News March 30, 2024

లక్నో భారీ స్కోర్ 199/8

image

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ డికాక్(54) హాఫ్ సెంచరీ చేయగా కెప్టెన్ పూరన్(42) రాణించారు. చివర్లో కృణాల్ పాండ్య(43) మెరుపులతో లక్నో జట్టు 20 ఓవర్లలో 199/8 స్కోర్ నమోదు చేసింది. సామ్ కరన్ 3, అర్ష్‌దీప్ సింగ్ 2, రబాడ, రాహుల్ చాహర్ ఒక్కో వికెట్ తీశారు.

News March 30, 2024

25ఏళ్లలో భారీగా పడిపోనున్న ప్రపంచ జనాభా!

image

ప్రపంచ దేశాల జనాభాపై లాన్సెట్ జర్నల్ పరిశోధనలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. 25ఏళ్లలో 155 దేశాలు/టెర్రిటరీల్లో జనాభా గణనీయంగా పడిపోనుందని పరిశోధకులు తెలిపారు. 2100కు ఆ దేశాల సంఖ్య 198కు చేరడమే కాక జననాల రేటు మరణాల రేటు కంటే తక్కువగా ఉండనుందట. ఈ నేపథ్యంలో రానున్న మార్పులు ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

News March 30, 2024

BREAKING: దసరా సెలవుల ప్రకటన

image

TG: జూనియర్ కాలేజీల 2024-25 విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 1 నుంచి ఫస్ట్, సెకండియర్ తరగతులు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 6-13 వరకు దసరా సెలవులు, నవంబర్ 18-23 వరకు హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్, 2025 జనవరి 11-16 వరకు సంక్రాంతి సెలవులుంటాయి. జనవరి 20-25 వరకు ప్రీఫైనల్స్, ఫిబ్రవరి తొలివారంలో ప్రాక్టికల్స్, మార్చి మొదటి వారంలో థియరీ పరీక్షలుంటాయని బోర్డు వెల్లడించింది.

News March 30, 2024

అద్భుతం.. ఒక బిడ్డ పుట్టిన 22 రోజులకు మరో శిశువు జననం

image

నిమిషాల వ్యవధిలో పుట్టిన వాళ్లను కవలలు అంటాం. అయితే ENGలో డోయల్ అనే మహిళకు ఓ బిడ్డ పుట్టి చనిపోయిన 22 రోజులకు మరో శిశువు జన్మించింది. ఇది అరుదైన సంఘటన అని, కవలలు ఇంత గ్యాప్‌లో జన్మించడం చూడలేదని వైద్యులు తెలిపారు. ‘బొడ్డు తాడులో రక్తం గడ్డకట్టి మొదటి శిశువు చనిపోయింది. తర్వాత నొప్పులు రాకపోవడంతో ఇంటికి పంపాం. 22 రోజులకు పెయిన్స్ రావడంతో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశాం’ అని పేర్కొన్నారు.

News March 30, 2024

రేపు జగన్ బస్సు యాత్రకు బ్రేక్

image

AP: రేపు బస్సు యాత్రకు సీఎం జగన్ విరామం ప్రకటించారు. ఈస్టర్ సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన సీఎం బస్సు యాత్ర.. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది.

News March 30, 2024

ఎల్లో అలర్ట్: అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

image

తెలంగాణలో ఎండ బెంబేలెత్తిస్తోంది. నిత్యం సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బయటికి వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

News March 30, 2024

జమ్మూ కశ్మీర్‌లో సీఎం రేవంత్ ప్రచారం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి జమ్మూ కశ్మీర్‌లో ప్రచారం చేయనున్నారు. ఇండియా కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ఆయన అక్కడికి వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. కాంగ్రెస్ ఇప్పటికే 27 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. కాగా రేవంత్ ఇటీవల ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో పాల్గొన్నారు.

News March 30, 2024

రాజకీయాలకు TDP మాజీ మంత్రి వీడ్కోలు

image

AP: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ రాజకీయాలకు వీడ్కోలు పలికారు. విశాఖపట్నం జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ప్రకటన చేశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్న ఆయన, రాజకీయంగా తనకు ఇదే చివరి సమావేశం అన్నారు. సాటి కార్యకర్తలకు అండగా నిలబడతానన్నారు.

News March 30, 2024

కాసేపట్లో కేశవరావు ఇంటికి సీఎం రేవంత్

image

TG: కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి మరికాసేపట్లో వెళ్లనున్నారు. ఆయనను లాంఛనంగా పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇదిలా ఉంటే కేకే కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు.

News March 30, 2024

రాహుల్‌కి ఏమైంది? కెప్టెన్సీ మార్పు ఎందుకు?

image

పంజాబ్‌తో మ్యాచ్‌లో లక్నో కెప్టెన్సీ బాధ్యతలు నికోలస్ పూరన్ నిర్వర్తిస్తున్నారు. అకస్మాత్తుగా కెప్టెన్సీ మార్పుపై అందరిలో సందేహలు నెలకొన్నాయి. అయితే ఈ విషయంలో పూరన్ క్లారిటీ ఇచ్చారు. ‘రాహుల్ గాయం నుంచి కోలుకొని దాదాపు రెండు నెలల తర్వాత క్రికెట్ ఆడుతున్నారు. ఆయనకు కొంచెం విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం. రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా అందుబాటులో ఉంటారు’ అని పూరన్ వెల్లడించారు.