India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సైనిక బలాబలాల గురించి చూస్తే..
క్రియాశీల బలగాలు: ఇరాన్-6,10,000మంది, ఇజ్రాయెల్- 1,70,000మంది
రిజ్వర్వు బలగాలు: ఇరాన్-3,50,000, ఇజ్రాయెల్-4,65,000
రక్షణ బడ్జెట్: ఇరాన్-9.9 బిలియన్ డాలర్లు, ఇజ్రాయెల్-24.4 బిలియన్ డాలర్లు
ఫైటర్ జెట్లు: ఇరాన్-186, ఇజ్రాయెల్-241
హెలికాప్టర్లు, ట్యాంకులు: ఇరాన్-129, 2000, ఇజ్రాయెల్-146, 1300
సబ్మెరైన్లు: ఇరాన్-19, ఇజ్రాయెల్-5
AP: రేపు రాష్ట్రంలోని పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు అనంతపురంలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
టీమ్ ఇండియాతో జరగబోయే టీ20 సిరీస్ను కైవసం చేసుకుంటామని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ధీమా వ్యక్తం చేశారు. ‘మా జట్టులో యువ క్రికెటర్లు ఉన్నారు. వారందరూ భారత్పై సత్తా చాటుతారు. టీ20 సిరీస్కు మేం అన్ని విధాలా సిద్ధమయ్యాం. దూకుడుగా ఆడాలని భావిస్తున్నాం. సిరీస్ గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతాం. టీ20ల్లో ఆ రోజున ఎవరు బాగా ఆడితే వారిదే విజయం’ అని ఆయన చెప్పుకొచ్చారు.
TG: 2036 ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త స్పోర్ట్స్ పాలసీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలన్నారు. హైదరాబాద్లోని స్టేడియాలను ఒక హబ్గా చేయడంతో పాటు స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పార్లమెంటులో తనకు కేటాయించిన గదిలోకి అనుమతి లేకుండా CPWD, CISF, టాటా ప్రాజెక్ట్ సిబ్బంది ప్రవేశించడంపై ఖర్గే మండిపడ్డారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్కు లేఖ రాశారు. ‘ఇది అసాధారణ పరిణామం. ఎంపీగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నాకున్న అధికారాలు, నిబంధనలను ఉల్లంఘించడమే. ఎవరి ఆదేశానుసారం వారు ప్రవేశించారు?. దీన్ని సీరియస్గా తీసుకోవాలి’ అని ఖర్గే పేర్కొన్నారు.
TG: మంత్రి కొండా సురేఖపై రూ.100 కోట్ల దావా వేసే ప్రక్రియలో ఉన్నట్లు హీరో నాగార్జున తెలిపారు. ‘వివాదం తర్వాత సమంతకు ఆమె క్షమాపణలు చెప్పారు. నాకు, నా కుటుంబానికి మాత్రం అపాలజీ చెప్పలేదు. అందుకే ఇప్పటికే సురేఖపై క్రిమినల్, పరువు నష్టం కేసు వేశాం. క్షమాపణ చెప్పినా కేసు వెనక్కి తీసుకోం. మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. వివాదంలో ఇండస్ట్రీ మొత్తం మాకు అండగా నిలిచింది’ అని ఆయన TimesNowతో చెప్పారు.
కంగన నటించిన ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగినట్టే కనిపిస్తోంది. సర్టిఫికేషన్ సంబంధిత సమస్యలను CBFCతో పరిష్కరించుకున్నట్టు చిత్ర నిర్మాతలు బాంబే హైకోర్టుకు తెలిపారు. బోర్డు సూచించిన మార్పులకు ఫిలిం మేకర్స్ అంగీకరించారు. అన్ని మార్పులతో కూడిన చిత్రం కాపీని బోర్డు మరోసారి వీక్షించనుంది. ఈ ప్రక్రియతో సర్టిఫికెట్ జారీకి 14 రోజులు పడుతుందని కోర్టుకు బోర్డు తెలిపింది.
మహిళా టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు ముందు న్యూజిలాండ్ 161 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా కివీస్ బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్లు ప్లిమ్మర్(34), బేట్స్(27) శుభారంభాన్ని ఇచ్చారు. మరో బ్యాటర్ డివైన్ (57) అర్థసెంచరీ చేయడంతో NZ 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రేణుక 2, అరుంధతి, శోభన తలో వికెట్ తీశారు.
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మరణించారు. సరిహద్దుల్లో మావోలు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో బలగాలు కూంబింగ్ చేపట్టారు. వారికి మావోలు తారసపడటంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కాగా ఈ ఏడాది జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 180 మంది మావోయిస్టులు మరణించారు.
డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు ఒబామా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కమల అభ్యర్థిత్వ నామినేషన్కు ఒబామా, ఆయన సతీమణి మిచెల్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. స్వింగ్ ఓటర్లే లక్ష్యంగా Oct 10న పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్లో ఒబామా మొదటి ప్రచార సభ జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ సభలో కమల కూడా పాల్గొనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.