News March 22, 2024

టీడీపీలో పెండింగ్ స్థానాలివే

image

AP: మొత్తం 3 విడతల్లో అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన TDP.. 4 ఎంపీ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. విజయనగరం సీటు తీసుకుని బీజేపీకి రాజంపేట స్థానం కేటాయించడంపై చర్చలు నడుస్తుండగా.. కడప విషయంలో శ్రీనివాసులురెడ్డి/వీరశివారెడ్డి, ఒంగోలులో మాగుంట కుటుంబంలో పోటీపై చర్చ, అనంతపురంలో బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. ఇక ఎచ్చెర్ల, భీమిలి, చీపురుపల్లి సహా మరో 2 అసెంబ్లీ స్థానాలపై బీజేపీతో స్పష్టత రావాల్సి ఉంది.

News March 22, 2024

బెజవాడ గడ్డపై అన్నదమ్ముల పోరు..

image

AP: రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీటు విజయవాడ పార్లమెంట్ స్థానం. గతంలో రాజకీయ ఉద్దండులు ఇక్కడి నుంచి గెలిచి ప్రభుత్వంలో చక్రం తిప్పారు. కాగా ఇక్కడ తొలిసారిగా అన్నదమ్ములు ఈసారి బరిలోకి దిగుతున్నారు. YCP నుంచి కేశినేని నాని, TDP తరఫున నాని తమ్ముడు కేశినేని చిన్ని కదనరంగంలో కాలు దువ్వుతున్నారు. గత ఎన్నికల్లో YCP ప్రభంజనంలోనూ TDP గెలిచిన MP సీటు ఇది. మరి బెజవాడ గడ్డపై ఈసారి ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి.

News March 22, 2024

‘ఓం భీమ్ బుష్’ మూవీ REVIEW

image

ఎలాంటి సీరియస్ నెస్ లేకుండా నచ్చినట్లుగా ముగ్గురు ఫ్రెండ్స్ చేసే సిల్లీ పనులే ‘ఓం భీమ్ బుష్’ కథ. తమ కామెడీ టైమింగ్స్‌తో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అలరించారు. శ్రీవిష్ణు పంచ్‌లు, బాడీ లాంగ్వేజ్, హర్రర్ సీన్స్, కీలక సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్లు కాగా.. స్టోరీ లైన్, లాజిక్ లేని సీన్స్, మ్యూజిక్, ప్రాధాన్యత లేని హీరోయిన్ పాత్ర, స్క్రీన్‌ప్లే మైనస్.
RATING: 2.50/5

News March 22, 2024

మాజీ మంత్రుల సీట్లు గల్లంతేనా..?

image

AP: టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కొందరికి దాదాపుగా సీట్లు లేనట్లే కనిపిస్తోంది. కళా వెంకట్రావు, దేవినేని ఉమ, సత్యనారాయణ, జవహర్‌కు మూడో జాబితాలోనూ చోటు దక్కలేదు. ఇటు చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావు పోటీపై సందిగ్ధం నెలకొంది. దీంతో అక్కడి సీనియర్ నాయకురాలు కిమిడి మృణాళిని సీటు పైనా క్లారిటీ రాలేదు. మరోవైపు సీనియర్లు సోమిరెడ్డి, కోళ్ల లలిత, వనమాడి వెంకటేశ్వర్లు టికెట్లు కన్ఫార్మ్ చేసుకున్నారు.

News March 22, 2024

నా భర్తది ఓపెన్ మైండ్: రకుల్ ప్రీత్

image

తాను ధరించే కురచ దుస్తులపై తన భర్త జాకీ భగ్నానీ ఎలాంటి అభ్యంతరం తెలపరని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. తన భర్త కానీ, అత్తమామలు కానీ బట్టల విషయంలో ఎలాంటి ఒత్తిడి చేయలేదని తెలిపారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోరని.. వారిది ఓపెన్ మైండ్ అని చెప్పారు. పెళ్లయితే మహిళలే తమ దుస్తుల స్టైల్ మార్చాలా అని ఆమె ప్రశ్నించారు. కాగా ఇటీవల నిర్మాత జాకీ భగ్నానీని రకుల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

News March 22, 2024

పంజాబ్‌లో 120+ ఏళ్ల ఓటర్లు 205 మంది

image

సెంచరీ దాటి 20 ఏళ్లయినా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు పంజాబ్ కురువృద్ధులు. అక్కడ 120 ఏళ్లు దాటిన ఓటర్లు ఏకంగా 205 మంది ఉన్నారని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిబిన్ వెల్లడించారు. వారిలో 122 మంది పురుషులు, 83 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. 100 నుంచి 119 ఏళ్ల వయసున్న వారు 5,004 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిలో పురుషులు 1,976 మంది, మహిళలు 3,028 మంది ఉన్నారన్నారు.

News March 22, 2024

బ్యాంకు లావాదేవీలు చేస్తున్నారా?

image

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఖాతాల నుంచి రూ.లక్ష విత్‌డ్రా, డిపాజిట్ చేసినా అందుకు సంబంధించిన వివరాలను ఆరా తీయాలని ఆదేశించింది. ‘ఈ వివరాలను అన్ని బ్యాంకుల నుంచి అధికారులు తెప్పించుకోవాలి. వాటిని విశ్లేషించాలి. ఒకే బ్యాంక్ బ్రాంచి నుంచి వేర్వేరు ఖాతాలకు డబ్బుల బదిలీపై ఫిర్యాదులు వస్తున్నాయి’ అని ఈసీ పేర్కొంది.

News March 22, 2024

మనిషికి పంది కిడ్నీ మార్పిడి

image

ఓ మనిషికి వైద్యులు పంది కిడ్నీని అమర్చారు. ఇలా చేయడం ప్రపంచంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరిగింది. కిడ్నీలు ఫెయిలైన 62 ఏళ్ల రోగికి 4 గంటలపాటు సర్జరీ చేసి పంది కిడ్నీని అమర్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నారు. కాగా ఈ ప్రయోగం మంచి ఫలితాలిస్తే ప్రపంచంలోని కిడ్నీ రోగులకు ఇది ఒక శుభవార్తేనని వైద్యులు అంటున్నారు.

News March 22, 2024

ELECTORAL BONDS: BRSకు ‘కిటెక్స్’ విరాళం

image

ఎలక్టోరల్ బాండ్స్‌లో బీఆర్ఎస్ పార్టీకి కేరళకు చెందిన టెక్స్‌టైల్ గ్రూప్ ‘కిటెక్స్’ రూ. 25 కోట్లు విరాళంగా ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ నెలలో బాండ్ల రూపంలో బీఆర్ఎస్‌కు విరాళం ఇవ్వడం గమనార్హం. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట హవేలిలో కాకతీయ టెక్స్‌టైల్ పార్కు కోసం రైతుల నుంచి సేకరించిన 187 ఎకరాల భూమిని ప్రభుత్వం కిటెక్స్‌కు కేటాయించింది.

News March 22, 2024

ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు

image

TG: ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలపై ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. బెయిల్‌పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని కవిత తరఫు న్యాయవాదులకు సూచించింది. బెయిల్ పిటిషన్‌పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.