News August 29, 2025

భారత్-చైనా స్నేహం ప్రపంచానికి ముఖ్యం: PM

image

ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారత్, చైనా కలిసి పని చేయడం ముఖ్యమని PM మోదీ అన్నారు. చైనాతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచ శ్రేయస్సుకు అవసరమని తెలిపారు. గతేడాది జిన్‌పింగ్‌ను కలిసినప్పుడు సంబంధాల్లో పురోగతి కనిపించిందని, ఆయన ఆహ్వానం మేరకు SCO సమావేశానికి వెళ్తున్నానని చెప్పారు. జపాన్ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

News August 29, 2025

విశాల్ పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి తెలుసా?

image

హీరో <<17551492>>విశాల్<<>>, హీరోయిన్ సాయి ధన్షిక నిశ్చితార్థం జరిగింది. TN తంజావూరుకు చెందిన ఆమె 2006లో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ‘కబాలి’లో రజినీకాంత్ కూతురిగా కనిపించారు. షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి తెలుగు సినిమాల్లోనూ నటించారు. వీరిద్దరూ 8 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఓ సభలో ధన్షికపై కొన్ని కామెంట్స్ రావడంతో విశాల్ అండగా నిలిచారని, ఆ స్నేహం ప్రేమగా మారిందని టాక్. విశాల్, ధన్షికల వయసు 48, 35.

News August 29, 2025

RECORD: 4 బంతుల్లో 4 వికెట్లు

image

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్‌తో మ్యాచులో నార్త్ జోన్ ఫాస్ట్ బౌలర్ ఆఖిబ్ నబీ 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించారు. 53వ ఓవర్లో చివరి 3 బంతులకు 3 వికెట్లతో హ్యాట్రిక్ సాధించిన అతడు, తాను వేసిన తర్వాతి ఓవర్లో తొలి బంతికి మరో వికెట్ తీశారు. దీంతో ఈ టోర్నీలో 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. మొత్తంగా 5 వికెట్లు సాధించారు. ఇది ఆయనకు డెబ్యూ మ్యాచ్ కావడం గమనార్హం.

News August 29, 2025

మా లక్ష్యం అదే.. జపాన్‌లో మోదీ

image

వచ్చే పదేళ్లలో భారత్‌లో 10 ట్రిలియన్ యెన్ (జపాన్ కరెన్సీ)ల పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని PM మోదీ పేర్కొన్నారు. జపాన్ PM షిగేరు ఇషిబాతో ఆర్థిక సదస్సు అనంతరం మోదీ మాట్లాడారు. జపాన్ కంపెనీలు భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నామని మోదీ చెప్పారు. సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, స్పేస్, గ్రీన్ ఎనర్జీ, హైస్పీడ్ రైలుపై పరస్పర సహకారం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు.

News August 29, 2025

తెలుగు మాట్లాడితే మనశ్శాంతి!

image

తెలుగు భాష గొప్పతనం గురించి ఇప్పటి పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు పదాలు పలకడం వల్ల మన ఆరోగ్యమూ మెరుగవుతుంది. ఇది శరీరంలోని 72వేల నాడులను యాక్టివ్ చేసి మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. దేశంలో నాలుగో, ప్రపంచంలో 16వ అతిపెద్ద భాష కూడా తెలుగే. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామాల మధ్య ఉన్న భాగాన్ని ‘త్రిలింగ దేశం’ అనేవారు. ఈ ‘త్రిలింగ’ పదం నుంచే తెలుగు పదం వచ్చింది. share it

News August 29, 2025

భవిష్యత్తులో ఏఐ రెవల్యూషన్: లోకేశ్

image

AP: భవిష్యత్తులో ఏఐ రెవల్యూషన్ రాబోతుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. దీంతో ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. విశాఖ జిల్లాలో సైయెంట్ ఫౌండేషన్ సహకారంతో 50 స్కూళ్లలో ఏఐ ల్యాబ్స్‌ను మంత్రి ప్రారంభించారు. ‘విద్యార్థులే మన భవిష్యత్తు, ఆస్తి, సంపద. వారి చదువు కోసం బుక్స్ నుంచి పరీక్షా విధానం వరకూ సమూలంగా మారుస్తున్నాం. ఏఐతో మెరుగైన అవకాశాలు లభిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు.

News August 29, 2025

థాయిలాండ్ ప్రధాని పదవి నుంచి షినవత్రా తొలగింపు

image

థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం ప్రధాని పేటోంగ్‌టార్న్ షినవత్రాను పదవి నుంచి తొలగించింది. పీఎంకి ఉండాల్సిన నైతిక ప్రమాణాలను ఆమె పాటించలేదని కోర్టు పేర్కొంది. కాల్పుల విరమణ సమయంలో ఆమె కంబోడియా మాజీ నేత హున్ సేన్‌తో మరీ లొంగిపోయినట్టు మాట్లాడిన ఆడియో ఇందుకు కారణంగా మారింది. ఆమె తొలగింపుతో ఇప్పుడు కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ దీనికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News August 29, 2025

త్వరలో మహిళలకు స్మార్ట్ కార్డులు: మంత్రి

image

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా అమలవుతోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకం కోసం త్వరలో మహిళలకు స్మార్ట్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం అమలు కోసం రూ.95 కోట్లు ఖర్చు చేశామని, త్వరలోనే కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. 60% మంది మహిళలు RTC బస్సులు ఎక్కుతున్నారని, ఈ పథకంతో నష్టపోతున్న ఆటోడ్రైవర్ల కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తామన్నారు.

News August 29, 2025

సీఎంను కలిసిన సందీప్ రెడ్డి వంగా

image

TG: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. సందీప్ రెడ్డి వెంట అతడి సోదరుడు ప్రణయ్ రెడ్డి కూడా ఉన్నారు. 2013లో ప్రణయ్ రెడ్డి భద్రకాళి ప్రొడక్షన్స్‌ను స్థాపించారు. దీని కింద అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలను నిర్మించారు. ప్రభాస్ ‘స్పిరిట్’నూ ఈ సంస్థే నిర్మిస్తోంది.

News August 29, 2025

రేపటి నుంచి అసెంబ్లీ.. కేసీఆర్ వస్తారా?

image

TG: రేపటి నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతే కాళేశ్వరం రిపోర్టుపై ముందుకు వెళ్తామని ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టుకు తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేత KCR అసెంబ్లీకి హాజరుకాలేదు. రేపు వస్తారో? లేదో? చూడాలి.