News March 17, 2024

బిగ్‌ బాస్ విన్నర్ అరెస్ట్

image

బిగ్‌ బాస్ OTT2(హిందీ) విన్నర్, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ అరెస్ట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై అక్రమంగా పాము విషం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ వ్యక్తి కెమెరాతో షూట్ చేసినందుకు అతడిపై భౌతికంగా దాడికి పాల్పడటంతో వార్తల్లోకి ఎక్కారు. కాగా ఎల్విష్ వైల్డ్ కార్డ్‌లో వచ్చి టైటిల్ గెలుచుకున్న మొదటి కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించారు.

News March 17, 2024

గంట నుంచీ విమానంలోనే సీఎం రేవంత్!

image

ముంబై వెళ్లేందుకు సీఎం రేవంత్ ఎక్కిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ముంబైలో రాహుల్ న్యాయ్ యాత్ర సభకు వెళ్లేందుకు ఆయనతో పాటు దీపాదాస్ మున్షీ, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితర అగ్రనేతలు విమానం ఎక్కారు. అయితే, ఫ్లైట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో గంట నుంచీ అందులోనే ఉండిపోయారు. దీంతో వారి ముంబై ప్రయాణం ఆలస్యం కానుంది.

News March 17, 2024

జయప్రదకు భారీ ఊరట

image

ప్రముఖ నటి జయప్రదకు భారీ ఊరట లభించింది. ESIC కేసులో ఆమెకు ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈఎస్ఐసీ కింద రూ.8 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. జయప్రద నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు థియేటర్ కార్మికులు ఫిర్యాదు చేశారు. దీనిపై మెట్రోపాలిటన్ కోర్టు శిక్ష విధించింది. మద్రాస్ హైకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించడంతో ఆమె సుప్రీంకు వెళ్లారు.

News March 17, 2024

అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు

image

2 రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో జూన్ 2న కౌంటింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. నిన్న విడుదల చేసిన షెడ్యూల్‌లో తొలుత జూన్ 4న కౌంటింగ్ ఉండగా.. ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొత్త కౌంటింగ్ తేదీని ప్రకటించింది. ఏప్రిల్ 19న ఇరు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది.

News March 17, 2024

మళ్లీ మభ్యపెట్టేందుకు వస్తున్నారు: YSRCP

image

AP: చిలకలూరిపేట బొప్పూడిలో జరిగే TDP-JSP-BJP సభపై వైసీపీ Xలో మండిపడింది. ‘నాడు 650 హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత మేనిఫెస్టోను అటకెక్కించారు. మళ్లీ ఇప్పుడు అధికార దాహం కోసం ప్రజలను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నారు. 3 పార్టీలను 2019లో ప్రజలు ఈడ్చి తన్నారు. ఇప్పుడు మభ్యపెట్టేందుకు మళ్లీ వస్తున్నారు’ అని ఓ ఫొటోను ట్వీట్ చేసింది.

News March 17, 2024

మీ ఆధార్‌ను ఎక్కడ వాడారో తెలుసుకోండిలా!

image

✒ <>https://uidai.gov.in/en/<<>> పోర్టల్‌లో MY AADHAAR ఆప్షన్‌లోని ఆధార్ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి.
✒ Aadhaar Authentication History ఆప్షన్‌ను ఎంచుకోగానే కొత్త పేజ్‌ ఓపెన్‌ అవుతుంది.
✒ అక్కడ ఆధార్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేస్తే Authentication History కనిపిస్తుంది.
✒ ఓటీపీ, బయోమెట్రిక్‌, డెమోగ్రాఫిక్‌ ద్వారా మీ ఆధార్‌ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే డేటా కనిపిస్తుంది.

News March 17, 2024

ప్రపంచంలోనే రెండో స్థానంలో రస మలాయ్

image

భారత్‌కు చెందిన స్వీట్ ‘రస మలాయ్’ అరుదైన ఘనత సాధించింది. టేస్ట్ అట్లాస్ ప్రకటించిన వరల్డ్స్ టాప్-10 బెస్ట్ చీజ్ డెజర్ట్స్ జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. ఇది పశ్చిమబెంగాల్‌లో పుట్టింది. దీనికి 4.4/5 రేటింగ్ లభించింది. పోలాండ్‌కు చెందిన సెర్నిక్ 4.5/5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్ఫకియానోపిత(చైనా), న్యూయార్క్ తరహా చీజ్(అమెరికా), సౌఫిల్ చీజ్(జపాన్), బాస్క్ చీజ్(స్పెయిన్) ఉన్నాయి.

News March 17, 2024

రాజ్యాంగాన్ని మార్చే ధైర్యం బీజేపీకి లేదు: రాహుల్

image

బీజేపీ కేవలం హడావుడి పార్టీ అని, దేశ రాజ్యాంగాన్నే మార్చేంత ధైర్యం దానికి లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ‘ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కాంగ్రెస్, బీజేపీ మధ్య కాదు. రెండు సిద్ధాంతాల మధ్య. ప్రజల మద్దతు, నిజం మా వైపు ఉన్నాయి. నిరుద్యోగులకు, కార్మిక కర్షకులకు ఏ జ్ఞానం ఉండదని బీజేపీ నేతలు అనుకుంటారు. అధికారమంతా ఒకేచోట ఉంచాలని భావిస్తారు. అధికార వికేంద్రీకరణ మా విధానం’ అని పేర్కొన్నారు.

News March 17, 2024

రూ.10వేల కోట్లతో విశాఖను గొప్ప రాజధానిగా చేయొచ్చు: బొత్స

image

AP: అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనే 3 రాజధానుల ప్రతిపాదన చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఎవరిమీదో కక్షతోనో విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించలేదని స్పష్టం చేశారు. ‘గత పాలకులు ₹1.19 లక్షల కోట్లతో అమరావతి నిర్మాణ ప్రణాళిక వేసి.. 15ఏళ్లలో ₹20 లక్షల కోట్లకు పెంచే ప్రయత్నం చేశారు. ఇంత ఖర్చుతో రాజధాని అవసరమా? ₹10వేల కోట్లతో విశాఖను దేశంలోనే గొప్ప రాజధానిగా చేయొచ్చు’ అని తెలిపారు.

News March 17, 2024

కోహ్లీకి రోహిత్ మద్దతు?

image

T20WCలో చోటుపై విరాట్ కోహ్లీకి.. కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు పలికినట్లు తెలుస్తోంది. జూన్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీకి అతడు భారత జట్టులో ఉండాల్సిందేనని హిట్‌మ్యాన్ బీసీసీఐ పెద్దలతో చెప్పినట్లు సమాచారం. పలువురు సెలక్టర్లు మూడో స్థానంలో ఇషాన్‌ను ఆడించాలని యోచిస్తుండగా రోహిత్ మాత్రం కోహ్లీ వైపు మొగ్గు చూపుతున్నారట. వరల్డ్ కప్‌లో విరాట్ స్థానంపై త్వరలోనే సెలక్టర్లు అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉంది.