News January 10, 2026

శని శాంతి మంత్రం..

image

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

News January 10, 2026

మేడారం జాతర.. ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు

image

TG: మేడారం జాతరలో ఇప్పపువ్వు లడ్డు, బెల్లం లడ్డు ప్రసాదంగా ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. లడ్డు తయారీ ద్వారా 500 మంది మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ నెల 18న CM రేవంత్ మేడారానికి వస్తారని, 19న మొక్కులు చెల్లించి జాతరను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జాతరను జరుపుకుందామన్నారు. కాగా ఇప్పపువ్వులో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.

News January 10, 2026

అమరావతిలో క్వాంటం సెంటర్‌కు టెండర్ ఖరారు

image

AP: రాజధానిలో క్వాంటం వ్యాలీ నిర్మాణ దిశగా మరో కీలక అడుగు పడింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ను APCRDA ఖరారు చేసింది. రూ.103 కోట్లతో L-1 బిడ్‌గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగిస్తూ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ జారీ చేసింది. ఈ ప్రాజెక్టు నమూనా రూపకల్పన నుంచి నిర్మాణం వరకూ L&Tనే చేపట్టనుంది. సెంటర్ నిర్మాణానికి CRDA నిధుల నుంచి రూ.137 కోట్లు కేటాయించారు.

News January 10, 2026

తిరుపతి SVIMSలో ఉద్యోగాలు

image

తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (<>SVIMS<<>>) 22పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, డిగ్రీ+MSW, GNM, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: http://svimstpt.ap.nic.in/

News January 10, 2026

శని దేవుని ఆరాధనతో అనారోగ్య నివారణ

image

శనివారం రోజున శని దేవుడిని ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు సన్నగిల్లుతాయని జ్యోతిషులు చెబుతున్నారు. పలు శని దోషాలతో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కోసం నువ్వుల నూనెతో మర్ధన చేసుకోవాలని, శని శాంతి మంత్రాన్ని పఠించాలని సూచిస్తున్నారు. అందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఎముకలు, రక్తనాళాలను దృఢపరుస్తాయి. వ్యాయామం, ధ్యానం, ఆలయ ప్రదక్షిణలతో శని దేవుడు తృప్తి చెంది సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం.

News January 10, 2026

చలికాలంలో పంటపై పురుగుల ఉద్ధృతికి కారణం ఏమిటి?

image

చలికాలంలో వాతావరణం పొడిగా ఉండటం వల్ల పురుగులు గుడ్లను త్వరగా పొదుగుతాయి. దీంతో అవి ఒకేసారి పంటపై దాడి చేస్తాయి. ఈ సమయంలో గట్లమీద గడ్డి ఎండిపోతుంది. దీంతో ఆహారం కోసం పక్కనే పొలాల్లో పచ్చగా కనిపించే పంటలపై పురుగులు గుంపులుగా దాడి చేసి నాశనం చేస్తాయి. ప్రస్తుతం చాలా పంటలు పూత దశలో ఉంటాయి. వాటి పువ్వుల్లో మకరందం పురుగులకు ఇష్టం. దీంతో అవి ఆకులకంటే పువ్వులనే ఎక్కువగా టార్గెట్ చేసి నష్టపరుస్తాయి.

News January 10, 2026

ఫైనల్లో నిఖత్, హుసాముద్దీన్

image

జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు బాక్సర్లు నిఖత్ జరీన్(51 కేజీలు), హుసాముద్దీన్(60 కేజీలు) ఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీస్‌లో నిఖత్ 4-1 తేడాతో కుసుమ్ బఘేల్‌ను చిత్తు చేశారు. ఫైనల్లో ఆమె 2023 వరల్డ్ ఛాంపియన్ నీతూ గంగ్వాస్‌ను ఎదుర్కోనున్నారు. రామన్‌పై హుసాముద్దీన్ 4-1 తేడాతో గెలిచి ఫైనల్ బౌట్‌కు సిద్ధమయ్యారు. ఇక యంగ్ బాక్సర్ జాదుమణి సింగ్ సీనియర్ బాక్సర్‌ అమిత్ పంఘాల్‌కు షాకిచ్చి ఫైనల్ చేరారు.

News January 10, 2026

చలికాలంలో పురుగుల ఉద్ధృతి తగ్గించడానికి సూచనలు

image

చలికాలంలో పంటలో పురుగుల ఉద్ధృతిని తగ్గించడానికి ఎకరా పొలానికి 25 నీలిరంగు, 10 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చాలి. దీంతో పురుగులు ఆ అట్టలకు అతుక్కొని చనిపోతాయి. పొలంపై కలుపును తొలగించాలి. తోట చుట్టూ 3-4 వరుసల్లో జొన్న, మొక్కజొన్న పంటలను వేయాలి. ఇవి బయట నుంచి వచ్చే పురుగుల నుంచి పంటను కాపాడతాయి. పంట పూతను కాపాడటానికి పూలపై వేపనూనే స్ప్రే చేయాలి. ఇవి చేదుగా ఉండటం వల్ల పురుగులు పువ్వుల జోలికి రావు.

News January 10, 2026

కవిలి చెట్లు కాస్తే కారువరి పండుతుంది

image

కవిలి చెట్లు అనేవి అడవులలో లేదా పొలం గట్లపై పెరిగే ఒక రకమైన చెట్లు. పూర్వం రైతులు ప్రకృతిలో జరిగే మార్పులను గమనించి వర్షాలను, పంటలను అంచనా వేసేవారు. కారువరి అంటే వర్షాకాలంలో పండే వరి పంట. కవిలి చెట్లు ఆ ఏడాది ఎక్కువగా పూతపూసి, కాయలు కాస్తే, ఆ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని, వరి పంట (కారు వరి) సమృద్ధిగా పండుతుందని రైతుల నమ్మకం. ఇలాంటి నమ్మకాలే అప్పట్లో రైతులకు ఒక ‘వ్యవసాయ క్యాలెండర్’లా ఉపయోగపడేవి.

News January 10, 2026

పుష్య మాసం శనీశ్వరుడికి ఎందుకు ఇష్టం?

image

పుష్యమాసం శనీశ్వరుడికి ప్రీతికరం. అందుకు కారణం ఆయన జన్మనక్షత్రం. శని దేవుడు పుష్యమి నక్షత్రంలో జన్మించాడు. చంద్రుడు పుష్యమి నక్షత్రంతో ఉండే మాసమే పుష్యమి కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు ఆయన త్వరగా అనుగ్రహిస్తాడని నమ్మకం. శని దోషాలు ఉన్నవారు ఈ మాసంలో శని దేవుడికి తైలాభిషేకం, నువ్వుల దానం చేయడం వల్ల పీడలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అందుకే శని గ్రహ శాంతికి ఈ మాసం అత్యంత శ్రేష్ఠమైనది.