India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: 2025 ఏడాదికి సంబంధించి సాధారణ, ఆప్షనల్ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1న కొత్త ఏడాది సందర్భంగా సెలవు ప్రకటించింది. దీనికి బదులుగా ఫిబ్రవరి 8న రెండో శనివారం పనిదినంగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 13న భోగి, 14న సంక్రాంతికి జనరల్ హాలిడేస్ ఇచ్చింది. 15న కనుమ పండుగను ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. సెలవుల జాబితా కోసం ఇక్కడ <

దేశంలో సంస్కరణలకు పునాది వేసి రాజకీయ, ఆర్థిక రంగాల్లో మన్మోహన్ సింగ్ గణనీయమైన ప్రభావాన్ని చూపారని CWC కొనియాడింది. మాజీ ప్రధాని గౌరవార్థం సమావేశమైన CWC ఆయన నాయకత్వమే క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ముందుకు నడిపిందని కీర్తించింది. ఆయన లెగసీని కొనసాగిస్తామని తీర్మానించింది. శనివారం ఉదయం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ భౌతికకాయాన్ని తరలించనున్నారు.

నోట్ల రద్దును మాన్యుమెంటల్ డిజాస్టర్గా మన్మోహన్ అభివర్ణించారు. నల్లధనాన్ని వెలికితీయడానికే నోట్ల రద్దు చేశామని చెప్పిన మోదీ, మొత్తం కరెన్సీ నల్లధనమని- మొత్తం నల్లధనం కరెన్సీ రూపంలో ఉందనే తప్పుడు ఊహ నుంచి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ చర్య ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేస్తుందని అనాడు మన్మోహన్ చెప్పినట్టే రూపాయి విలువ ఈ రోజు జీవిత కాల కనిష్టానికి చేరుకుందని నిపుణులంటున్నారు.

UPI చెల్లింపులపై RBI శుభవార్త చెప్పింది. ఇకపై థర్డ్ పార్టీ యాప్ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్(PPI) వ్యాలెట్లలోని సొమ్ముతో చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది. ఇప్పటివరకు PPI సంస్థకు చెందిన UPI ద్వారానే ఈ తరహా పేమెంట్లకు అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో ఫోన్పే, పేటీఎం సహా పలు వ్యాలెట్లలోని మొత్తాన్ని ఇతర యాప్ల్లోనూ వాడుకోవచ్చు. దీంతో గిఫ్ట్, డిజిటల్ వ్యాలెట్లు వాడే వారికి ఈజీ అవుతుంది.

రానున్న ఏడాదిలో 2 సూర్య, 2 చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 14న ఏర్పడుతుంది. ఇది మన దేశంలో కనిపించదు. US, వెస్ట్రన్ యూరప్, ఆఫ్రికాలో దర్శనమిస్తుంది. మార్చి 29న ఏర్పడే పాక్షిక సూర్య గ్రహణం కూడా స్వదేశంలో కనిపించదు. Sep 7-8 మధ్య ఏర్పడే సంపూర్ణ చంద్ర గ్రహణం మాత్రమే భారత్లో కనిపిస్తుంది. Sep 21న పాక్షిక సూర్యగ్రహణాన్ని కూడా మనం చూసే అవకాశం ఉండదు.

మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కోసం ఢిల్లీలోని యమునా నద్ది ఒడ్డున ప్రత్యేక స్మృతి స్థలాన్ని కేటాయించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ కోరింది. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి ఖర్గే తీసుకెళ్లారు. రాజ్నాథ్ సింగ్తోనూ కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. అయితే, స్థలం కొరత దృష్ట్యా జాతీయ స్థాయి నేతలకు రాజ్ ఘాట్లో ఉమ్మడి స్మారక స్థలం- రాష్ట్రీయ స్మృతి స్థల్ ఏర్పాటుకు 2013లోనే UPA నిర్ణయించడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ తదితర ప్రాంతాల్లో జనవరి, ఫిబ్రవరిలో జరిగే మహా కుంభమేళాను పురస్కరించుకుని SCR 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, మౌలాలి, కాచిగూడ నుంచి వివిధ తేదీల్లో బయల్దేరే ఈ రైళ్లు గయ, పాట్నా, అజంగఢ్ వరకు ప్రయాణిస్తాయి. రైళ్లు ప్రయాణించే తేదీలు, హాల్టింగ్ల వివరాలను పైనున్న ఫొటోల్లో చూడవచ్చు.

AP: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు ఒకరోజు ముందే పింఛన్లు అందించనుంది. సాధారణంగా ప్రతినెలా 1న వీటిని జారీ చేస్తుండగా ఈసారి జనవరి 1 కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31నే అందజేయాలంటూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు, వితంతువులకు రూ.4వేల పింఛన్ అందుతోంది.

మనుషుల్లాగే కుక్కలు, పిల్లులనూ షుగర్ వ్యాధి వేధిస్తుందంటే ఆశ్చర్యపోకతప్పదు. వాటి బాధను చూడలేక, వైద్యానికి ఖర్చుచేయలేక ఇంజెక్షన్లు ఇచ్చి 20% జీవాల్ని చంపేస్తారని తెలిస్తే గుండెతరుక్కుపోవడం ఖాయం. వీటిలోనూ టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉంటుందని, ఆకలి తగ్గిపోతుందని పరిశోధకులు అంటున్నారు. వాటి నడక, బరువు, ఉత్సాహం, కూర్చొనే తీరును బట్టి వ్యాధిని గుర్తించొచ్చు. సోడియం గ్లూకోజ్ వంటి ఔషధాలను వీటికి వాడతారు.

ఈ ఏడాదికి సంబంధించిన ఆర్డర్స్ నివేదికను స్విగ్గీ మార్ట్ విడుదల చేసింది. హైదరాబాదీలు ఈ ఏడాది 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేశారని, దాదాపు 2 లక్షల కండోమ్లను బుక్ చేసినట్లు పేర్కొంది. అత్యధికంగా ఆర్డర్ చేసిన వస్తువుల్లో పాలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఉన్నట్లు తెలిపింది. నగర ప్రజలు కేవలం ఐస్క్రీమ్లకే దాదాపు ₹31 కోట్లు, బ్యూటీ ప్రొడక్ట్స్కు ₹15 కోట్లు ఖర్చు చేశారంది.
Sorry, no posts matched your criteria.