News December 24, 2024

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదే

image

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. గ్రూప్ దశలో భారత్ మొత్తం 3 మ్యాచులు ఆడనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది. భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్‌లో జరుగుతాయి. మార్చి 4న సెమీఫైనల్-1, 5న సెమీఫైనల్-2, 9న ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. భారత్ ఫైనల్‌కు చేరితే ఈ మ్యాచ్‌ దుబాయ్‌లో జరుగుతుంది. లేదంటే లాహోర్‌లో నిర్వహిస్తారు.

News December 24, 2024

2024లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు

image

☛ ఐరా ఖాన్-నుపుర్ శిఖరే (JAN 3)
☛ తాప్సి-మథియాస్ బో (MARCH 23)
☛ సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ (JUNE 23)
☛ అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ (JULY 12)
☛ సిద్ధార్థ్-అదితి రావు హైదరీ (SEP 16)
☛ అక్కినేని నాగచైతన్య-శోభిత (DEC 4)
☛ కీర్తి సురేశ్-ఆంటోనీ (DEC 12)
☛ పీవీ సింధు-వెంకట్ దత్తా (DEC 22)

News December 24, 2024

సీఎం రేవంత్ దావోస్ పర్యటన

image

TG: సీఎం రేవంత్ రెడ్డి జనవరి 20 నుంచి 24 వరకు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అక్కడ జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ టూర్‌కు వెళ్తారు.

News December 24, 2024

యశస్వీ జైస్వాల్ ఆ తప్పు చేస్తున్నారు: పుజారా

image

భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ క్రీజులో ఫాస్ట్‌గా ఆడాలని కంగారు పడుతున్నారని క్రికెటర్ పుజారా అభిప్రాయపడ్డారు. తొలి 15 పరుగులు వేగంగా చేయాలనుకుని తప్పు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ వంటి దూకుడైన ఆటగాడు సైతం బంతి తన జోన్‌లో ఉన్నప్పుడే బలంగా బాదుతారు. కానీ జైస్వాల్ అనవసరమైన షాట్స్ ఆడుతున్నారు. బంతిని వద్దకు రానివ్వాలి. క్రీజులో ఎక్కువ సేపు నిలబడాలి’ అని సూచించారు.

News December 24, 2024

‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటన.. ఏ-18గా మైత్రీ మూవీ మేకర్స్

image

‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు మైత్రీ మూవీ మేకర్స్‌ను ఏ-18గా చేర్చారు. ఇప్పటికే హీరో అల్లు అర్జున్‌ను ఏ-11గా చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్, సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లోర్ ఇన్‌ఛార్జి, అల్లు అర్జున్ బౌన్సర్లను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్‌తోపాటు సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

News December 24, 2024

ముగిసిన శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు

image

సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. ఆయన కుటుంబీకులు, సినీరంగ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక సెలవంటూ అశ్రునయనాలతో నివాళులర్పించారు. ఆయన రూపొందించిన కళాఖండాల్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మూత్ర పిండాల సమస్యతో శ్యామ్ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

News December 24, 2024

ఆ మూడు రంగాలు రాణించాయి

image

స్టాక్ మార్కెట్‌లో ఫ్లాట్ ట్రెండ్‌లోనూ FMCG, Auto, Oil & Gas షేర్లు అరశాతం మేర రాణించాయి. Bearish Spinning Top Candleతో రోజును ఆరంభించిన బెంచ్ మార్క్ సూచీలు చివ‌రికి ఫ్లాట్‌గా ముగిశాయి. Sensex 78,472(-67), Nifty 23,727(-25) వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. మెట‌ల్‌, మీడియా, IT షేర్లు న‌ష్ట‌పోయాయి. Tata Motors, Adani Ent టాప్ గెయిన‌ర్స్‌. Power Grid, JSW Steel, SBI Life టాప్ లూజర్స్.

News December 24, 2024

ప్రతి రాష్ట్రంలో శ్రీవారి ఆలయం: టీటీడీ

image

AP: దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మిస్తామని TTD EO శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ‘ప్రపంచంలోని పలు దేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం. సీఎం ఆదేశాల మేరకు ఇందుకు ఓ కమిటీ వేస్తున్నాం. నడక దారిలో వచ్చే భక్తుల కోసం ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తాం. TTD సేవలపై భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

News December 24, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

బంగాళాఖాతంలో అల్పపీడనం రానున్న 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది.

News December 24, 2024

బడ్జెట్‌పై ఆర్థికవేత్తలతో మోదీ సమాలోచనలు

image

కేంద్ర బ‌డ్జెట్‌లో పొందుప‌ర‌చాల్సిన అంశాలు, కేటాయింపుల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకొనేందుకు ఆర్థిక‌వేత్త‌లు, భిన్న రంగాల నిపుణుల‌తో ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేకంగా సమావేశ‌మ‌య్యారు. Feb 1న నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. Niti Aayog Vice-Chairman సుమన్ బేరీ, CEO సుబ్రహ్మణ్యం, Chief Economic Advisor అనంత నాగేశ్వరన్, ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా తదితరులు పాల్గొన్నారు.