News March 30, 2024

YCP ఇచ్చేది రూ.10.. దోచేది రూ.100: బాబు

image

AP: వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ప్రజలకు రూ.10 ఇస్తూ.. రూ.100 దోచుకుంటుందని ఆరోపించారు. ‘పేదలకు సాయం చేయాలని జగన్‌కు లేదు. ఈ ఐదేళ్లలో ఎలాంటి మార్పు జరగలేదు. జగన్ పాలనలో అన్ని వర్గాలూ దెబ్బతిన్నాయి. రాష్ట్రం మొత్తాన్ని దోచుకోవాలని ఆయన ఆశ. వైసీపీని ఓడించేందుకు ప్రజలు చిత్తశుద్ధితో ఉన్నారు. మేం ఎప్పుడూ పేదల పక్షమే’ అని ఆయన పేర్కొన్నారు.

News March 30, 2024

హేమ మాలినిపై బాక్సర్ విజేందర్ సింగ్ పోటీ

image

ప్రముఖ నటి హేమ మాలినిపై స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ పోటీ చేయనున్నారు. మథుర బీజేపీ ఎంపీ అభ్యర్థిగా హేమ బరిలోకి దిగగా.. విజేందర్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఏప్రిల్ 26న ఇక్కడ పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే వరుసగా రెండుసార్లు మథుర ఎంపీగా గెలిచిన హేమపై విజేందర్ పైచేయి సాధిస్తాడా? లేదా అనేది చూడాలి.

News March 30, 2024

పాండ్యపై ద్వేషం సరికాదు: అశ్విన్

image

రోహిత్‌ స్థానంలో MI కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన పాండ్యపై అభిమానుల ద్వేషం సరికాదని భారత క్రికెటర్ అశ్విన్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీ వంటి లెజెండరీ క్రికెటర్లపై చేసే కామెంట్స్ చూస్తుంటే క్రికెట్‌లో నెలకొన్న ద్వేషపూరిత వాతావరణం తెలుస్తుంది. గంగూలీ కింద సచిన్ ఆడారు. వారిద్దరూ ద్రవిడ్ కెప్టెన్సీలో ఆడారు. ఆ ముగ్గురు కుంబ్లే కెప్టెన్సీలో.. మళ్లీ వాళ్లంతా ధోనీ సారథ్యంలో ఆడారు’ అని అశ్విన్ గుర్తు చేశారు.

News March 30, 2024

ALERT: ఇంట్లో ఉన్న ఆడవాళ్లే టార్గెట్!

image

భర్త ఆఫీస్‌కు వెళ్లాక, ఇంటి పని చేసుకొని కాసేపు సోషల్ మీడియాలో కాలక్షేపం చేసే ఆడవాళ్లే లక్ష్యంగా సైబర్ మోసాలు మొదలయ్యాయి. వారికి పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో వల వేస్తున్నారు. ఫోన్‌తో ఇంట్లోనే కూర్చొని జాబ్ చేయవచ్చని, నెలకు ₹20వేల వరకూ సంపాదించుకోవచ్చని ఆశ పెడుతున్నారు. ఇంటి ఖర్చులకైనా అవుతాయని నమ్మి చాలామంది మోసపోతున్నారు. ఇలాగే తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఓ మహిళ రూ.4.63లక్షలు పోగొట్టుకున్నారు. SHARE

News March 30, 2024

బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

image

ఎన్నికల్లో 400 సీట్ల బంపర్ మెజార్టీనే లక్ష్యంగా పెట్టుకున్న BJP తమ మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కో-కన్వీనర్‌గా వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ ఉన్నారు. ఈ 27 మంది సభ్యుల కమిటీలో అశ్వినీ వైష్ణవ్, స్మృతీ ఇరానీ మొదలైన కేంద్ర మంత్రులూ ఉన్నారు.

