News October 4, 2024

హైకోర్టులో సజ్జలకు ఊరట

image

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దర్యాప్తునకు సహకరించాలని సజ్జలను ఆదేశించింది. కేసుపై విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.

News October 4, 2024

జగన్ చెప్పేది ప్రజలు వినరు: పయ్యావుల

image

AP: సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మాజీ సీఎం వైఎస్ జగన్ వక్రీకరించారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆయన మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. ‘వైసీపీ పాలనలో తిరుమల అపవిత్రమైంది. శ్రీవారిని నమ్ముతున్నానని జగన్ ఒక్క మాట కూడా అనలేదు. ఎంతసేపూ లడ్డూ ప్రసాదం గురించే మాట్లాడుతున్నారు. కోర్టు ఆర్డర్ రాకముందే జగన్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. దోషులు ఎవరనేది విచారణలో తేలుతుంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News October 4, 2024

మారుమూల ప్రాంతాలకూ పార్సిల్ డెలివరీ!

image

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌ పోస్టల్ శాఖతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా అత్యంత మారుమూల ప్రాంతాలకూ పార్సిల్ డెలివరీ చేయనుంది. దేశంలో పెరుగుతున్న ఇ-కామర్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు రెండు సంస్థలూ తెలిపాయి. అమెజాన్, పోస్టల్ శాఖ 2013 నుంచి కలిసి పని చేస్తున్నాయి.

News October 4, 2024

మ‌హిళ‌ల‌పై నేరాలు చూడ‌లేక క‌ళ్లు మూసుకున్న దుర్గామాత‌ విగ్ర‌హం వైర‌ల్‌

image

ట్రైనీ డాక్ట‌ర్‌ హ‌త్యాచార ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ కోల్‌కతాలో ద‌స‌రా ఉత్సవాల నిర్వాహకులు ఓ మండపంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం ఆలోచింపజేస్తోంది. జీవ‌చ్ఛవంలా పడి ఉన్న బాధితురాలిని చూడలేక దుర్గామాత కళ్లు మూసుకున్నట్టు, సింహం సిగ్గుతో తలదించుకున్నట్టు విగ్రహాల్ని ఏర్పాటు చేశారు. మహిళలపై నేరాలకు నిరసనగా ఏర్పాటు చేసిన ఈ మండపం ‘లజ్జా’ (అవమానం) ఇతివృత్తంతో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

News October 4, 2024

అందుకే పాక్ కంటే ఇంగ్లండ్ బెటర్: పాక్ క్రికెటర్

image

ఇంగ్లండ్ ప్రొఫెషనల్ క్రికెట్ అద్భుతంగా ఉంటుందని పాక్ క్రికెటర్ మొహమ్మద్ అబ్బాస్ తెలిపారు. జీతాలు, బట్టలు, ఆహారం అన్నీ పాకిస్థాన్ కంటే బెటర్‌గా అందిస్తుందని చెప్పారు. ‘క్వీన్ ఎలిజబెత్ చనిపోయినా ఇంగ్లండ్ క్రికెట్ షెడ్యూల్ మార్చలేదు. ఆటగాళ్లకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. కానీ పాక్‌లో ఇలాంటి పరిస్థితులు లేవు. పీసీబీ చెప్పినట్లే నడుచుకోవాలి. అందుకే కౌంటీల్లో ఆడేందుకే నా ప్రాధాన్యం’ అని ఆయన చెప్పుకొచ్చారు.

News October 4, 2024

దసరాకు ప్రత్యేక రైళ్లు

image

దసరా సెలవుల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్ నగర్, తిరుపతి రైల్వే స్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

News October 4, 2024

అత్యంత ధనిక యాక్టర్ ఈయనే!

image

ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మేల్ యాక్టర్స్ జాబితాలో నటుడు, చిత్రనిర్మాత టైలర్ పెర్రీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన సంపద నికర విలువ దాదాపు $1.4 బిలియన్ (₹11,750 కోట్లు). రెండో స్థానంలో హాస్యనటుడు జెర్రీ సీన్‌ఫెల్డ్ ($1 బిలియన్) ఉన్నారు. వీరి తర్వాత డ్వేన్ జాన్సన్ ($890 మిలియన్లు), షారుఖ్ ఖాన్ ($870 మిలియన్లు), టామ్ క్రూయిజ్ ($800 మిలియన్లు) ఉన్నారు.

News October 4, 2024

ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సల్స్ హతం

image

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-నారాయణ్‌పూర్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సలైట్లు మరణించారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆటోమేటిక్ గన్లు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

News October 4, 2024

Stock Market: మ‌ళ్లీ నేల‌చూపులు

image

స్టాక్ మార్కెట్లు మ‌ళ్లీ నేల‌చూపులు చూశాయి. ప్రారంభ సెష‌న్‌లో Higher Highsతో దూసుకుపోయిన సూచీలు మ‌ధ్నాహ్నం 12.30 గంట‌ల‌కు రివ‌ర్సల్ తీసుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 808 పాయింట్లు న‌ష్టంతో 81,688 వ‌ద్ద‌, నిఫ్టీ 200 పాయింట్ల భారీ న‌ష్టంతో 25,049 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. ఒకానొక ద‌శ‌లో 25,485కు చేరుకున్న నిఫ్టీ ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. 83,372కు చేరుకున్న తరువాత BSE సూచీలో కూడా అదే ప్యాటర్న్ కనిపించింది.

News October 4, 2024

పెళ్లి సందడి.. ఈ సీజన్‌లో 48 లక్షల పెళ్లిళ్లు!

image

రెండు నెలల విరామం తర్వాత నవంబర్ 12 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవనుంది. 45రోజుల పాటు సాగే ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా 48 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. వీటికోసం రూ.6 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు భారతీయులు సిద్ధమవుతున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) సర్వే పేర్కొంది. ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల పెళ్లిళ్ల ద్వారా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగనుందని తెలిపింది.