News March 24, 2024

నిర్మాతతో తెలుగు హీరోయిన్ పెళ్లి?

image

తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ అంజలి వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. విడాకులు తీసుకున్న ఓ తెలుగు అగ్ర నిర్మాతతో ఆమె ఏడాదిగా డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అంజలి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఆమె ప్రస్తుతం గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్ తదితర తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

News March 24, 2024

తెలంగాణ, ఏపీ అభ్యర్థులు నేడు ఫైనల్?

image

తెలంగాణలో 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మిగతా 8 స్థానాల బరిలో నిలిచే వారి పేర్లను ఇవాళ ప్రకటించనుంది. ఆదిలాబాద్, ఖమ్మం, భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ స్థానాలకు ఇవాళ అభ్యర్థులను ఫైనల్ చేయనుంది. అటు ఢిల్లీలో జరిగే బీజేపీ సీఈసీ సమావేశంలో తెలంగాణలోని 2 పెండింగ్ స్థానాలు, ఏపీ అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది.

News March 24, 2024

లాక్‌డౌన్‌కు నాలుగేళ్లు

image

కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. 2020 మార్చి 24 అర్ధరాత్రి నుంచి మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా లాక్​డౌన్ అమల్లోకి వచ్చింది. తొలుత 21 రోజులు విధించిన ఈ లాక్​డౌన్​ను క్రమంగా మూడుసార్లు పొడిగించారు. అత్యంత కఠినంగా అమలైన ఈ లాక్​డౌన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. రికార్డు స్థాయిలో జీడీపీ పడిపోయేందుకు కారణమైంది.

News March 24, 2024

OGలో ఇమ్రాన్ హష్మీ పిక్ రిలీజ్

image

టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ ‘ఓజీ’. పవన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనుండంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ గ్లింప్స్ రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. తాజాగా మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్న ఇమ్రాన్ హష్మీ ఫొటోను యూనిట్ షేర్ చేసింది. యుద్ధాన్ని ఊహించలేరు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

News March 24, 2024

రెబల్‌గా సోయం బాపురావు పోటీ?

image

TG: ఆదిలాబాద్ జిల్లాలో BJPకి షాక్ తగిలే అవకాశం ఉంది. సిట్టింగ్ MP సోయం బాపురావు రెబల్‌గా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి సహా పలువురు కీలక నేతలు బుజ్జగించినా సోయం వెనక్కి తగ్గడం లేదు. పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్న ఆయన.. క్యాడర్ ఉన్న తాను కావాలో? వలస నేత కావాలో తేల్చుకోవాలని అధిష్ఠానానికి సవాల్ విసిరారు. ఆదివాసీ పెద్దలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని సోయం తెలిపారు.

News March 24, 2024

ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక తీర్పు

image

TG: ఒక ఆస్తి మొదటి రిజిస్ట్రేషన్ రద్దు కాకుండా తర్వాత కొనుగోలు చేసిన వారు హక్కులు పొందలేరని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ చిన్న కథ చెప్పారు. ‘పాండవులకు 5 గ్రామాలు ఇవ్వాలని దుర్యోధనుడిని కృష్ణుడు అడిగాడు. వాటిని సామంతులకు ఇచ్చాను.. పాండవులకు ఇవ్వలేనని దుర్యోధనుడు చెప్తాడు. ఆ ప్రకారం ఆస్తిపై హక్కులు కోల్పోయిన వారు ఇతరులకు హక్కులను ఇవ్వలేరు’ అని పేర్కొన్నారు.

News March 24, 2024

అమలాపురంలో ఆ సీన్ రిపీట్ అవుతుందా?

image

AP: అమలాపురంలో MLA అభ్యర్థులకు అసంతృప్తుల టెన్షన్ పట్టుకుంది. YCP అభ్యర్థి విశ్వరూప్‌ని వ్యతిరేకిస్తున్న వర్గం అసంతృప్తితోనే ఆయన వెంట నడుస్తున్నట్లు తెలుస్తోంది. TDP అభ్యర్థి ఆనందరావునీ చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. జనసేన ఆశావహులు అసంతృప్తిగా ఉన్నారు. 1994, 2004లో ఇక్కడ రెబల్స్ ఇండిపెండెంట్లుగా పోటీ చేయగా అసంతృప్తులంతా మద్దతిచ్చారు. 2004లో ఇండిపెండెంట్ గెలిచారు. దీంతో నేతలకు ఈ భయం పట్టుకుంది.

News March 24, 2024

విద్యార్థిని జేబులో మొబైల్ ఫోన్‌కు మంటలు

image

ఇటీవల మొబైల్ ఫోన్లు పేలిపోతున్న ఘటనలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఓ కోచింగ్ సెంటర్‌లో క్లాస్ జరుగుతుండగా విద్యార్థిని జేబులోని రెడ్‌మీ ఫోన్ నుంచి మంటలు వచ్చాయి. ఆమె వెంటనే ఫోన్‌ను రోడ్డుపైకి విసిరేయగా, సైన్ బోర్డుకు తగిలి పేలిపోయింది. స్థానికులు మంటలు ఆర్పేశారు. అక్కడికి సమీపంలోనే దుస్తుల షాపులు ఉన్నాయి. అటువైపు ఫోన్ పడి ఉండే పెద్ద ప్రమాదం జరిగేది.

News March 24, 2024

సీ-విజిల్‌లో ఫిర్యాదు.. 100 నిమిషాల్లో చర్యలు

image

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై ఫిర్యాదు చేసేందుకు గూగుల్ ప్లే స్టోర్‌లో సీ-విజిల్ యాప్‌ని EC ప్రవేశపెట్టింది. దీంట్లో ఫిర్యాదు చేసిన వెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్‌లు రంగంలోకి దిగుతాయి. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తాయి. ఆపై ఆర్వో చర్యలు తీసుకుంటారు. 100 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతారు.

News March 24, 2024

మోదీని ’28 పైసా PM’ అని పిలుద్దాం: ఉదయనిధి

image

తమిళనాడు రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం చెల్లించే ప్రతి రూపాయి పన్నుకి రూ.28 పైసలే కేంద్రం వెనక్కి ఇస్తోందని మండిపడ్డారు. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు లబ్ధి జరుగుతోందని అన్నారు. ఇక నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ’28 పైసా పీఎం’ అని పిలుద్దామంటూ ఫైర్ అయ్యారు. తమిళనాడుపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు.