News March 20, 2024

హసరంగ కోసం శ్రీలంక మాస్టర్ ప్లాన్..?

image

అంపైర్లతో దురుసు ప్రవర్తన కారణంగా శ్రీలంక స్పిన్నర్ హసరంగపై ఐసీసీ రెండు మ్యాచుల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాతో వన్డే సిరీస్‌ అనంతరం అతడు ఆడే 2 టెస్టులు లేదా 4 వన్డేలు/టీ20 మ్యాచులపై నిషేధం అమలవ్వాల్సి ఉంది. బంగ్లాతో టెస్టుల తర్వాత శ్రీలంక ఆడేది టీ20 వరల్డ్ కప్‌లోనే. దీంతో ఆ సమయంలో బ్యాన్ అవకుండా.. శ్రీలంక బోర్డు తెలివిగా టెస్టులకు అతడిని ఎంపిక చేసిందన్న వాదన నెట్టింట వినిపిస్తోంది.

News March 20, 2024

రేషన్‌కార్డులు ఇవ్వాలని ఆదేశం

image

ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న వలస కార్మికులకు రేషన్‌కార్డులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత ఏడాది ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో.. 2 నెలల్లో కార్డులు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాజాగా ఆదేశాలిచ్చింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిర్దేశించిన కోటాతో సంబంధం లేకుండా కార్డులు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.

News March 20, 2024

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

image

లోక్‌సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఈనెల 27 వరకు నామినేషన్ల స్వీకరణ, ఈనెల 28న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఈనెల 30తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఏప్రిల్ 19న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ వెల్లడించింది.

News March 20, 2024

పెరగనున్న ఈ-స్కూటర్ల ధరలు!

image

ఏప్రిల్ 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు 10% వరకు పెరగనున్నట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్-2024లో కేంద్రం మార్పులు చేయడం, ఫేమ్-2 స్కీమ్ గడువు ఈనెలాఖరుతో ముగియనుండడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ స్కీమ్ కింద బైక్‌లపై ₹5,000 నుంచి ₹10వేల వరకు సబ్సిడీ లభిస్తోంది. ఇప్పుడు దీని గడువు ముగియనున్న నేపథ్యంలో బైక్ తయారీ సంస్థలు ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది

News March 20, 2024

లోక్ సభ ఎలక్షన్స్: భువనగిరి నుంచి సీపీఎం పోటీ?

image

TG: లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేయాలని సీపీఎం యోచిస్తోంది. మల్లు లక్ష్మి, నంద్యాల నర్సింహారెడ్డి, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డిలలో ఒకరిని బరిలో నిలపనున్నట్లు సమాచారం. అభ్యర్థి ఎంపికతో పాటు రాష్ట్రంలోని మిగతా స్థానాల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే అంశంపై పొలిట్‌బ్యూరో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

News March 20, 2024

4,660 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో 4660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో ఎస్ఐ పోస్టులు 452, కానిస్టేబుల్ పోస్టులు 4,208 ఉన్నాయి. ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై.. మే 14 వరకు కొనసాగనుంది. ఎస్ఐ పోస్టులకు డిగ్రీ, కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్ పాసై ఉండాలి. CBT, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.

News March 20, 2024

నేను మా ఆయన భార్యను!

image

దేశంలో తొలి లోక్‌సభ ఎన్నికల్లో అధికారులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఓటర్ల జాబితా తయారు చేసేటప్పుడు మహిళలు తమ అసలు పేరు చెప్పలేదు. ఫలానా వ్యక్తి భార్యననో, ఫలానా వ్యక్తి కూతురుననో అని చెప్పారు. అప్పటి ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం ఆ మహిళలు అలా ప్రవర్తించారు. ఈ సమస్య ఎక్కువగా బిహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఎదురైంది. కాగా సరైన పేర్లు చెప్పని 28 లక్షల ఓటర్లను అధికారులు తొలగించారు.

News March 20, 2024

ISROకి ప్రతిష్ఠాత్మక అవార్డు

image

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌‌ సాధించిన విజయాలకు ఏవియేషన్ వీక్ లారియేట్స్ అవార్డు వరించింది. ఇస్రో తరఫున అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో డిప్యూటీ అంబాసిడర్ శ్రీప్రియా రంగనాథన్ ఈ అవార్డును అందుకున్నారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీలో అసాధారణ విజయాలను సాధించినందుకు ‘ఏవియేషన్ వీక్’ అవార్డులు అందిస్తుంది.

News March 20, 2024

ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు వచ్చేది ఈ ఓటీటీలోనే

image

ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది విడుదల కానున్న పలు సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’, సూర్య ‘కంగువా’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’, నితిన్ ‘తమ్ముడు’, అనుష్క ‘ఘాటి’, శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ ఈ లిస్టులో ఉన్నాయి. ఈ మూవీలు థియేటర్లలో రిలీజైన కొన్ని రోజులకు OTTలోకి వస్తాయి.

News March 20, 2024

వందేభారత్ టైమింగ్స్ మార్చాలని విజ్ఞప్తి

image

సికింద్రాబాద్-విశాఖ మధ్య ఉదయం 5.05 గంటలకు బయల్దేరే వందేభారత్ టైమింగ్స్ మార్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. తెల్లవారుజామున స్టేషన్‌కు చేరుకోవడానికి ఆటోలు, క్యాబ్‌లు దొరకడం లేదని రైల్వేశాఖకు ఫిర్యాదు చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు రైలు బయల్దేరితే అందరికీ అందుబాటులో ఉంటుందంటున్నారు. సికింద్రాబాద్-కాజీపేట మధ్య మూడో లైన్ పూర్తికాకపోవడంతో ఈ రైలు టైమింగ్స్ మార్చలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.