News November 5, 2024

2024 US elections: పోలింగ్ ప్రారంభం

image

అమెరికా 47వ అధ్య‌క్ష ఎన్నిక‌కు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. 24 కోట్ల మంది ఓటర్లలో ఇప్ప‌టికే 7.7 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. రెడ్‌, బ్లూ స్టేట్స్‌లో పెద్ద‌గా హడావుడి లేక‌పోయినా స్వింగ్ స్టేట్స్‌లో ఉత్కంఠ నెల‌కొంది. డెమోక్రాట్ల నుంచి క‌మ‌ల‌, ఆమె ర‌న్నింగ్ మేట్‌గా టీమ్ వాల్జ్‌, రిప‌బ్లిక‌న్ల నుంచి ట్రంప్‌, ఆయ‌న ర‌న్నింగ్ మేట్‌గా జేడీ వాన్స్ బ‌రిలో ఉన్నారు.

News November 5, 2024

రేపట్నుంచి ఒంటిపూట బడులు

image

TG: రాష్ట్రంలో రేపట్నుంచి ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ప్రభుత్వం చేయనున్న కులగణన సర్వేలో ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ల టీచర్లను వినియోగించుకోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రైమరీ స్కూల్స్ ఉ.9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేస్తాయి. సర్వే పూర్తయ్యే వరకు ఈ ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి. అటు ఈ సర్వేను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

News November 5, 2024

ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు

image

ప్ర‌భుత్వ నియామ‌కాల్లో మ‌హిళ‌ల‌కు ఉన్న 33% రిజ‌ర్వేష‌న్ల‌ను 35 శాతానికి పెంచేందుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు CM మోహ‌న్ యాద‌వ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన క్యాబినెట్‌ భేటీలో నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో అన్ని ర‌కాల ప్ర‌భుత్వ నియామకాల్లో (ఫారెస్ట్ మినహా) మహిళలకు 35% రిజర్వేషన్లు అమలుకానున్నాయి. మహిళా సాధికారతలో ఈ నిర్ణయం కీలక ముందడుగని డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లా పేర్కొన్నారు.

News November 5, 2024

భారత్ బ్రాండ్: రూ.30కే గోధుమ పిండి, రూ.34కే బియ్యం

image

కేంద్రం భారత్ బ్రాండ్ రెండో దశను ఆవిష్కరించింది. కాస్త ధరలు పెంచి రూ.30కే కేజీ గోధుమ పిండి, రూ.34కే KG బియ్యం వినియోగదారులకు ఇవ్వనుంది. 5-10 KGల బ్యాగులను NCCF, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అమ్మనుంది. వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు దీనిని అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఫేజ్-1లో రూ.27.50కే కేజీ గోధుమ పిండి, రూ.29కే కిలో బియ్యం అందించింది.

News November 5, 2024

US Elections: డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం

image

న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాచ్‌లో పోలింగ్ ముగిసింది. తొలి ఫ‌లితం కూడా వ‌చ్చేసింది. అర్హులైన ఓటర్లు అతిత‌క్కువగా ఉండే ఈ ప్రాంతంలో 1960 నుంచి మిగిలిన రాష్ట్రాల కంటే ముందే పోలింగ్ జ‌రుగుతోంది. ఈ ఫ‌లితాల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌న‌కు చెరో మూడు చొప్పున బ్యాలెట్ ఓట్లు ద‌క్కాయి. యూఎస్-కెనడా సరిహద్దులోని ఈ పట్టణ ప్రజలు గత రెండు అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చారు.

News November 5, 2024

నవంబర్ 25 నుంచి పార్లమెంటు సమావేశాలు

image

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా వక్ఫ్ సవరణ బిల్లు సహా దేశంలో జమిలి ఎన్నికల బిల్లు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నవంబర్ రెండో వారంలో పలు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉపఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో కొత్త స‌భ్యుల ప్రమాణం కూడా ఉంటుంది.

News November 5, 2024

ఎల్లుండి ‘థగ్ లైఫ్’ నుంచి స్పెషల్ అప్డేట్

image

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన ‘థగ్ లైఫ్’ సినిమా నుంచి ఎల్లుండి స్పెషల్ అప్డేట్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. పెన్సిల్ ఆర్ట్‌తో కూడిన కమల్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. లోకనాయకుడి బర్త్ డే సందర్భంగా ఈనెల 7న ఉదయం 11 గంటలకు సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ వస్తుందన్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించారు.

News November 5, 2024

USA ఎన్నికలు: అంతరిక్షం నుంచి ఓటింగ్

image

మరికొన్ని గంటల్లో USA అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈక్రమంలో స్పేస్ స్టేషన్‌లో చిక్కుకున్న సునీతా విలియమ్స్‌, మరో ముగ్గురు వ్యోమగాములు ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తారు. నాసా పంపిన అప్లికేషన్‌లో వారు ఓటేయగానే ఆ డేటాను శాటిలైట్ ద్వారా రిసీవ్ చేసుకుంటారు. దీనిని ఓటరు, ఎన్నికల అధికారి మాత్రమే చూడగలరు. కాగా, ఇలా తొలిసారి 1997లో డేవిడ్ వోల్ఫ్ ఓటేయగా చివరిసారి 2020లో కేట్ రూబిన్స్ ఓటేశారు.

News November 5, 2024

PIC OF THE DAY: కొడుకు, కూతురితో కోహ్లీ

image

టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా ఆయన భార్య అనుష్క శర్మ ఇన్‌స్టాలో ఓ ఫొటోను షేర్ చేశారు. కూతురు వామిక, కొడుకు అకాయ్‌తో కోహ్లీ సరదాగా గడిపిన సందర్భాన్ని ఫొటోలో చూపించారు. అయితే, ఇద్దరు పిల్లల ముఖాలు కనిపించకుండా స్టిక్కర్‌తో కవర్ చేశారు. ఈ ఫొటోను కోహ్లీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

News November 5, 2024

విద్యార్థినులను పరామర్శించిన మంత్రులు పొన్నం, సురేఖ

image

TG: ఫుడ్ పాయిజన్‌తో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాంకిడి ఆశ్రమ విద్యార్థినులను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య సిబ్బందిని ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.