News August 12, 2025

అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి మృతి

image

ఉన్నత చదువుల కోసం US వెళ్లిన HYD అమ్మాయి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. శ్రీజ(23) చికాగోలో ఉంటూ ఇటీవలే MS పూర్తి చేశారు. నిన్న ఓ రెస్టారెంట్ నుంచి తాను ఉండే అపార్ట్‌మెంట్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మరణించారు. శ్రీజ చెల్లెలు శ్రేయ కూడా MS చేసేందుకు ఇటీవల US వెళ్లారు. కూతురి మరణంతో ఆమె పేరెంట్స్ బోరున విలపిస్తున్నారు.

News August 12, 2025

ముగిసిన ఉపఎన్నిక పోలింగ్

image

AP: తీవ్ర ఉద్రిక్తతల మధ్య పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. పులివెందులలో సా.4 గంటల వరకు 74.57 శాతం పోలింగ్ నమోదు కాగా ఒంటిమిట్టలో 70శాతం పోలింగ్ రికార్డయింది. టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా సాగిన ఈ బై ఎలక్షన్స్‌లో ఎవరు గెలుస్తారని అంచనా వేస్తున్నారో కామెంట్ చేయండి.

News August 12, 2025

ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా కెప్టెన్ గిల్

image

అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో రాణించిన టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచారు. జులైలో అద్భుత ప్రదర్శనకు గానూ ఆయనకు ఈ అవార్డు ప్రకటించినట్లు ఐసీసీ తెలిపింది. ఈ అవార్డుకు దక్షిణాఫ్రికా ప్లేయర్ వియాన్ ముల్డర్, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా పోటీపడ్డారు. ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఇంగ్లండ్ ప్లేయర్ సోఫియా డంక్లీ నిలిచారు.

News August 12, 2025

అమరావతి పనులు వేగంగా పూర్తి చేయాలి: చంద్రబాబు

image

AP: రాజధాని అమరావతిలో మొత్తం రూ.81,317 కోట్ల విలువైన పనులు చేపట్టాలని CRDA ప్రతిపాదించిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఇందులో భవన నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు, రోడ్లు, డక్ట్‌లు, ట్రంక్ ఇన్ఫ్రా, వరద నియంత్రణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రికార్డు టైంలో ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని CRDAపై సమీక్షలో సీఎం ఆదేశించారు.

News August 12, 2025

ఫాస్టాగ్ ఏడాది పాస్ అప్లై చేసుకోండిలా!

image

ఈనెల 15 నుంచి అందుబాటులోకి వచ్చే ఫాస్టాగ్ ఏడాది పాస్‌ను మొబైల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ‘Rajmarg Yatra’ యాప్ లేదా NHAI అఫీషియల్ వెబ్‌సైట్‌‌ను సందర్శించాలి. వాహన నంబర్/ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. ప్రస్తుత FASTag యాక్టివ్‌గా ఉండేలా, విండ్‌షీల్డ్‌పై అతికించి ఉండాలి. తర్వాత రూ.3,000 ఛార్జ్ ఆన్లైన్ ద్వారా చెల్లించండి. ఆ తర్వాత మీ ఏడాది పాస్‌ను ప్రస్తుత FASTagకి లింక్ చేయండి.

News August 12, 2025

హైదరాబాద్ మెట్రోకు నిరాశ

image

హైదరాబాద్ మెట్రోకు కేంద్ర క్యాబినెట్ మరోసారి మొండిచేయి చూపింది. ఇవాళ్టి సమావేశంలో బెంగళూరు, థాణె, పుణే, ఢిల్లీ, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు రూ.1.09 లక్షల కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు అనుమతించింది. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-3పై ప్రకటనేమీ లేకపోవడంతో నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. HYD రోడ్లపై రద్దీ విపరీతంగా పెరిగిందని, మెట్రో నిర్మాణానికి అనుమతివ్వాలని కోరుతున్నారు.

News August 12, 2025

ChatGPT సలహా ప్రాణం మీదకొచ్చింది!

image

డైట్ ప్లాన్ కోసం ChatGPTని వాడిన 60 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రి పాలయ్యాడు. టేబుల్ సాల్ట్‌కు బదులు సోడియం బ్రోమైడ్ తీసుకోవాలని సూచించడంతో అతను 3 నెలలుగా దీనిని వాడుతున్నాడు. ఇది విషంగా మారడంతో అతను మతిస్థిమితం కోల్పోయాడని, తీవ్రదాహం, పట్టుకోల్పోవడం వంటి సమస్యలు ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స తర్వాత అతను కోలుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

News August 12, 2025

మోదీ జీ.. ట్రాఫిక్ నుంచి కాపాడాలంటూ చిన్నారి లేఖ

image

బెంగళూరులోని ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటూ ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాసిందో ఐదేళ్ల చిన్నారి. ‘నరేంద్ర మోదీ జీ. ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల మేము పాఠశాలలకు, ఆఫీసులకు లేటుగా వెళ్తున్నాం. రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. ప్లీజ్ హెల్ప్ చేయండి’ అని లేఖలో రాసింది. ఈ ఫొటోను ఆ చిన్నారి తండ్రి ట్విటర్‌లో షేర్ చేయగా వైరలవుతోంది. ఇక్కడ పీక్ టైమ్‌లో KM ప్రయాణించేందుకు గంట పడుతుందని చెబుతుంటారు.

News August 12, 2025

ప్రియాంక కామెంట్స్‌కు ఇజ్రాయెల్ అంబాసిడర్ కౌంటర్

image

పాలస్తీనాలో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోందని కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ ఆరోపించారు. 18,430 మంది పిల్లలు సహా 60వేల మందిని దారుణంగా హతమార్చిందన్నారు. ఇంత జరుగుతున్నా భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు. దీంతో హమాస్‌కు వత్తాసు పలకడం మానుకోవాలని ప్రియాంకకు ఇజ్రాయెల్ అంబాసిడర్ అజార్ సూచించారు. పౌరుల మాటున దాక్కున్న ఉగ్రవాదులే తమ లక్ష్యమన్నారు. 25వేల టెర్రరిస్టులను చంపినట్లు చెప్పారు.

News August 12, 2025

ఒంటిమిట్టలో నిలిచిన పోలింగ్

image

AP: కడప జిల్లా ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రం లోపల ఉన్నారంటూ వైసీపీ శ్రేణులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాయి. దీంతో గందరగోళం నెలకొనగా, నాలుగు పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఓటింగ్‌ను నిలిపివేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఒంటిమిట్టలో 60.91శాతం పోలింగ్ నమోదైంది. సా.5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది.