India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మీరు రోజూ తాగాల్సిన నీటి పరిమాణం మీ బరువు, వాతావరణం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. అయితే, రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆహారంలో నీరు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలని చెబుతున్నారు. అలాగే.. పై లక్షణాలు రెగ్యులర్గా కనపడితే అప్రమత్తం అవ్వాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగినంత నీటిని తాగుతూ హైడ్రేటెడ్గా ఉండటం ముఖ్యమని చెబుతున్నారు.

వెనిజులా ఆయిల్ ఆదాయంపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అకౌంట్లలో ఉండే ఆ సొమ్మును ఎవరూ జప్తు చేయకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఈ డబ్బును US తన విదేశీ విధానాల కోసం వాడుకోనుంది. నార్కో టెర్రరిజం అరికట్టడానికి, అక్రమ వలసలు ఆపడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని వైట్ హౌస్ తెలిపింది. వెనిజులా ఇకపై అమెరికాతోనే వ్యాపారం చేస్తుందని, ఇది రెండు దేశాలకు మంచిదని ట్రంప్ చెప్పారు.

ప్రతి రోజూ 8AMకి అల్పాహారం తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ‘జీవక్రియ మెరుగుపడుతుంది. బరువు కంట్రోల్లో ఉంటుంది. శరీరంలో శక్తి స్థాయులు పెరుగుతాయి. బాడీకి అవసరమయ్యే గ్లూకోజ్ అంది రోజంతా చురుకుగా ఉంటారు. డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది’ అని పేర్కొంటున్నారు. ప్రొటీన్, ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలని, <<17756449>>బ్రేక్ఫాస్ట్<<>> ఆలస్యంగా చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.

TG: రాష్ట్రంలో రాత్రి నుంచి ఉదయం వరకు చలి వణికిస్తోంది. పొగమంచు, చలి గాలుల తీవ్రతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే 3 రోజులు చలి మరింత పెరుగుతుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈ నెల చివరి వారంలో ఉత్తర, మధ్య తెలంగాణ, తూర్పు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

మాస్ మహారాజా రవితేజ తన నెక్ట్స్ సినిమా డైరెక్టర్ను అనౌన్స్ చేశారు. నిన్ను కోరి, మజిలీ వంటి హిట్ మూవీలు తీసిన శివ నిర్వాణతో కలిసి పని చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల థ్రిల్లర్ జోనర్లో ఆయన కథ వినిపించగా రవితేజకు నచ్చి ఓకే చేసినట్లు సమాచారం. త్వరలోనే మూవీపై అధికారిక ప్రకటన రానుందని టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. అటు రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈనెల 13న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

రెండేళ్ల గ్యాప్ తర్వాత 2026 జూన్ నుంచి టెలికం కంపెనీలు రీఛార్జ్ల ధరలు పెంచే ఛాన్స్ ఉంది. 15% నుంచి 20% వరకు పెరగొచ్చని జెఫరీస్, మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు అంచనా వేశాయి. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ యూజర్లపై ఈ ప్రభావం ఉంటుంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు తక్కువ ధర ప్లాన్స్ తీసేసి OTT బెనిఫిట్స్, హై-ఎండ్ ప్లాన్స్ను మారుస్తున్నాయి. ఆదాయం (ARPU) పెంచుకోవడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నాయి.

డెయిరీఫామ్ సక్సెస్.. ఆ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా తాగే పాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఎక్కువగా ఆవు పాలు తాగే దగ్గర గేదెలతో డెయిరీఫామ్ పెట్టడం వల్ల లాభం ఉండదు. దీన్ని కూడా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలి. అయితే చాలా మంది వినియోగదారుల్లో ఆవు పాలు మంచివా? గేదె పాలు మంచివా? అనే సందేహం ఉంటుంది. అసలు వీటి మధ్య తేడా ఏమిటి? ఏ మిల్క్ వల్ల ఏ లాభాలుంటాయో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

ఈరోజు ప్రశ్న: కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడి సోదరుడు అయిన బలరాముడు ఎందుకు పాల్గొనలేదు? ఆయన ఆయుధం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<

ఆవు పాలలో కొవ్వు శాతం గేదె పాల కంటే తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి సులువుగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే ప్రోటీన్స్ కండరాలను బలోపేతం చేస్తాయి. ఆవు పాలలో అధిక కాల్షియం, విటమిన్ డి ఎముకలు, దంతాలను బలపరుస్తాయి. శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. గుండె జబ్బులు ఉన్నా, బాగా లావుగా ఉన్నా, జీర్ణ సమస్యలు ఉంటే ఆవు పాలను తాగడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులకు ఆవు పాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.