News September 25, 2024

కొత్త కోర్సు.. నేడు ప్రారంభించనున్న సీఎం

image

TG: BFSI(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్) మినీ డిగ్రీ కోర్సును CM రేవంత్ ఇవాళ ప్రారంభించనున్నారు. అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న ఈ కోర్సును డిగ్రీ, ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులకు అందిస్తారు. పట్టా పొందినవారి వివరాలతో హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రత్యేక పోర్టల్‌ రూపొందించనుంది. BFSI రంగంలో పేరొందిన కంపెనీలు తమకు అవసరమైన వారిని జాబ్స్‌కు ఎంపిక చేసుకునేందుకు ఈ పోర్టల్ వారధిగా పనిచేయనుంది.

News September 25, 2024

భారీ వర్షాలు.. తీవ్ర విషాదం

image

TG: భారీ వర్షాలు రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపాయి. పిడుగుపాటుకు వివిధ ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు. భద్రాద్రి(D) దమ్మపేట(మ) జగ్గారంలో వర్షం పడుతోందని ఓ చెట్టు కిందకు వెళ్లడంతో సమీపంలో పిడుగుపడి నాగశ్రీ(22), అనూష(23) చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మహబూబ్‌నగర్, కరీంనగర్, NZB జిల్లాల్లో ఇద్దరు వృద్ధులు, మరో వ్యక్తి(29) తుదిశ్వాస విడిచారు.

News September 25, 2024

30 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం

image

TG: రాష్ట్రంలో ఖాళీ అవనున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నట్లు CEO సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే మార్చి 29తో కరీంనగర్, NZB, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలు, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కానున్నాయి. ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ కాగా డిసెంబర్ 30న తుది జాబితా విడుదల చేస్తారు.

News September 25, 2024

ప్రజలను పవన్ రెచ్చగొడుతున్నారు: హర్షకుమార్

image

AP: తిరుమల లడ్డూ విషయంలో హిందువులంతా రోడ్లపైకి రావాలన్న పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలు సరికాదని మాజీ MP హర్షకుమార్ మండిపడ్డారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ప్రజలను రెచ్చగొడుతున్న ఆయనను వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. కుట్రతోనే CM చంద్రబాబు లడ్డూ ఆరోపణలు చేస్తున్నారని, కల్తీపై ఆయన వద్ద ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సిట్‌తో ఎలాంటి ఉపయోగం లేదని, సీబీఐతో విచారణ చేయించాలని హర్షకుమార్ అన్నారు.

News September 25, 2024

ట్రామ్‌లకు త్వరలోనే ‘సెలవు’

image

కోల్‌కతా మహానగరంలో 150 ఏళ్లుగా కొనసాగుతున్న ట్రామ్ సేవలు నిలిచిపోనున్నాయి. దేశంలో ప్రస్తుతం ఈ ఒక్క నగరంలో ట్రామ్ రవాణా సదుపాయం ఉండగా, త్వరలో నిలిపివేస్తామని మంత్రి స్నేహాశీష్ చక్రబర్తి తెలిపారు. నగరంలో పరిమిత వేగంతో ప్రయాణించే ట్రామ్‌ల వల్ల ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కోల్‌కతాలో 1873 నుంచి ట్రామ్‌లు సేవలందిస్తున్నాయి.

News September 25, 2024

రాష్ట్రంలో 15 లక్షల రేషన్ కార్డుల రద్దు?

image

TG: రాష్ట్రంలో దాదాపు 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఈ-కేవైసీ ప్రక్రియకు హాజరుకాకపోవడంతో వీరందరి కార్డులను ప్రభుత్వం రద్దు చేస్తుందని సమాచారం. ఇకపై రేషన్ కార్డుల జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచి సిటిజన్ 360 డేటా సాయంతో అర్హులైన వారికే కార్డులు మంజూరు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.

News September 25, 2024

దసరా నాటికి క్యాబినెట్ విస్తరణ

image

TG: దసరాలోగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 6 ఖాళీల్లో ఇప్పటికే నలుగురి పేర్లు ఖరారయ్యాయని, మరో 2 పేర్లు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వేర్వేరు పేర్లు ప్రతిపాదించడంతోనే ఈ రెండు బెర్తులు పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. కశ్మీర్, హరియాణా ఎన్నికలు ముగిశాక AICC నేతలతో రేవంత్ చర్చలు జరిపి క్యాబినెట్ జాబితా సిద్ధం చేస్తారని సమాచారం.

News September 25, 2024

ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం

image

AP: ఇటీవల వరదల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఆధార్, బర్త్, డెత్, మ్యారేజీ సర్టిఫికెట్లు పోగొట్టుకున్నా, నాశనమైనా డూప్లికెట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించింది.

News September 25, 2024

ఇవాళ భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ADB, నిర్మల్, NZB, జగిత్యాల, సిరిసిల్ల, MDK, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల మోస్తరు వర్షాలు పడతాయంది. అటు APలోని KKD, కోనసీమ, తూ.గో., ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

News September 25, 2024

షాహిన్ అఫ్రీదికి గాయం.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరం?

image

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రీదికి గాయమైంది. దీంతో అతడు టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యే ఛాన్సుంది. ఛాంపియన్స్ వన్డేకప్‌లో డాల్ఫిన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. మోకాలికి బంతి బలంగా తాకడంతో తీవ్రంగా గాయపడి మైదానాన్ని వీడారు. ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. OCT 7 నుంచి ఇంగ్లండ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది.