News December 30, 2024

మదనపల్లె ఫైల్స్ దహనం.. ప్రధాన నిందితుడు గౌతమ్ అరెస్ట్

image

AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరులో అతడిని అదుపులోకి తీసుకుని చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. గౌతమ్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. జులై 21న జరిగిన అగ్నిప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

News December 30, 2024

₹21 వేల కోట్ల‌కు డిఫెన్స్ ఎగుమతులు: రాజ్‌నాథ్

image

ద‌శాబ్ద కాలంలో డిఫెన్స్ ఎగుమతులు ₹2 వేల కోట్ల నుంచి ₹21 వేల కోట్ల‌కు పెరిగాయ‌ని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆర్మీ వార్ కాలేజీలో ఆయ‌న మాట్లాడుతూ 2029 నాటికి ₹50 వేల కోట్ల ఎగుమ‌తులు ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు వెల్ల‌డించారు. AI, సైబ‌ర్‌, స్పేస్ ఆధారిత స‌వాళ్లు అధిక‌మ‌వుతున్న నేపథ్యంలో సైన్యం వీటిని ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్ధ‌మై ఉండాలన్నారు. మహూలో శిక్షణ కేంద్రాల పనితీరును రాజ్‌నాథ్ అభినందించారు.

News December 30, 2024

‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ ఇప్పుడెలా ఉన్నాడంటే?

image

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు బులెటిన్ రిలీజ్ చేశారు. రెండు రోజులుగా మినిమల్ వెంటిలేటర్ సపోర్ట్‌తో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. న్యూరోలాజికల్ స్టేటస్‌లో పెద్దగా మార్పు లేదన్నారు. ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గిందని, పైప్ ద్వారానే ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడికి జ్వరం లేదని వివరించారు.

News December 30, 2024

శివాజీ విగ్రహం ఏర్పాటుపై అభ్యంత‌రాలు!

image

లద్దాక్‌లోని పాంగాంగ్ సరస్సు ఒడ్డున ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుపై తమ అభిప్రాయాల‌ను ప‌ట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ నిర్ణ‌యం స్థానికుల్ని అసంతృప్తికి గురి చేసింద‌ని, ఈ ప్రాంతంలో ఉన్న ప్ర‌త్యేక వాతావ‌ర‌ణం-వైల్డ్‌లైఫ్‌కి విగ్ర‌హ ఏర్పాటుకు ఉన్న సంబంధం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల్ని, ప్ర‌కృతికిని గౌర‌వించే ప్రాజెక్టుల‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌ని స్థానికులు కోరుతున్నారు.

News December 30, 2024

75 రోజుల్లో రూ.6,312 కోట్ల మద్యం తాగేశారు

image

AP: రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ ప్రకటించిన తర్వాత అమ్మకాలు జోరందుకున్నాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 మధ్య 75 రోజుల్లోనే రూ.6,312 కోట్ల విలువైన లిక్కర్ సేల్ అయినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 83,74,116 కేసుల లిక్కర్, 26,78,547 కేసుల బీర్లు అమ్ముడుపోయినట్లు తెలిపింది. ఇవాళ, రేపు, జనవరి 1న మద్యం అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేసింది.

News December 30, 2024

రేపు హైదరాబాద్‌లో ఉచిత ప్రయాణ సౌకర్యం!

image

TG: న్యూ ఇయర్ సందర్భంగా రేపు రాత్రి హైదరాబాద్‌లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మద్యం మత్తులో ప్రమాదాలకు గురవకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

News December 30, 2024

ఆతిశీని కేజ్రీవాల్ టెంపరరీ సీఎం అనడం అవమానకరం: ఢిల్లీ LG

image

ఢిల్లీ CM ఆతిశీ మార్లేనాను అరవింద్ కేజ్రీవాల్ టెంపరరీ CM అనడం బాధించిందని లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా బాంబుపేల్చారు. ఇది ఒక రకంగా తనకూ అవమానమేనని పేర్కొన్నారు. న్యూఇయర్ విషెస్ చెబుతూ ఆమెకు లేఖ రాశారు. ‘మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను మనస్ఫూర్తిగా అభినందించాను. మీరు CM అవ్వడం నాకూ సంతోషమే. మీ పూర్వ CM చేయలేని పనులనూ మీరు చక్కబెడుతున్నారు. మంత్రిగానూ నిబద్ధతతో పనిచేశారు’ అని పేర్కొన్నారు.

News December 30, 2024

Good News: ఎయిడ్స్ టీకాకు USFDA ఆమోదం

image

ఎప్పుడెప్పుడా అని ప్రపంచమంతా ఎదురుచూస్తున్న HIV/AIDS వ్యాక్సిన్ వచ్చేసింది. గిలీడ్ సైన్సెస్ రూపొందించిన Lenacapavirకు USFDA అనుమతి ఇచ్చింది. మూడేళ్లలోనే ఈ టీకా 20 లక్షల మందికి చేరనుంది. ఎయిడ్స్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న దక్షిణాఫ్రికా, టాంజానియాలో నిర్వహించిన ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని తెలిసింది. ఏడాదికి 2సార్లు తీసుకోవాల్సిన ఈ టీకా ఖరీదు సామాన్యులకు అందుబాటులో ఉండదన్న ఆందోళన నెలకొంది.

News December 30, 2024

ఎయిడ్స్‌తో ఇప్పుడు ఎందరు బతుకుతున్నారంటే..

image

HIV/AIDSను 1983లో మొదటిసారి అమెరికాలో గుర్తించారు. అక్కడి నుంచి అన్ని దేశాలకు పాకేసింది. ప్రపంచానికి ఇదో పెనుముప్పుగా మారడంతో ‘ఎయిడ్స్‌కు మందు లేదు. నివారణే మార్గం’ అన్న నినాదం పుట్టుకొచ్చింది. HIV సోకి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.2 కోట్ల మంది చనిపోయారని అంచనా. మొత్తంగా 8.8 కోట్ల మందికి సోకింది. 2023 చివరి నాటికి 4 కోట్ల మంది ఎయిడ్స్‌తోనే బతుకుతున్నారు. ఎట్టకేలకు వ్యాక్సిన్ రావడం భారీ ఊరట.

News December 30, 2024

ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు: మంత్రి

image

APలో ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామన్నారు. భూమి విలువల కంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్న చోట రిజిస్ట్రేషన్ విలువలను తగ్గిస్తామని చెప్పారు. విలువలు పెరిగే చోట సగటున 15 నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంటుందని పేర్కొన్నారు.