News March 22, 2024

విపరీతమైన ఎండలు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

✒ ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
✒ అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
✒ శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు.
✒ బయటకు వెళ్తే తెలుపు రంగు దుస్తులను ధరించండి.

News March 22, 2024

గత IPLలోనే ధోనీ నాకు హింట్ ఇచ్చారు: గైక్వాడ్

image

తనకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడంపై రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత సంవత్సరమే మహీ భాయ్ నాకు కెప్టెన్సీ గురించి హింట్ ఇచ్చారు. సిద్ధంగా ఉండు.. నీకిది సర్‌ప్రైజ్‌గా ఉండకూడదు అని చెప్పారు. నేను క్యాంప్‌లో జాయిన్ అయినప్పుడు మ్యాచ్ ప్రణాళికలపై సూచనలు చేశారు. కెప్టెన్ చేయాలని ఆయన ముందే అనుకున్నారు. కానీ, ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారం క్రితం నాతో చెప్పారు’ అని తెలిపారు.

News March 22, 2024

ఒత్తిడితో సమస్యలు ఇంతింత కాదయా..

image

ఈ డిజిటల్ యుగంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఒత్తిడి. ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో సమస్యలతో తరచూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది ఫిజికల్, మెంటల్ హెల్త్‌పై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పి, అలసట, అజీర్తి, BP, షార్ట్ టెంపర్, వాయిదా వేయడం, నిర్లక్ష్యం ఆవహించడం వంటి సమస్యలు చుట్టుముడతాయట. ప్రెజర్ మేనేజ్‌మెంట్ చేసుకోలేకపోతే ఇవి దీర్ఘకాలిక సమస్యలుగా వేధిస్తాయంటున్నారు.

News March 22, 2024

తప్పుడు ఆరోపణలపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు: సజ్జల

image

AP: విశాఖ పోర్టులో డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారంలో తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘డ్రగ్స్ దిగుమతి కచ్చితంగా టీడీపీ గ్యాంగ్ పనే అని మాకు అనుమానం ఉంది. ఆ పార్టీ నాయకులకే నిందితులతో సంబంధాలున్నాయి. ఈ కేసులో ఎవరున్నారో తెలియాల్సిందే. తప్పించుకోవడానికి మాపై ఆరోపణలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

News March 22, 2024

BREAKING: బీజేపీ నాలుగో జాబితా విడుదల

image

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. 15 మందితో నాలుగో లిస్టును రిలీజ్ చేయగా.. అందులో 14 తమిళనాడు, ఒకటి పుదుచ్చేరి స్థానాలున్నాయి. నటి రాధికాశరత్ కుమార్ విరుధునగర్ నుంచి పోటీ చేయనున్నారు.

News March 22, 2024

దేశంలో మరింత తగ్గనున్న సంతానోత్పత్తి రేటు!

image

దేశంలో సంతానోత్పత్తి రేటు మరింత తగ్గనున్నట్లు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం తెలిపింది. 1950లో 6.2గా ఉన్న ఫెర్టిలిటీ రేటు 2021 నాటికి 2 కంటే దిగువకు పడిపోయిందని పేర్కొంది. 1950లో సగటున స్త్రీలలో టోటల్ ఫెర్టిలిటీ రేటు 4.5 కంటే ఎక్కువగా ఉందని, అది 2021లో 2.2కి తగ్గిందని వివరించింది. సంతానోత్పత్తి రేటు 2050లో 1.29కి, 2100 నాటికి 1.04కి పడిపోవచ్చని అంచనా వేసింది.

News March 22, 2024

మరో రెండు స్థానాలకు BRS ఎంపీ అభ్యర్థుల ప్రకటన

image

TG: నాగర్ కర్నూల్, మెదక్ ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్‌ నుంచి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్‌ నుంచి మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా ఆరు సీట్లకు క్యాండిడేట్లను నిర్ణయించాల్సి ఉంది.

News March 22, 2024

ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

image

TG: ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన ఓటర్లను ప్రలోభ పెట్టారని, సతీమణి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదంటూ విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దానం ఎన్నికను రద్దు చేయాలని కోరారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ దానంకు హైకోర్టు నోటీసులిస్తూ.. తదుపరి విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది. కాగా ఇటీవలే ఆయన కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

News March 22, 2024

6 చోట్ల మాత్రమే అభ్యర్థులు ఖరారు!

image

TG: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో BJP, BRS, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. అయితే, ఇప్పటివరకు రిలీజ్ చేసిన జాబితాల ప్రకారం కేవలం ఆరు చోట్ల మాత్రమే మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. పెద్దపల్లి, జహీరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మహబూబాబాద్‌లో పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటించాయి.

News March 22, 2024

సోమిరెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వడం సంతోషకరం: మంత్రి కాకాణి

image

AP: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సర్వేపల్లి టీడీపీ టికెట్ దక్కడంపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సెటైర్లు వేశారు. ‘సోమిరెడ్డి వరుసగా 4 సార్లు ఓడిపోయారు. సీనియర్ అని చెప్పుకునే ఆయనకు మూడో విడతలో టికెట్ రావడంతో సంబరాలు చేసుకున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వకుంటే ఎవరిపై మాట్లాడాలి? విమర్శలు చేయాలి? అని అనుకున్నా. ఎట్టకేలకు ఆయనకు సీటు కేటాయించడంతో నాకు సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు.