, సంపద. వారి చదువు కోసం బుక్స్ నుంచి పరీక్షా విధానం వరకూ సమూలంగా మారుస్తున్నాం. ఏఐతో మెరుగైన అవకాశాలు లభిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు.

థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాను పదవి నుంచి తొలగించింది. పీఎంకి ఉండాల్సిన నైతిక ప్రమాణాలను ఆమె పాటించలేదని కోర్టు పేర్కొంది. కాల్పుల విరమణ సమయంలో ఆమె కంబోడియా మాజీ నేత హున్ సేన్తో మరీ లొంగిపోయినట్టు మాట్లాడిన ఆడియో ఇందుకు కారణంగా మారింది. ఆమె తొలగింపుతో ఇప్పుడు కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ దీనికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా అమలవుతోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకం కోసం త్వరలో మహిళలకు స్మార్ట్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం అమలు కోసం రూ.95 కోట్లు ఖర్చు చేశామని, త్వరలోనే కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. 60% మంది మహిళలు RTC బస్సులు ఎక్కుతున్నారని, ఈ పథకంతో నష్టపోతున్న ఆటోడ్రైవర్ల కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తామన్నారు.

TG: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిసి భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. సందీప్ రెడ్డి వెంట అతడి సోదరుడు ప్రణయ్ రెడ్డి కూడా ఉన్నారు. 2013లో ప్రణయ్ రెడ్డి భద్రకాళి ప్రొడక్షన్స్ను స్థాపించారు. దీని కింద అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలను నిర్మించారు. ప్రభాస్ ‘స్పిరిట్’నూ ఈ సంస్థే నిర్మిస్తోంది.

TG: రేపటి నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతే కాళేశ్వరం రిపోర్టుపై ముందుకు వెళ్తామని ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టుకు తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేత KCR అసెంబ్లీకి హాజరుకాలేదు. రేపు వస్తారో? లేదో? చూడాలి.

TG: భారీ వర్షాలకు 37 R&B డివిజన్లలో 1039 కి.మీ.మేర రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ‘794 సమస్యాత్మక రోడ్లు గుర్తించాం. 356 చోట్ల కాజ్ వేలు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. 37 చోట్ల రోడ్లు తెగిపోగా.. 10చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేశాం. 305 ప్రాంతాల్లో రాకపోకలకు నిలిచిపోగా, 236 చోట్ల క్లియర్ చేశాం. తాత్కాలిక పునరుద్ధరణకు రూ.53.76 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.1157.46 కోట్లు అవసరం’ అని తెలిపారు.

AP: వైఎస్ వివేకానంద హత్య కేసులో అన్ని సాక్ష్యాధారాలు ఉన్నా న్యాయం జరగడం లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ‘వివేకా హత్య కేసు దర్యాప్తు మళ్లీ ఎందుకు జరగకూడదు? సునీత ఆరోపణల్లో నిజం ఉంది. CBI తలుచుకుంటే ఎప్పుడో దోషులకు శిక్ష పడేది. జగన్ కోసం అవినాశ్ రెడ్డిని కాపాడుతున్నారు. హత్య జరిగిన సమయంలో అవినాశ్ అక్కడే ఉన్నట్లు గూగుల్ మ్యాప్ లొకేషన్లు కూడా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.

ఉమెన్ క్రికెట్ను గ్లోబల్గా ప్రమోట్ చేసేందుకు గూగుల్ సంస్థతో ICC ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఎక్కువ మందికి ఉమెన్ క్రికెట్ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ 2025, ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ఈవెంట్లను ప్రమోట్ చేయడంలో ఈ పార్ట్నర్షిప్ కీలకంగా వ్యవహరించనుంది. ఆండ్రాయిడ్, గూగుల్ జెమిని, గూగుల్ పిక్సెల్, గూగుల్ పే వంటి సర్వీసెస్ ద్వారా ఉమెన్ క్రికెట్ను ప్రమోట్ చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.