India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు ఒకరోజు ముందే పింఛన్లు అందించనుంది. సాధారణంగా ప్రతినెలా 1న వీటిని జారీ చేస్తుండగా ఈసారి జనవరి 1 కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31నే అందజేయాలంటూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు, వితంతువులకు రూ.4వేల పింఛన్ అందుతోంది.

మనుషుల్లాగే కుక్కలు, పిల్లులనూ షుగర్ వ్యాధి వేధిస్తుందంటే ఆశ్చర్యపోకతప్పదు. వాటి బాధను చూడలేక, వైద్యానికి ఖర్చుచేయలేక ఇంజెక్షన్లు ఇచ్చి 20% జీవాల్ని చంపేస్తారని తెలిస్తే గుండెతరుక్కుపోవడం ఖాయం. వీటిలోనూ టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉంటుందని, ఆకలి తగ్గిపోతుందని పరిశోధకులు అంటున్నారు. వాటి నడక, బరువు, ఉత్సాహం, కూర్చొనే తీరును బట్టి వ్యాధిని గుర్తించొచ్చు. సోడియం గ్లూకోజ్ వంటి ఔషధాలను వీటికి వాడతారు.

ఈ ఏడాదికి సంబంధించిన ఆర్డర్స్ నివేదికను స్విగ్గీ మార్ట్ విడుదల చేసింది. హైదరాబాదీలు ఈ ఏడాది 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేశారని, దాదాపు 2 లక్షల కండోమ్లను బుక్ చేసినట్లు పేర్కొంది. అత్యధికంగా ఆర్డర్ చేసిన వస్తువుల్లో పాలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఉన్నట్లు తెలిపింది. నగర ప్రజలు కేవలం ఐస్క్రీమ్లకే దాదాపు ₹31 కోట్లు, బ్యూటీ ప్రొడక్ట్స్కు ₹15 కోట్లు ఖర్చు చేశారంది.

AP: కర్నూలు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. విశ్రాంత IAS అధికారి ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన టీజీ భరత్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఇకపై సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

పైనున్న ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు మహిళలెవరని ఆలోచిస్తున్నారా? ఈ ముగ్గురూ వైద్యులుగా లైసెన్స్ పొందిన తొలి మహిళలు. 1885లో తీసిన ఈ ఫొటోలో ఓ భారతీయురాలు కూడా ఉండటం విశేషం. ఆమె పేరు ఆనందీబాయి జోషి(చీరలో ఉన్నారు). మరో ఇద్దరు జపాన్కు చెందిన కెయి ఒకామి, సిరియా నుంచి సబాత్ ఇస్లాంబూలీ. కాగా, ఆనందీబాయి 1886లో వైద్య విద్యలో పట్టా పొందారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ఒకపూట సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. ఇప్పటికే 7 రోజుల పాటు సంతాప దినాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ఇవాళ సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

USD/INR 85.82 వద్ద ఆల్టైమ్ కనిష్ఠానికి చేరడంతో PM మోదీపై విమర్శలు వస్తున్నాయి. UPA హయాంలో రూపాయి విలువ పడిపోయినప్పుడు ఆయన చేసిన ట్వీట్లను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. మోదీ చెప్పినట్టు రూపాయి నిజంగానే ICU బెడ్పై ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘మమ్మల్ని గెలిపిస్తే 100 రోజుల్లో ఇన్ఫ్లేషన్ తగ్గిస్తాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రూపాయి ICUలో చేరింద’ని 2013లో మోదీ ట్వీటారు.

డైలీ డేటా అయిపోయినప్పుడు వినియోగించే రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీని జియో తగ్గించింది. ఇప్పటివరకు ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసేవరకు ఈ వోచర్ వ్యాలిడిటీ ఉండేది. కానీ రూ.19తో రీఛార్జ్ చేస్తే వచ్చే 1జీబీ డేటాను ఒకరోజుకు, రూ.29 రీఛార్జ్ డేటా 2జీబీని రెండురోజులకు పరిమితం చేసింది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయం యూజర్లకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో తనకున్న అనుబంధాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం నెమరేసుకున్నారు. ‘గతంలో నేను జైలుకు వెళ్లినప్పుడు సింగ్ అండగా నిలిచారు. మలేషియా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా, నా పిల్లల చదువు కోసం స్కాలర్షిప్ చెల్లిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన ప్రతిపాదనను నేను సున్నితంగా తిరస్కరించా’ అంటూ సింగ్ మరణవార్త తెలిసి Xలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

పంజాబ్లోని బఠిండాలో ఓ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. స్థానిక MLA జగ్పూర్ సింగ్ గిల్ తెలిపిన వివరాల మేరకు వంతెనపై రెయిలింగ్ను ఢీకొనడంతో బస్సు కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆయన తెలిపారు. 18 మంది ప్రయాణికులు షాహిద్ భాయ్ మణిసింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Sorry, no posts matched your criteria.