News December 29, 2024

విభజన రాజకీయాలు ప్రమాదం: SC న్యాయమూర్తి

image

మతం, కులం, జాతి ఆధారిత విద్వేష వ్యాఖ్య‌లు దేశ‌ ఐక్యతా భావాల‌కు పెను స‌వాల్ విసురుతున్నాయ‌ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు. గుజ‌రాత్‌లో ఓ ప్రోగ్రాంలో ఆయ‌న మాట్లాడుతూ ఓట్ల కోసం రాజ‌కీయ నాయ‌కులు చేసే ఈ ర‌క‌మైన రాజ‌కీయం స‌మాజంలో విభ‌జ‌న‌ను పెంచుతుంద‌న్నారు. విభ‌జ‌న సిద్ధాంతాలు, పెరుగుతున్న ఆర్థిక అస‌మాన‌త‌లు, సామాజిక అన్యాయం సోద‌ర భావానికి ప్ర‌మాద‌మ‌న్నారు.

News December 29, 2024

షిప్ నుంచి రేషన్ బియ్యం అన్‌లోడ్

image

AP: కాకినాడలో స్టెల్లా షిప్‌లో ఇటీవల భారీ మొత్తంలో అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ అక్రమరవాణాపై ఏకంగా Dy.CM పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రేషన్ బియ్యాన్ని షిప్ నుంచి అన్‌లోడ్ చేశారు. మొత్తం 1,320 టన్నుల బియ్యాన్ని పోర్టులోని గోడౌన్‌లో భద్రపరిచారు. మరోవైపు షిప్‌లో 19,785 టన్నుల బియ్యం లోడ్ చేసేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

News December 29, 2024

అంతటా బుమ్రానే..

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై బుమ్రా బౌలింగ్‌ను ఉద్దేశించి ఓ అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు ఆకట్టుకుంటోంది. ‘కంగారూలు దూకగలవు కానీ బుమ్రా నుంచి దూరంగా పారిపోలేవు’ అంటూ రాసుకొచ్చారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ అంతటా బుమ్రానే ఉన్నారని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే బుమ్రా 29 వికెట్లు తీశారు.

News December 29, 2024

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ రేట్లు కాస్త తగ్గాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో విత్ స్కిన్ కేజీ రూ.150, స్కిన్ లెస్ రూ.180కి అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ధరలు రూ.190, రూ.220గా ఉన్నాయి. మరోవైపు ఏపీలోని విజయవాడలో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.220-230 వరకు విక్రయిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.

News December 29, 2024

అమ్మో.. ధరలు బాబోయ్ ధరలు!

image

TG: ఆదాయంలో మార్పు లేదు కానీ ఖర్చులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. పప్పు నుంచి ఉప్పు వరకు, కూరగాయల నుంచి మాంసం వరకు అన్నీ భారమే. రాష్ట్రంలో కుటుంబాలకు నెలవారీ ఖర్చులు తలకు మించిన భారంగా ఉంటోందని జాతీయ గృహ వినియోగ సర్వే తెలిపింది. ప్రతి నెలా నిత్యావసరాల నిమిత్తం రాష్ట్రంలోని కుటుంబాలకు రూ.5675 ఖర్చవుతోందని పేర్కొంది. నెలవారీ వ్యయంలో కేరళ, తమిళనాడు తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది.

News December 29, 2024

నేడు ప్రో కబడ్డీ లీగ్ ఫైనల్

image

ప్రో కబడ్డీ లీగ్-2024 ఫైనల్ నేడు జరగనుంది. హరియాణా స్టీలర్స్, పట్నా పైరెట్స్ తుది సమరంలో తలపడనున్నాయి. రా.8 గంటలకు మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో నం.1గా ఉన్న హరియాణా తొలి సారి ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు మూడుసార్లు విజేతగా నిలిచిన పట్నా నాలుగో టైటిల్‌పై కన్నేసింది.

News December 29, 2024

వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌గా తెలుగు తేజం

image

వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ విజేతగా తెలుగు తేజం కోనేరు హంపి నిలిచారు. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెనె సుఖందర్‌పై ఆమె విజయం సాధించారు. 2019లోనూ ఆమె విజేతగా నిలిచారు. దీంతో చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజన్ తర్వాత ఎక్కువ సార్లు టైటిల్ గెలుచుకున్న ప్లేయర్‌గా హంపి రికార్డులకెక్కారు. మెన్స్ విభాగంలో రష్యా ప్లేయర్ మర్జిన్ టైటిల్ గెలిచారు.

News December 29, 2024

సంక్రాంతికి 5వేల ప్రత్యేక బస్సులు

image

TG: సంక్రాంతి పండుగకు 5వేల ప్రత్యేక బస్సుల్ని నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఏయే రూట్లలో ఇవి నడుస్తాయి? ఛార్జీలు ఎలా ఉంటాయి? తదితర ప్రశ్నలపై అధికారులు త్వరలో స్పష్టతనివ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఏపీకి నడిపే సర్వీసులు కూడా వీటిలో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. జనవరి మొదటి వారం నుంచి 10 రోజుల పాటు ఈ బస్సులు నడుస్తాయని తెలిపాయి.

News December 29, 2024

నేడు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

image

TG: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో నేడు స్వామివారి కళ్యాణం జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో స్వామి వివాహం నిర్వహించనున్నారు. దీంతో మూడు నెలలపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ప్రభుత్వం తరఫున మంత్రులు సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.

News December 29, 2024

ఇతడు నిజమైన రాజు!

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు, ప్రఖ్యాతులు ఎంత గొప్పవో పైన ఫొటో చూస్తే తెలుస్తోంది కదూ! పై ఫొటోలో ఉంది భూటాన్ దేశ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్. మన్మోహన్ మరణవార్తను తెలుసుకుని ఢిల్లీకి వచ్చారు. కింద కూర్చొని సింగ్ సతీమణి గుర్‌శరణ్ కౌర్‌ను ఓదార్చుతూ ధైర్యం చెప్పారు. తాను రాజుననే విషయం మర్చిపోయి అత్యంత గౌరవంగా వ్యవహరించారు. అతడు నిజమైన రాజు అని నెటిజన్లు అభినందిస్తున్నారు.