India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: విశాఖలోని తొలి నేచర్ క్యూర్ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు మొదలవుతాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. విశాఖ, కాకినాడలో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయన్నారు. విశాఖలోనే ఆయుర్వేద మందుల తయారీ, నాణ్యత పరీక్షల ప్రయోగశాల రాబోతోందని వెల్లడించారు. కళాశాల పక్కనే 50 పడకలతో చేపట్టిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి నిర్మాణం కూడా చివరి దశలో ఉన్నట్లు తెలిపారు.

TG: గర్భిణి స్వాతి <<17503496>>హత్య కేసు<<>> వివరాలను మల్కాజ్గిరి DCP వెల్లడించారు. ‘నేరం చేసినట్లు విచారణలో మహేందర్ అంగీకరించాడు. చంపేసి స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లికి తిన్నాం అని మెసేజ్ చేశాడు. బాడీ డిస్పోజ్ చేయలేకే మీ అక్క మిస్సైందని ఆమె చెల్లికి చెప్పాడు. కులాంతర వివాహమే వారి గొడవలకు కారణం కావొచ్చు. ఏడాదిన్నరలో నాలుగుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాడీ స్వాతిదని తేల్చడానికి DNA టెస్ట్ చేయాలి’ అని తెలిపారు.

బిహార్లో ఓటర్ లిస్ట్కు సంబంధించి 98.2% మంది ఓటర్లు డాక్యుమెంట్లు సమర్పించారని భారత ఎన్నికల సంఘం(ECI) వెల్లడించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అనంతరం రూపొందించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్పై అభ్యంతరాలతో పాటు సర్వే సమయంలో ఇవ్వని డాక్యుమెంట్లను సమర్పించేందుకు EC అవకాశమిచ్చింది. ఇందులో భాగంగా జూన్ 24 నుంచి ఇప్పటివరకు 98.2% మంది డాక్యుమెంట్లు సమర్పించారని, మరో 8 రోజుల గడువు ఉందని తెలిపింది.

TG: హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం/రాత్రి వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో జల్లులు పడే ఛాన్స్ ఉందని, గంటకు 30-40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో అక్కడక్కడా సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు వర్షాలకు అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

AP: ఎరువుల ధరలు పెంచి అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని CM CBN ఉన్నతాధికారులను ఆదేశించారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలన్నారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్క్ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజిలెన్స్ ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. యూరియా, ఎరువులు పక్కదారి పట్టకుండా స్టాక్ చెకింగ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

USమేడ్ లాంగ్-రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్(ATACMS)ని ఉక్రెయిన్ వాడకుండా అమెరికా ఆపుతోందని WSJ పేర్కొంది. రష్యాపై ATACMS వాడేందుకు US అనుమతి కావాలని షరతు పెట్టినట్లు తెలిపింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపలేకపోయానని ట్రంప్ ఫ్రస్ట్రేషన్తో ఉన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. మరోవైపు రష్యాపై టారిఫ్స్ వేయడం లేదా శాంతి చర్చల నుంచి తప్పుకోవడంపై ఆలోచిస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.

పవర్స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక కాంబోలో సుజీత్ తెరకెక్కిస్తున్న OG మూవీపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి కానుకగా ఈనెల 27న 10.08AMకు సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ‘సువ్వీ సువ్వీ’ అంటూ సాగే సాంగ్ మిమ్మల్ని గెలుస్తుంది అంటూ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం SEP 25న విడుదల కానుంది.

AP: ‘ఆడుదాం ఆంధ్రా’పై విచారణ పూర్తయిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బాధ్యులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని ఆయన వివరించారు. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్టీలో అందరూ సమానమే అని పేర్కొన్నారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సౌతాఫ్రికా ఘోర ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 431 రన్స్ చేసింది. ఛేదనలో SA 155 రన్స్కే ఆలౌటైంది. దీంతో 276 రన్స్ తేడాతో ఓడిపోయింది. రన్స్ పరంగా వన్డేల్లో ఇది సౌతాఫ్రికాకు అతిపెద్ద ఓటమి. అంతకుముందు 2023 వరల్డ్కప్లో భారత్ చేతిలో 243 రన్స్ తేడాతో ఓడింది. కాగా AUSపై తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచిన సౌతాఫ్రికా 2-1తో సిరీస్ను సొంతం చేసుకుంది.

AP: గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. ‘మీ వాహనంపై చలానా ఉంది. వెంటనే చెల్లించండి’ అంటూ శుక్రవారం వాట్సాప్లో APK ఫైల్ మెసేజ్ చేశారు. ఆ లింక్ క్లిక్ చేయగానే ఓ యాప్ డౌన్లోడ్ అయింది. అది ఓపెన్ చేయగానే OTP అడిగింది. ఆ ప్రక్రియను ఆపేసినా అతడి ఖాతా నుంచి రూ.1.36 లక్షలు కాజేశారు. APK ఫైల్స్ ఓపెన్ చేయొద్దని, WhatsAppలో Auto-download ఆఫ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.