India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
AP: సనాతన ధర్మ పరిరక్షణకు జనసేన పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా 4 రోజులు జనసేన పార్టీ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ నెల 30న దీపారాధన, అక్టోబర్ 1న ఓం నమో నారాయణాయ మంత్ర పఠనం, 2న నగర సంకీర్తన, 3న ఆలయాల్లో భజన కార్యక్రమాలు చేపట్టనున్నారు. పార్టీ నాయకులు, వీర మహిళల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు.
✒ తేది: సెప్టెంబర్ 25, బుధవారం
✒ అష్టమి: మధ్యాహ్నం 12.11 గంటలకు
✒ ఆరుద్ర: రాత్రి 10.23 గంటలకు
✒ వర్జ్యం: ఉదయం 6.28- 08.06 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 11.34 నుంచి 12.23 గంటల వరకు
* TG: చెరువుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: రేవంత్
* అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన వారిపై చర్యలు తీసుకోండి: KTR
* అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వొద్దు: హైడ్రా
* AP: సనాతన ధర్మం కోసం చావడానికైనా సిద్ధం: పవన్
* లడ్డూ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోవాల్సింది చంద్రబాబే: YCP
* రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా
* యూట్యూబర్ హర్ష సాయిపై రేప్ కేసు నమోదు
* లెబనాన్లో 558కి చేరిన మరణాల సంఖ్య
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దేవర మేనియా నడుస్తోంది. తొలి రోజే తమ అభిమాన హీరో సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అవకాశంగా కొందరు వ్యక్తులు ఫేక్ టికెట్లను ఎరవేసే అవకాశం ఉందని పలువురు సూచిస్తున్నారు. ట్రస్టెడ్ సైట్లను మాత్రమే నమ్మాలని చెబుతున్నారు.
HYD పరిధిలో వ్యాపార సముదాయాల పనివేళలను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. హోటల్స్, రెస్టారెంట్స్, ఐస్క్రీమ్, కాఫీ, పాన్ షాప్స్ను అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకునేందుకు అనుమతినిచ్చింది. క్లాత్స్, జువెల్లరీ, సూపర్ మార్కెట్స్, కిరాణా తదితర షాప్స్ ఉ.9 నుంచి రా.11 వరకు, వైన్స్ 10am నుంచి 11pm వరకు, బార్లు వీక్ డేస్లో ఉ.10-రా.12, వీకెండ్స్లో ఉ.10-రా.ఒంటి గంట వరకు నడపొచ్చని పేర్కొంది.
వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం జరిగిన చోట అత్యవసర సహాయక చర్యలు అందించేందుకు ‘రైల్ రక్షక్ దళ్’ను ఏర్పాటు చేసింది. దీని కోసం ఉద్యోగులకు అన్ని విభాగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్లో దీనిని ప్రారంభించింది.
AP: రేపు రాష్ట్రంలో అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, వైజాగ్, అనకాపల్లి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది.
జీవిత కాల గరిష్ఠాల వద్ద ఉన్న బెంచ్ మార్క్ సూచీలకు దేశ ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా విశ్లేషించే కొన్ని నివేదికలు కీలకం కానున్నాయి. HSBC కాంపోజిట్, మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ PMI ఫ్లాష్లతో సహా రాబోయే ఆర్థిక డేటాపై ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నారు. ఇవి దేశ ఆర్థిక పరిస్థితిపై ఇన్సైట్స్ ఇవ్వనున్నాయి. రాబోయే రోజుల్లో FIIల ప్రవాహం, చమురు ధరలు సూచీల కదలికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.
బంగ్లాదేశ్తో జరిగే రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం లేని నేపథ్యంలో అతడిని జట్టు నుంచి విడుదల చేయొచ్చని తెలుస్తోంది. ఇరానీ కప్లో ముంబై, రెస్టాఫ్ ఇండియా మధ్య త్వరలో మ్యాచ్ జరగనుంది. తమ కీలక ఆటగాడు సర్ఫరాజ్ను ఆ మ్యాచ్కోసం పంపించాలని బీసీసీఐని ముంబై కోరవచ్చని సమాచారం. శ్రేయస్ అయ్యర్, శార్దూల్ థాకూర్ తదితర ఆటగాళ్లంతా ఇరానీ కప్లో ఆడనున్నారు.
Sorry, no posts matched your criteria.