India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గత ఏడాది యూకే పర్యటన సందర్భంగా వినాయక్ దామోదర్ సావర్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల కేసులో రాహుల్ గాంధీకి పుణే కోర్టు సమన్లు జారీ చేసింది. కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ వివిధ సందర్భాల్లో పదే పదే సావర్కర్ పరువు తీస్తున్నారని సావర్కర్ సోదరుడి మనమడు సాత్యకి కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీని చట్ట ప్రకారం విచారించి శిక్షించాలని, నష్టపరిహారం విధించాలని సాత్యకి కోరారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా మరోసారి సెటైర్ వేశారు. ‘చె గువేరాతో ప్రారంభమై.. సనాతన ధర్మం వరకూ సాగిన మీ ప్రయాణం.. ఇంకెక్కడి దాకా స్వామీ?’ అంటూ ట్వీట్ చేశారు. కాగా ‘బాబు సిట్ను రద్దు చేసి సుప్రీంకోర్టు సిట్ వేయడాన్ని స్వాగతిస్తున్నాం’ అంటూ ఆయన మరో ట్వీట్ చేశారు.
వుమెన్స్ టీ20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమ్ ఇండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్: షఫాలీ, స్మృతి, హర్మన్, రోడ్రిగ్స్, రిచా, దీప్తి, వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, అరుంధతి, రేణుకా సింగ్, ఆశా.
కివీస్: బేట్స్, ప్లిమ్మర్, అమేలియా కెర్, డివైన్(సి), హాలిడే, గ్రీన్, ఇసాబెల్లా, జెస్ కెర్, మెయిర్, ఈడెన్ కార్సన్, లీ తహుహు.
మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 30 మంది మరణించారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.
AP: సీఎం చంద్రబాబు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇవాళ రాత్రికి ఆయన కొండపైనే బస చేయనున్నారు. రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
AP: వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ CM చంద్రబాబుకు లేఖ రాశారు. జిల్లాకు కడప అని పేరు పెట్టడం వెనుక చారిత్రక నేపథ్యం ఉందన్నారు. తిరుమలకు వెళ్లే భక్తులు ముందుగా కడపలోని వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారన్నారు. అవగాహనా రాహిత్యంతో వైసీపీ ప్రభుత్వం జిల్లా పేరును మార్చిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రస్తావించినట్లు పేర్కొన్నారు.
AP: తిరుమలలో బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం సందర్భంగా గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిందనే ప్రచారాన్ని నమ్మొద్దని TTD ట్వీట్ చేసింది. బ్రహ్మోత్సవాలలో ప్రతీదీ తనిఖీ చేయడం ఆనవాయితీ అని, దీనిలో భాగంగా భిన్నమైన వాటిని తొలగించి కొత్త వాటిని అమర్చడం సంప్రదాయమని తెలిపింది. ఈ క్రమంలో పాడైన కొక్కిని తొలగించి కొత్త దాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని పేర్కొంది.
TG: యూట్యూబర్ హర్షసాయి లైంగిక వేధింపుల కేసులో ఆయన తండ్రి రాధాకృష్ణ, యూట్యూబర్ ఇమ్రాన్ ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కేసులో నిందితులుగా చేర్చకముందే బెయిల్ ఎలా ఇస్తారని పిటిషనర్లను ప్రశ్నించింది. కాగా ఇప్పటికే హర్షసాయితోపాటు రాధాకృష్ణ, ఇమ్రాన్లపై కూడా అత్యాచార బాధితురాలు ఫిర్యాదు చేశారు. హర్షతో తనకు పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చి మోసం చేశారని ఆమె పేర్కొన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల తరువాత మరోసారి దేశంలో ఎగ్జిట్ పోల్స్ సందడి నెలకొంది. జమ్మూకశ్మీర్, హరియాణ ఎన్నికలకు సంబంధించి శనివారం సాయంత్రం 6 గంటల తరువాత పలు సంస్థలు తమ అంచనాలను వెల్లడించనున్నాయి. ఇప్పటికే JK ఎన్నికలు ముగిశాయి. శనివారం హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోలింగ్ సమయం ముగిసిన తరువాత ఫలితాల అంచనాలు వెలువడనున్నాయి.
AP: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. స్విగ్గీ, జొమాటో వల్ల తమకు తీవ్ర నష్టం కలుగుతోందని పేర్కొంది. తమ అభ్యంతరాలకు జొమాటో ఒప్పుకోగా, స్విగ్గీ అంగీకరించలేదని తెలిపింది. నగదు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నందుకే స్విగ్గీని బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.