News March 16, 2024

తెలంగాణ పెనం నుంచి పొయ్యిలో పడింది: మోదీ

image

TG: గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి NDA ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ‘రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ రూపంలో రెండు విసురురాళ్ల మధ్య ఇరుక్కుపోయారు. ప్రజల కలలను ఈ రెండు పార్టీలు పొడి చేశాయి. ఇప్పుడు రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లింది. గొయ్యిలో నుంచి బయటికి వస్తే నుయ్యిలోకి.. పెనం నుంచి పొయ్యిలో పడినట్లయింది’ అని మోదీ ఎద్దేవా చేశారు.

News March 16, 2024

టీ20ల్లో కొత్త రికార్డు

image

అంతర్జాతీయ టీ20ల్లో 400 ఫోర్లు బాదిన తొలి బ్యాటర్‌గా ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ రికార్డు సృష్టించారు. అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్ల లిస్టులో అతను 401 ఫోర్లతో టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బాబర్ ఆజమ్ (395), విరాట్ కోహ్లీ (361), రోహిత్ శర్మ (359, డేవిడ్ వార్నర్ (320) ఉన్నారు. ఇక సిక్సర్ల విషయానికి వస్తే రోహిత్ శర్మ (190) తొలి స్థానంలో కొనసాగుతున్నారు.

News March 16, 2024

పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్

image

AP: దివంగత YS వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రవేశంపై సస్పెన్స్ నెలకొంది. నిన్న వివేకా వర్ధంతి కార్యక్రమంలో దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా కొద్దిరోజుల నుంచి సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మ YCPపై విమర్శల డోస్ పెంచారు. ఈ నేపథ్యంలో వీరి పొలిటికల్ ఎంట్రీ ఉండొచ్చని, త్వరలోనే స్పష్టత వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే అన్ని వర్గాల మద్దతు దొరుకుతుందని అభిప్రాయపడుతున్నారు.

News March 16, 2024

బీఆర్ఎస్‌కు మంత్రి కోమటిరెడ్డి పంచ్

image

TG: ఢిల్లీ లిక్కర్ కేసుకు, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ‘గతంలో ఏపీలో చంద్రబాబును అరెస్టు చేస్తే HYDలో నిరసనలు ఎందుకన్నారు. మరి ఇప్పుడు కవితను ED అరెస్టు చేస్తే రాష్ట్రంలో ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు? వెళ్లి ఢిల్లీలోని ED కార్యాలయం ముందు చేసుకోండి. అమాయక కార్యకర్తలను రోడ్లపైకి తెస్తున్నారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

News March 16, 2024

సీఏఏ అమలుపై సుప్రీంకోర్టుకు ఒవైసీ

image

పౌరసత్వ సవరణ చట్టం అమలును సవాల్ చేస్తూ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టం అమలుపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. పౌరసత్వాన్ని కోరుతూ వచ్చే దరఖాస్తులను 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6బీ ప్రకారం స్వీకరించొద్దన్నారు. ప్రభుత్వం అఫ్గాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రజలకు పౌరసత్వం ఇవ్వొచ్చు కానీ మతం ఆధారంగా ఇవ్వకూడదని ఒవైసీ ఇటీవల సూచించారు.

News March 16, 2024

ఎన్నికలకు ముందే ప్రజలు ఫలితాలు ప్రకటించారు: మోదీ

image

TG: ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వకముందే ప్రజలు ఫలితాలు ప్రకటించారని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తామని తేల్చారని ఆయన పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో మోదీ మాట్లాడారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

News March 16, 2024

హార్దిక్‌కు స్పెషల్ రూల్స్ ఎందుకు?: మాజీ క్రికెటర్

image

హార్దిక్ పాండ్య కూడా మిగతా ఆటగాళ్లలాగే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘అతను చంద్రుడి పైనుంచి దిగి వచ్చాడా? అతను కూడా దేశవాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు ఆడాలి. అతని విషయంలో ప్రత్యేకంగా వేరే నిబంధనలు ఎందుకు? కేవలం వైట్‌బాల్ టోర్నీల్లోనే ఎందుకు ఆడటం? అన్ని ఫార్మాట్లలో ఆడమని బీసీసీఐ అతనికి వార్నింగ్ ఇవ్వాలి’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News March 16, 2024

కవితను అక్రమంగా అరెస్టు చేశారు: లాయర్

image

కవిత తరఫు లాయర్ విక్రమ్ చౌదరి రౌస్ అవెన్యూ కోర్టులో కీలక వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని ఉల్లంఘించి ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారని తెలిపారు. కవితకు సుప్రీంకోర్టు ఇచ్చిన రిలీఫ్ ఇంకా అమలులో ఉందని చెప్పారు. ఈడీ విచారణకు కవిత సహకరించారని, అయినా అక్రమంగా అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

News March 16, 2024

కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటన

image

AP: సీఎం జగన్ ఇడుపులపాయకు బయలుదేరారు. మ.12.30కు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు. మ.1 గంటకు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే 68 అసెంబ్లీ స్థానాల్లో జగన్ మార్పులు చేశారు.

News March 16, 2024

జాబితాలో బీసీలకు అధిక ప్రాధాన్యం: సజ్జల

image

AP: చంద్రబాబు పార్టీ వెంటిలేటర్‌పై ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని గుర్తు చేశారు. చంద్రబాబు మాటలే తప్ప బీసీలకు ఏనాడు న్యాయం చేయలేదని విమర్శించారు.