India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TDP, JDU కేంద్రంలో BJPకి మరింత దగ్గరవుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. తిరుమల ప్రసాదం వివాదంలో TDP-జనసేన వైఖరి, విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన 8 నెలల తర్వాత అయోధ్య రామమందిర నిర్మాణంపై PM మోదీని బిహార్ CM నితీశ్ ప్రశంసించడం అందులో భాగమే అని చెబుతున్నారు. అయితే, హిందూత్వ ఓటు బ్యాంకు BJPకి దక్కకుండా ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది.
తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంటి నుంచి గెంటివేసినట్లు ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తన వస్తువులను తిరిగి ఇవ్వాలని కోరారు. కాగా ఇటీవల భార్యతో విడాకులు తీసుకోనున్నట్లు జయం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే.
చదరపు అడుగుకి రూ.10 వేలు అంటేనే అమ్మో అంటాం. అలాంటిది ముంబైలోని వర్లీలో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, అతని తల్లి Sq.ftకి ₹55,238 చొప్పున 525 చ.అ ఇంటిని ₹2.90 కోట్లతో కొన్నట్టు జాప్కీ యాక్సెస్ వెల్లడించింది. దీనికి స్టాంప్ డ్యూటీ ₹17.40 లక్షలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ₹30,000 *శ్రేయస్ అయ్యర్ గతంలో ముంబైలో మాక్రోటెక్ డెవలపర్లతో 48వ ఫ్లోర్లో 2380 Sq.ft ఇంటిని చ.అ.కు ₹49,817 చొప్పున కొనుగోలు చేశారు.
భార్య సంపాదించగలిగినప్పటికీ, ఆమెను ఆర్థికంగా ఆదుకునే బాధ్యత భర్తదేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆమెను ‘పరాన్నజీవి’ అని పిలవడం ఆమెకే కాకుండా మహిళలందరికీ అగౌరవమే అని వ్యాఖ్యానించింది. భార్యకు భరణం చెల్లించాలన్న కింది కోర్టు ఆదేశాలను భర్త SCలో సవాల్ చేశారు. కేసు విచారణ సందర్భంగా భారతీయ మహిళలు తమ కుటుంబం, పిల్లలు, భర్త-అతని తల్లిదండ్రులను చూసుకోవడానికి తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారని పేర్కొంది.
TG: 2008 డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2008లో డీఎస్సీ అర్హత సాధించి ఉద్యోగం పొందని అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో పనిచేసేందుకు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో 1,200 మందికి లబ్ధి చేకూరే అవకాశముంది. డీఎస్సీ అభ్యర్థులు ఉమ్మడి జిల్లా కేంద్రాలలోని డీఈవో కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశమిచ్చింది.
తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. ‘నా కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అర్జున్.. జీవితంపై నీకున్న ప్రేమ, రాజీపడని నిబద్ధత నాకు ప్రతిరోజూ స్ఫూర్తినిస్తుంటాయి. రోజూ ఉదయం క్రమం తప్పకుండా జిమ్ చేయడం నీ క్రమశిక్షణను సూచిస్తుంది. నీ గురించి ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను. నీ కలలను సాధించు’ అని విష్ చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి2898ఏడీ’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీని సీక్వెల్పై నెట్టింట పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సీక్వెల్కు ‘కర్ణ3102బీసీ’ అని టైటిల్ నిర్ణయించారని.. కర్ణుడు, అశ్వత్థామ, యాస్కిన్ల చుట్టూ కథ తిరుగుతుందని ఆ వార్తల సారాంశం. మహాభారతం సమయంలో జరిగే సీన్లు ఎక్కువగా ఉంటాయని చర్చ నడుస్తోంది. 2028లో మూవీ రిలీజ్ కానుందని సమాచారం. ఈ వార్తలు ఎంతవరకూ నిజమో చూడాలి.
TG: మూసీ నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 10,200 మంది నిర్వాసితులను గుర్తించింది. ముందుగా రివర్ బెడ్లోని 1600 ఇళ్లను తొలగించనున్నట్లు సమాచారం. RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లించనుంది. పట్టా భూమి ఉంటే ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పాటు భూమి విలువ కూడా చెల్లించాలని నిర్ణయించనుంది.
TG: పారాలింపిక్స్-2024లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ రెడ్డి రూ.కోటి చెక్కును అందజేశారు. ఈ నెల 7న రేవంత్ రెడ్డి దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి, వరంగల్లో 500 గజాల ఇంటిస్థలం, కోచ్కు రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఇక ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ గ్రహీత దర్శనం మొగిలయ్యకు HYD హయత్ నగర్లో 600 చదరపు గజాల ఇంటిస్థలం ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
రైలు పట్టాలపై హానికర వస్తువులను ఉంచి ప్రమాదాలకు కుట్ర చేస్తున్నవారిని పట్టుకొనేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ తరహా ఘటనలను రైల్వే శాఖ తీవ్రంగా పరిగణిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు, DGPలతో కలసి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఘటనలు పునరావృతం కాకుండా, నేరస్థులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.