News March 22, 2024

పెస్టిసైడ్స్‌తో వణుకుడు రోగం

image

ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో మనిషి శరీర భాగాల్లో వణుకు మొదలవుతుంది. కాగా ఈ వ్యాధికి పెస్టిసైడ్స్ ఓ కారణమని పరిశోధకులు తేల్చారు. అట్రాజైన్, లిండేన్, సిమేజైన్ వంటి 14 రకాల క్రిమిసంహారక మందుల ద్వారా ఈ వ్యాధి ప్రబలుతోందని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసేవారు, ఆయా పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందట.

News March 22, 2024

వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్

image

యూజర్ల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఏదైనా ఒక ముఖ్యమైన మెసేజ్‌ను టాప్‌లో పిన్ చేసుకునేందుకు అవకాశం ఉండగా, ఇకపై గరిష్ఠంగా 3 మెసేజ్‌లను పిన్ చేసుకునే వీలు కల్పించింది. పర్సనల్ చాట్‌లతోపాటు గ్రూప్స్‌, పోల్స్, ఫొటోలు, ఎమోజీలను కూడా పిన్ చేసుకోవచ్చు. ఇవి డిఫాల్ట్‌గా ఏడు రోజులు టాప్‌లో ఉంటాయి. కావాలనుకుంటే ఒక రోజు, 30 రోజులకు సెట్ చేసుకోవచ్చు.

News March 22, 2024

IPL-2024: సైన్ లాంగ్వేజ్‌లో కామెంటరీ

image

మరికొద్ది సేపట్లో IPL 2024 టోర్నీ ప్రారంభం కానుంది. ఈక్రమంలో స్టార్ స్పోర్ట్స్ కీలక ప్రకటన చేసింది. IPL చరిత్రలో తొలిసారి చెవుడు, దృష్టి లోపం ఉన్న క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వారికోసం సైన్ లాంగ్వేజ్‌లో కామెంటరీ చేయనున్నట్లు వెల్లడించింది. స్టార్ స్పోర్ట్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెట్టింట అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

News March 22, 2024

షిప్ లేటయింది.. గుట్టు రట్టయింది: TDP

image

AP: విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టుబడటంపై TDP ట్వీట్ చేసింది. ‘ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపు పోలీసులతో డ్రగ్స్ దింపేసి, బ్రెజిల్ మాఫియా దగ్గర డబ్బులు కొట్టేద్దామని ప్లాన్ వేశాడు. షిప్ వారం లేటుగా వచ్చింది. ఈలోపు ఇంటర్‌పోల్, CBI రంగంలోకి దిగి పట్టేశాయి. జగన్ రెడ్డి పోలీసులని, అధికారులను పంపించి CBI విచారణను అడ్డుకున్నారు. కానీ CBI నట్లు బిగించి సరుకు పట్టేసింది’ అని ఆరోపించింది.

News March 22, 2024

ధోనీ ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: మాజీ క్రికెటర్

image

IPLలో CSK కెప్టెన్‌గా తప్పుకున్న ధోనీపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ధోనీ ఆటగాడిగా కూడా రిటైర్ అయితే బాగుండేది. MSD ప్లేయర్‌గా ఉన్న జట్టును కెప్టెన్‌గా ముందుకు నడిపించడం రుతురాజ్‌కు సాధ్యం కాదు. కొత్త కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ధోనీ అంగీకరించవచ్చు. వద్దని చెప్పవచ్చు. ధోనీ గ్రౌండ్‌లో ఉంటే రుతురాజ్ సొంత నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు’ అని చెప్పుకొచ్చారు.

News March 22, 2024

కాంగ్రెస్‌కు మరో షాక్

image

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. 2014-17 మధ్య తమ పార్టీ ఖాతాల్లోకి వచ్చిన డబ్బుపై పన్ను రికవరీ కోసం ఐటీ శాఖ తీసుకుంటోన్న చర్యలను నిలుపుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. ఇప్పటికే పార్టీ అకౌంట్‌లోని రూ.105 కోట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా డబ్బు వాడుకునే అవకాశం లేకపోవడంతో పార్టీ తీవ్ర ఇబ్బందులు పడుతోందని కాంగ్రెస్ అగ్రనేతలు నిన్న వెల్లడించారు.

News March 22, 2024

ఆ బీచ్‌లో రాళ్లు ఎత్తుకెళ్తే భారీ ఫైన్!

image

స్పెయిన్‌లోని కానరీ దీవుల సమూహంలోని లాంజరోట్, ఫ్యూర్టెవెంచురా‌లను సందర్శించే పర్యాటకులకు అధికారులు భారీ ఫైన్‌లు విధిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది అక్కడి ఇసుక, రాళ్లను తీసుకెళ్తున్నారట. ఇది ద్వీపాల పర్యావరణ వ్యవస్థపై హానికర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో సందర్శకులకు రూ.2లక్షల వరకు ఫైన్ విధించేస్తున్నారు. పర్యాటకుల తాకిడి భారీగా పెరగడంతో తీవ్ర నీటి కొరత ఏర్పడి ఇటీవల ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు.

News March 22, 2024

బెదిరింపులకు లొంగకపోవడంతోనే కేజ్రీవాల్ అరెస్ట్: కూనంనేని

image

TG: దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షాలను నిర్వీర్యం చేయడానికి BJP ప్రయత్నిస్తోందని CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. PM మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. BJP బెదిరింపులకు లొంగకపోవడంతోనే ఢిల్లీ CM కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఫైరయ్యారు. ఎన్నికల బాండ్ల ద్వారా BJPకి రూ.వేల కోట్లు వచ్చాయని, దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

News March 22, 2024

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో చేరాం: చంద్రబాబు

image

AP: రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక అజెండాగా ఎన్డీఏలో చేరామని టీడీపీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రజాభిప్రాయం మేరకు రాష్ట్ర సమస్యలపై పోరాడే నేతలనే అభ్యర్థులుగా నిలబెడుతున్నామని చెప్పారు. వారిని ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఇప్పటి వరకు 139 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని, మిగిలిన 5 MLA, 4 MP స్థానాలకు క్యాండిడేట్లను త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు.

News March 22, 2024

విపరీతమైన ఎండలు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

✒ ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
✒ అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
✒ శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు.
✒ బయటకు వెళ్తే తెలుపు రంగు దుస్తులను ధరించండి.