India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐటీ శాఖ రూ.1823.08 కోట్ల విలువైన ట్యాక్స్ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ ట్యాక్స్ టెర్రరిజమ్కు పాల్పడుతోందని.. తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అయినా తగ్గేది లేదని స్పష్టం చేసింది. ‘BJP కూడా ఎన్నో ఉల్లంఘనలకు పాల్పడింది. ఆ పార్టీపై ఉన్న రూ.4600 కోట్ల పెనాల్టీలకు సంబంధించి కూడా ఐటీ శాఖ నోటీసులు ఇచ్చి ఆ మొత్తాన్ని వసూలు చేయాలి’ అని డిమాండ్ చేసింది.
AP: చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం నెలకొందనే ప్రచారం సాగుతోంది. YCP MLA అభ్యర్థి మనోహర్ నాయుడికి వ్యతిరేక, అనుకూల గ్రూపులుగా పట్టణ కౌన్సిలర్లు చీలిపోయినట్లు తెలుస్తోంది. ఆయనకు సహకరించేది లేదని 12 మంది కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. వీరంతా తొలుత వైసీపీ టికెట్ పొందిన మల్లెల రాజేశ్ నాయుడికి టచ్లో ఉన్నట్లు టాక్. రాజేశ్తో పాటు వారు టీడీపీలో చేరుతారని స్థానికంగా చర్చ జరుగుతోంది.
బిహార్లో లోక్సభ సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలు ప్రకటన విడుదల చేశారు. పూర్నియా, హాజీపూర్లతో సహా 26 స్థానాల్లో ఆర్జేడీ అభ్యర్థులు పోటీ చేయనుండగా, కిషన్గంజ్, పట్నా సాహిబ్ సహా 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగనున్నారు. లెఫ్ట్ పార్టీలు 5 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్(7.7) కంటే ఆర్జేడీకే(15.36) ఓటు శాతం ఎక్కువగా ఉంది.
ఎంపీ అభ్యర్థులు: విజయనగరం- అప్పలనాయుడు, ఒంగోలు- మాగుంట శ్రీనివాసులురెడ్డి, కడప-భూపేష్ రెడ్డి, అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణ.
ఎమ్మెల్యే అభ్యర్థులు: చీపురుపల్లి- కళా వెంకట్రావు, పాడేరు- వెంకట రమేశ్, రాజంపేట- సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు- వీరభద్ర గౌడ్, గుంతకల్లు- గుమ్మనూరు జయరాం, కదిరి- వెంకట ప్రసాద్, భీమిలి- గంటా శ్రీనివాస్, దర్శి- గొట్టిపాటి లక్ష్మి, అనంతపురం- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్.
TG: తాను ఇంకా కాంగ్రెస్లో చేరలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆ పార్టీలో చేరే విషయమై రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరీ ఆయన ఇంటికెళ్లి కలిశారు. శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించినట్లు మున్షీ తెలిపారు.
AP: సీఎం జగన్ మొన్నటి వరకు పరదాల చాటున తిరిగారని, ఇప్పుడు బయటికి వస్తే ప్రజలు పారిపోతున్నారని TDP చీఫ్ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల్లో సానుభూతి కోసం గతంలో కోడి కత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు వివేకా హత్య కేసులో చెల్లిని జైలుకు పంపాలని ఆలోచిస్తున్నారు. మద్యం, ఇసుకలో దోచుకున్న సొమ్ములు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలిపోతున్నాయి. డబ్బుతో ఓట్లు కొనాలనుకుంటున్నారు’ అని ఆరోపించారు.
జూన్లో పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును BCCI త్వరలోనే ప్రకటించనుంది. ప్లేయర్ల ఎంపికపై సెలక్టర్లు కసరత్తు చేస్తున్నారు. వరల్డ్ కప్లో బరిలోకి దిగే భారత ప్రాబబుల్-11ను తాజాగా Sportstar ప్రకటించింది. రోహిత్, జైస్వాల్, కోహ్లీ, సూర్య, రింకూ, హార్దిక్, జురెల్, జడేజా, అక్షర్, బుమ్రా, సిరాజ్ ఆ టీమ్లో ఉన్నారు. ఈ జట్టు ట్రోఫీ గెలుస్తుందని భావిస్తున్నారా? కామెంట్ చేయండి..
AP: అనపర్తి ఎమ్మెల్యే టికెట్ కోల్పోయిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఇంటికి టీడీపీ నేతలు వెళ్లారు. మాజీ మంత్రి చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వద్ద నల్లమిల్లి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వైసీపీ వాళ్లు మమ్మల్ని భౌతికంగా అంతమొందించాలని చూస్తే.. టీడీపీ అధిష్ఠానం రాజకీయంగా అంతం చేయాలని చూసిందంటూ రామకృష్ణా రెడ్డి తల్లి వాపోయారు. కాగా పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి వెళ్లింది.
AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు జగన్ పాలన చేస్తారని జోస్యం చెప్పారు. సీఎం ఆదేశాలతో ఇకపై ఎలాంటి ఉద్యమాలు ఉండవన్నారు. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు జనసేన పార్టీని ప్యాక్ చేస్తారన్నారు. పవన్ కంటే చిరంజీవి చాలా బెటర్ అని అన్నారు.
TG: ఇటీవల 11,062 పోస్టులతో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షకు సన్నద్ధమయ్యే BC అభ్యర్థులకు పుస్తకాల కోసం బీసీ స్టడీ సర్కిల్ రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10వేల మందికి లబ్ధి చేకూరనుంది. దీనికోసం <
Sorry, no posts matched your criteria.