News March 27, 2024

భూమిని తాకిన శక్తిమంతమైన సౌర తుఫాన్!

image

సూర్యుడి నుంచి బయలుదేరిన సౌర తుఫాను నిన్న భూమిని తాకిందని అమెరికాలోని NOAA పరిశోధకులు వెల్లడించారు. గత ఆరేళ్లలో ఇదే అత్యంత శక్తిమంతమైనదని, దీని కారణంగా భూ అయస్కాంత క్షేత్రానికి భంగం కలిగిందని వివరించారు. కాగా.. చరిత్రలో అతి పెద్ద సౌర తుఫాను 1859లో వచ్చింది. ఆ సమయంలో దానివలన టెలిగ్రాఫ్ సేవలకు అంతరాయం కలిగింది. 2011 ఫిబ్రవరిలో వచ్చిన సౌర తుఫాను జీపీఎస్ సంకేతాలకు స్వల్ప అంతరాయం కలిగించింది.

News March 27, 2024

ఐపీఎల్ ట్రోఫీ గెలిచేందుకు కోహ్లీ అర్హుడు: బ్రాడ్

image

ఆర్సీబీకి ఐపీఎల్ ట్రోఫీ అందించే అర్హత విరాట్ కోహ్లీకి ఉందని ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డారు. ‘తను ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్లలో ఒకరు. రెండు నెలల విరామంతో చాలా తాజాగా కనిపిస్తున్నారు. క్రికెట్ అభిమానులందరూ విరాట్ ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నారు. అది ఈ ఏడాదే కావచ్చు లేదా మరి కొన్నేళ్లు కావొచ్చు కానీ ఆ ట్రోఫీకి తను అర్హుడు’ అని వ్యాఖ్యానించారు.

News March 27, 2024

మరో సీటుకు పట్టుబడుతున్న బీజేపీ?

image

AP: పొత్తులో భాగంగా రాష్ట్రంలో పది అసెంబ్లీ సీట్లు దక్కించుకున్న బీజేపీ, అనపర్తి సీటుకు బదులు రాజమండ్రి రూరల్ లేదా అర్బన్‌ సీట్లలో ఒకటివ్వాలని కోరుతున్నట్లు సమాచారం. పార్టీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును అక్కడి నుంచి పోటీకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అర్బన్‌కు ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్‌కు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని టీడీపీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం ఆసక్తికరంగా మారింది.

News March 27, 2024

మైక్రోసాఫ్ట్‌లో మరో భారతీయుడికి అగ్ర పదవి

image

మైక్రోసాఫ్ట్‌కు ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈఓగా ఉండగా, తాజాగా మరో భారతీయుడు సంస్థలో అగ్రపదవిలో నియమితులయ్యారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని కంపెనీ నియమించింది. ఆయన 2001 నుంచీ మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు. గడచిన మూడేళ్లుగా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

News March 27, 2024

ఆ సినిమాలో హీరోయిన్ స్నేహ కాదు: శ్రీను వైట్ల

image

20 ఏళ్ల క్రితం విడుదలైనప్పటికీ నేటికీ తాజాగా అనిపించే సినిమా వెంకీ. రవితేజ, స్నేహ జంటగా నటించిన ఈ మూవీలోని కామెడీ సీన్స్ ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. తొలుత అందులో హీరోయిన్‌ స్నేహ కాదని దర్శకుడు శ్రీను వైట్ల తెలిపారు. ‘ముందుగా అసిన్‌ను తీసుకోవాలని భావించాం. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో స్నేహను తీసుకున్నాం. ట్రైన్ సీన్‌లోనూ ఎంఎస్ నారాయణను అనుకున్నాం గానీ అదీ కుదరలేదు’ అని వెల్లడించారు.

News March 27, 2024

నేడు ‘మగధీర’ రీరిలీజ్

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ మూవీ నేడు రీరిలీజ్ కానుంది. చెర్రీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా స్క్రీనింగ్ అయ్యే థియేటర్లలో ‘గేమ్ ఛేంజర్’ మూవీలోని ‘జరగండి’ పాట కూడా ప్రదర్శించనున్నారు. ఇది మెగా ఫ్యాన్స్‌కు డబుల్ బ్లాస్ట్ అని సంబరపడిపోతున్నారు.

News March 27, 2024

హైదరాబాద్‌లో వర్సిటీకి మహీంద్రా రూ.500 కోట్లు!

image

హైదరాబాద్‌లో ఉన్న తమ మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదలు ఐదేళ్ల పాటు ఈ నిధుల్ని దశలవారీగా వర్సిటీకి అందించాలని తమ కుటుంబం నిర్ణయించిందని తెలిపారు. వర్సిటీ అనుబంధ పాఠశాల ఇందిరా మహీంద్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు మరో రూ.50 కోట్లు ఇస్తామన్నారు. మహీంద్రా గ్రూపు వర్సిటీని నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది.

News March 27, 2024

సౌదీ అరేబియా సంచలన నిర్ణయం

image

సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ చరిత్రలోనే తొలిసారి మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించింది. ఇందుకోసం రుమీ అల్ కతానీని ఈ పోటీలకు ఎంపిక చేసింది. ఈ మేరకు రుమీ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని తెలిపారు. కాగా 73వ మిస్ యూనివర్స్ పోటీలు ఈ ఏడాది సెప్టెంబర్ 28న మెక్సికోలో జరగనున్నాయి. ఈ పోటీల్లో సౌదీ అరేబియా తొలిసారి భాగం కానుంది.

News March 27, 2024

‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ టైమ్ ఫిక్స్

image

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ట్రైలర్ రేపు విడుదల కానుంది. హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు సాయంత్రం తిరుపతిలో కూడా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే నెల 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

News March 27, 2024

అయోధ్య రామమందిరం వద్ద పేలిన రైఫిల్!

image

అయోధ్య రామమందిరం వద్ద రైఫిల్ పేలుడు కలకలం రేపింది. ఆలయం వద్ద భద్రతావిధుల్లో ఉన్న ప్లటూన్ కమాండర్ రామ్ ప్రసాద్(53) అనే వ్యక్తి, తన ఏకే-47 రైఫిల్‌ను శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. తూటా ఎడమవైపు ఛాతీ నుంచి దూసుకెళ్లడంతో ప్రసాద్‌ తీవ్రంగా గాయపడ్డారని, ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.