News October 3, 2024

వివేకా హత్య కేసు.. నిందితుడు సునీల్ యాదవ్‌కు బెయిల్

image

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పర్సనల్ బాండ్‌తోపాటు రూ.25వేల పూచీకత్తులు రెండు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి శనివారం పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఉదయ్‌కుమార్, శివశంకర్‌రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఎంపీ అవినాశ్‌‌కు ముందస్తు బెయిల్‌‌ లభించింది.

News October 3, 2024

సమంత తెలుగు ఇండస్ట్రీకి దొరికిన వరం: డైరెక్టర్

image

మంత్రి కొండా సురేఖ నటి సమంతపై చేసిన వ్యాఖ్యలకు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ‘ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరం. నేను రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. 365 రోజులూ సమంతను దగ్గరుండి చూశా. ఒక అభిమానిగా చెప్తున్నా ఆమె తెలుగు ఇండస్ట్రీకి దొరికిన వరం. ఆమె ఆర్టిస్ట్‌గా కాదు.. ఇంట్లో అక్కలా అనిపించేవారు. సురేఖ గారు మాట్లాడింది తప్పు’ అని పేర్కొన్నారు.

News October 3, 2024

అనర్హత పిటిషన్లపై 24న విచారణ

image

TG: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. 24న మరోసారి వాదనలు వింటామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తామే సుమోటోగా విచారిస్తామని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు.

News October 3, 2024

కాంగ్రెస్ కొంపముంచిన ‘కొండా’ వ్యాఖ్యలు!

image

TG: KTRపై ఆరోపణలు చేసే క్రమంలో సమంత, అక్కినేని కుటుంబాలపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత <<14254371>>వ్యాఖ్యలు<<>> తీవ్ర వివాదానికి దారితీశాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమవడంతోపాటు ప్రజలు, రాజకీయ పక్షాలు ఆమె తీరును ఖండించాయి. ఇప్పటికే ‘హైడ్రా’తో GHMC పరిధిలో పేదల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి సురేఖ వ్యాఖ్యలు మరింత డ్యామేజ్ కలిగించాయి. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

News October 3, 2024

కొండా సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు?

image

TG: తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖకు నటుడు అక్కినేని నాగార్జున నోటీసులు పంపుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వైజాగ్‌లో ఉన్నారని, హైదరాబాద్ రాగానే నోటీసులు పంపాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎంతవరకైనా పోరాడాలని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

News October 3, 2024

కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: పురందీశ్వరి

image

అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి తెలిపారు. ‘రాజకీయ నాయకులు దేశానికి, రాష్ట్రానికి సేవ చేస్తే, సినీనటులు ప్రజలకు వినోదం అందిస్తారు. ఇతరులను కించపరచకుండా, వారిని గౌరవిస్తే సముచితంగా ఉంటుంది. సినీ, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తిగా, మహిళగా మంత్రి మాటలను ఖండిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News October 3, 2024

జానీ మాస్టర్‌కు బెయిల్

image

మహిళా కొరియోగ్రాఫర్‌‌పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరు సినిమాలోని ‘మేఘం కరిగేనా’ పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డు అందుకోవడానికి ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.

News October 3, 2024

అజహరుద్దీన్‌కు ఈడీ నోటీసులు

image

TG: మాజీ ఎంపీ అజహరుద్దీన్‌కు ఈడీ నోటీసులు అందజేసింది. HCA అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలు, మనీలాండరింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. 2020-23 మధ్య కాలంలో HCAలో దాదాపు రూ.3.8 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఉప్పల్ PSలో ఫిర్యాదులు నమోదయ్యాయి.

News October 3, 2024

మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తారు?: లావణ్య

image

TG: అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మెగా హీరో వరుణ్ తేజ్, ఆయన భార్య లావణ్య త్రిపాఠి స్పందించారు. ‘సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఓ మహిళే తన తోటి మహిళను అవమానించడం సిగ్గుచేటు. ఎందుకు ఎప్పుడూ మమ్మల్నే టార్గెట్ చేస్తారు?’ అని ఫైర్ అయ్యారు. మరోవైపు మంచు లక్ష్మీ ప్రసన్న కూడా స్పందించారు. ఈ వ్యాఖ్యల వల్ల బాధిత మహిళలు తీవ్ర క్షోభ అనుభవిస్తారని చెప్పారు.

News October 3, 2024

మంత్రి కామెంట్స్ చూసి షాకయ్యా: IAS స్మిత

image

TG: మంత్రి కొండా సురేఖ కామెంట్స్ చూసి షాకయ్యానని ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. ‘ప్రతిచోట మహిళలు వివక్ష, అవమానాలను ఎదుర్కొంటున్నారు. కొందరు సంచలనాల కోసం థంబ్‌నైల్స్‌గా వాడుకుంటారు. ఆఫీసర్లనూ వదలరు. నా వ్యక్తిగత అనుభవం ప్రకారం మాట్లాడుతున్నా. ప్రతి అంశాన్ని రాజకీయపరంగా చూడొద్దు’ అని కోరారు.