News March 30, 2024

ఫేక్ ప్రచారాలను ఇలా అడ్డుకుందాం

image

Way2News పేరుతో కొందరు అసత్య ప్రచారాలు వైరల్ చేస్తున్నారు. మా లోగోతో వచ్చే వార్తలు నిజంగా మా నుంచి పబ్లిష్ అయ్యాయా? లేదా సులువుగా వెరిఫై చేయొచ్చు. మా ప్రతి ఆర్టికల్‌కు ప్రత్యేక కోడ్ ఉంటుంది. మీకు వచ్చిన స్క్రీన్‌షాట్‌పై కోడ్‌ను యాప్‌లో లేదా fc.way2news.comలో ఎంటర్ చేస్తే ఆ ఆర్టికల్ చూపించాలి. వేరే ఆర్టికల్ వచ్చినా, ఏ వార్త రాకపోయినా ఆ ఫార్వర్డ్ మాది కాదు. వీటిని grievance@way2news.comకు పంపవచ్చు.

News March 30, 2024

ఇన్‌స్టా రీల్స్: ఇలా తయారయ్యారేంటి?

image

ఈమధ్య ఇన్‌స్టా ఇన్‌ప్లూయెన్సర్లు రీల్స్ చేసేందుకు ఏ ప్రదేశమూ అనర్హం కాదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కొంతకాలం క్రితం మెట్రో రైళ్లలో మొదలైన ఈ ట్రెండ్ ఈ మధ్య రోడ్లపై నడిచే బైకులపై, ఇప్పుడు ఎయిర్‌పోర్టులకు వ్యాపించింది. కొందరు తమ ఆఫీసు‌లలో రీల్స్ చేస్తుంటే.. మరికొందరు ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లలో చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎక్కడి వరకు పాకుతుందో చూడాలి. దీనిపై మీ కామెంట్.

News March 30, 2024

రష్యాలో భారతీయులకు నరకం! – 1/2

image

ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యన్ ఏజెంట్లు విదేశీయులను ట్రాప్ చేస్తున్నారు. హరియాణా యువకులు ముకేశ్ (21), సన్నీ (24) సైతం ఇలాగే మోసపోయి నరకం అనుభవించారు. జర్మనీలోని ఓ హోటల్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి బ్యాంకాక్ తీసుకెళ్లి అక్కడి నుంచి వీరిని బెలారస్-రష్యా బోర్డర్‌కు తరలించారట. అడవుల్లోని క్యాంపుల్లో బంధించి చిత్రహింసలు పెట్టారట. ఇలా దక్షిణాసియాకు చెందిన దాదాపు 200 మంది చిక్కుకున్నారట.

News March 30, 2024

రష్యాలో భారతీయులకు నరకం! – 2/2

image

సైన్యంలో చేరితే రష్యా వర్క్ పర్మిట్లు, రష్యన్ యువతితో వివాహం, రష్యన్ పాస్‌పోర్టు ఇస్తామని ఈ ఏజెంట్లు మొదట ఆఫర్ చేస్తారట. ఇందుకు అంగీకరించనందుకు జైల్లో టార్చర్ పెట్టారని బాధితులు వాపోయారు. రూ.6లక్షలు ఖర్చు చేసి ఓ లాయర్ సాయంతో బయటపడి స్వదేశానికి తిరిగొచ్చామన్నారు. గతంలోనూ పలువురు భారతీయులు రష్యాలో చిక్కుకుని నరకం అనుభవించారు. అస్ఫన్ అనే హైదరాబాదీ సైతం ఇలాగే మోసపోయి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు.

News March 30, 2024

ఆ కోరిక తీరకుండానే మరణించిన ప్రముఖ నటుడు

image

గుండెపోటుతో మరణించిన నటుడు డేనియల్‌ బాలాజీకి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చిన ఆయన తర్వాత నటుడయ్యారు. డైరెక్షన్ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ మూవీకి తన స్నేహితుడు ఎమ్ఆర్ గణేశ్ నిర్మాతగా వ్యవహరిస్తాడని కూడా ప్రకటించారు. కానీ తర్వాత ఆ సినిమా పట్టాలెక్కలేదు. డైరెక్టర్ అవ్వాలన్న డేనియల్ చివరి కోరిక తీరలేదు.