India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AUS మహిళా క్రికెటర్లను ఓ వ్యక్తి <<18103257>>అసభ్యంగా<<>> తాకిన ఘటనపై MPకి చెందిన మంత్రి విజయ్వర్గీయా కామెంట్స్ దుమారం రేపాయి. ‘ఈ ఘటన ప్లేయర్లకు గుణపాఠం లాంటిది. ENGలో ఓ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్కు అమ్మాయి కిస్ ఇవ్వడం, అతడి దుస్తులు చింపేయడం వంటివి చూశాను. ప్లేయర్లు తమ పాపులారిటీని తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. ఆయనపై విపక్షాలు, ఉమెన్ రైట్స్ గ్రూప్స్ భగ్గుమన్నాయి.

కంది పంటలోని నీటిని తొలగించాలి. 19:19:19 లేదా పొటాషియం నైట్రేట్ 1% పిచికారీ చేయాలి. ఎండు తెగులు కనిపిస్తే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లలో పిచికారీ చేయాలి. పూత దశలో శనగ పచ్చ/మారుకా మచ్చల పురుగు కనిపిస్తే క్లోరిపైరిఫాస్ 20EC 2.5మి.లీ లేదా నొవాల్యురాన్ 10EC 10మి.లీ లీటరు నీటికి, పురుగు ఎక్కువగా ఉంటే స్పైనోసాడ్ 45SC 0.3మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

AP: భారీ వర్షాలకు పత్తి చేను ముంపునకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర వ్యవసాయశాఖ కొన్ని సూచనలు చేసింది. ముందుగా పత్తిచేలో వర్షపు నీటిని తొలగించాలి. చాలా చోట్ల పత్తి పూత, కాయ దశలో ఉంది. పైపాటుగా యూరియా ఎకరానికి 30kgలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 15kgలు భూమిలో వేయాలి. 2% యూరియా లేదా 2% పొటాషియం నైట్రేట్ను 1శాతం మెగ్నీషియం సల్ఫేట్తో కలిపి 5 నుంచి 7 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి.

అధిక వర్షాల వల్ల కొన్ని రకాల తెగుళ్లు కూడా ఆశించే అవకాశం ఉంది. ఆకుమచ్చ, కాయకుళ్లు తెగులు నివారణకు లీటరు నీటికి మాంకోజెబ్ 3గ్రా. లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3గ్రా. కలిపి మార్చి మార్చి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు మాత్రమే ఉంటే లీటరు నీటికి ప్రోపికొనజోల్ 1ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ పూత, కాయలు రాలితే లీటరు నీటికి నాఫ్తాలిన్ అసిటిక్ యాసిడ్ (ప్లానోఫిక్స్) 0.25ml కలిపి పిచికారీ చేయాలి.

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా సీనియర్ మోస్ట్ జడ్జి జస్టిస్ సూర్యకాంత్ నియామకం లాంఛనమే కానుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ఆయన పేరును ఇవాళ కేంద్రానికి సిఫార్సు చేశారు. దీనికి ఆమోదముద్ర పడితే 53వ సీజేఐగా సూర్యకాంత్ నియమితులు అవుతారు. ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇక జస్టిస్ బీఆర్ గవాయ్ నవంబర్ 23న రిటైర్ అవుతారు.

✒ గింజ రంగు మారడం, పాము పొడ, కాటుక తెగులును అరికట్టడానికి ఎకరానికి 200ml ప్రాపికోనజోల్ పిచికారీ చేయాలి. ✒ గింజలపై మొలకలు కనిపిస్తే ఆ మొక్కలపై 5% ఉప్పు ద్రావణం (50గ్రా. గళ్ల ఉప్పు/లీటరు నీరు) పిచికారీ చేయాలి.
✒ నీరు తగ్గాక ఎకరాకు 20kgల చొప్పున యూరియా, పొటాష్ వేయాలి. ✒ మడులు కుళ్లకుండా లీటరు నీటికి 1గ్రా. కార్బెండాజిమ్ పిచికారీ చేయాలి.
✍️ ఇలాంటి అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ ఇండియా( EPI)18 మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీటెక్, బీఈ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.50వేలు, HRA చెల్లిస్తారు. వెబ్సైట్:https://epi.gov.in/

పుణ్యమార్గంలో సంపాదించిన ధనం శుభకరం. ఆ ధనం ధార్మిక భోగాలను అందించి, మనస్సుకు శాంతిని ఇస్తుంది. చివరకు జీవుడు ఆ భోగాలపై మోహం వీడి, శాశ్వతమైన వైరాగ్యాన్ని, ముక్తిని పొందుతాడు. కానీ అన్యాయంగా ఆర్జించిన ద్రవ్యం మాత్రం మనస్సును రాగ బంధంలో పడేస్తుంది. అది భోగాన్ని ఇవ్వక, అంతిమంగా శారీరక, మానసిక రోగాలకే హేతువవుతుంది. ధర్మం పరమార్థం వైపు నడిపిస్తే, అధర్మం పతనానికి దారి తీస్తుంది. <<-se>>#SIVOHAM<<>>

AP: తుఫాను హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తుఫాను ప్రభావిత జిల్లాలకు శాటిలైట్ ఫోన్లు అందించడంతో పాటు NDRF, SDRF బృందాలను సిద్ధం చేశామన్నారు. సహాయక చర్యల కోసం ఇరిగేషన్, సివిల్ సప్లైస్, మెడికల్, విద్యుత్ శాఖల సిబ్బంది కూడా రెడీగా ఉన్నట్లు వివరించారు. అలాగే కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని, ప్రజలు అత్యవసర సాయం, తుఫాను సమాచారం కోసం పై నంబర్లను సంప్రదించాలన్నారు.

AP: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం జగన్ చేపట్టిన కోటి సంతకాల సేకరణ యజ్ఞంలా సాగుతోందని YCP ట్వీట్ చేసింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారంది. పార్టీ నేతలు YS అవినాశ్రెడ్డి, YS మనోహర్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన కార్యక్రమం జరుగుతోందని పేర్కొంది. ప్రైవేటీకరణతో ప్రజలకు కలిగే నష్టాలను వివరిస్తూ సంతకాలు సేకరిస్తున్నారంది.
Sorry, no posts matched your criteria.