India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

☛ థియేటర్కు వస్తున్నట్లు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు?
☛ రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా?
☛ పర్మిషన్ నిరాకరించినట్లు మీకు ఎవరూ చెప్పలేదా?
☛ మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్కు వచ్చారు?
☛ రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలియదా? ఆమె చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది?
☛ మీతో ఎంత మంది బౌన్సర్లు వచ్చారు? ఫ్యాన్స్పై దాడి చేసిన బౌన్సర్ల వివరాలు ఏంటి?

ఉత్తర్ప్రదేశ్లో మరో అంతర్జాతీయ స్టేడియం అందుబాటులోకి రానుంది. అయోధ్య – సుల్తాన్పూర్ రహదారిపై ఈ స్టేడియం నిర్మితమైంది. ఇది డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్లో భాగమని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ స్టేడియంలో 40వేల మంది ప్రేక్షకులు ఒకేసారి కూర్చునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే యూపీలో గ్రీన్పార్క్, లక్నోలోని ఎకానా స్టేడియం ఉన్నాయి.

కేంద్రం రద్దు చేసిన ‘<<14964843>>నో డిటెన్షన్ పాలసీ<<>>’ని తమ రాష్ట్రంలో 8వ తరగతి వరకు కొనసాగిస్తామని తమిళనాడు మంత్రి అన్బిల్ స్పష్టం చేశారు. పరీక్షల్లో విఫలమైతే 5, 8 తరగతుల విద్యార్థులను అదే తరగతిలో కొనసాగించాలని కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో పేద కుటుంబాల పిల్లల చదువుకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్బిల్ అన్నారు. ఈ పాలసీపై TG ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.

2024 ఏడాదికి ఇంకో వారమే మిగిలి ఉంది. వచ్చే మంగళవారంతో ఈ ఏడాది పూర్తి కానుండగా.. కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఏడాది మరోసారి మోదీ PM కావడం, IND T20WC గెలవడం, అమెరికా అధ్యక్షుడి ఎన్నిక, బంగ్లాదేశ్ ప్రధానిపై తిరుగుబాటు, దేశ వ్యాప్తంగా వరదల బీభత్సం, అల్లు అర్జున్ అరెస్ట్ తదితర అంశాలు వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మీకు ఎలా గడిచిందో COMMENT చేయండి.

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(NHRC) ఛైర్ పర్సన్గా సుప్రీం మాజీ జడ్జి సుబ్రమణియన్ను నియమించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇది రాజ్యాంగబద్ధంగా జరిగిన నియామకం కాదన్నారు. ఆయన్ను నియమించిన విధానం సరిగాలేదని, నియామకానికి ఉద్దేశించిన కమిటీ నిబంధనలను తుంగలో తొక్కిందన్నారు. తాము సూచించిన జడ్జిలకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పారు.

గుండెపోటు మరణాలు ప్రస్తుతం అందరినీ కలవరపెడుతున్నాయి. బెంగాల్కు చెందిన మాజీ క్రికెటర్ సువోజిత్ బెనర్జీ (39) గుండెపోటుతో మరణించారు. బెంగాల్ తరఫున 3 రంజీ మ్యాచులు, 4 లిస్ట్-A మ్యాచులు ఆడిన ఆయన ప్రస్తుతం లోకల్ టోర్నీల్లో ఆడుతున్నారు. నిన్న బ్రేక్ ఫాస్ట్ అనంతరం కునుకు తీసిన ఆయన గుండెపోటుకు గురై చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ప్రతి వస్తువుకు పన్ను విధిస్తుండటంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ వాహనాలను అమ్మినా 18% ట్యాక్స్ కట్టాలని చెప్పడం అన్యాయమంటున్నారు. ఇప్పటికే రోడ్ టాక్స్, హైవేలపై టోల్ టాక్స్, బ్యాంకులో డబ్బులు జమ చేసినా డిపాజిట్ ఛార్జెస్ చెల్లిస్తున్నామంటున్నారు. జీవిత బీమా, ఆరోగ్యబీమాలపై GST ఎత్తివేయాలని కోరుతున్నారు. గాలి ఒక్కటే మిగిలిందని, దానికీ పన్ను విధిస్తారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

అనుభవించాలంటే రాసిపెట్టుండాలి! ఐటీ ప్రోగ్రామర్ లాస్లో హనిఎజ్ విషయంలో ఇది అక్షరాలా నిజం! 2010, మే17న 10వేల బిట్కాయిన్లను ఆయన డాలర్లలోకి మార్చుకున్నారు. వచ్చిన $41తో మే 22న 2 పిజ్జాలు ఆర్డర్ చేశారు. ఇప్పుడా 10వేల BTCల విలువ రూ.8000 కోట్లు. ఇంతలా పెరుగుతుందని ఆయన అస్సలు ఊహించి ఉండరు. ఆ లావాదేవీకి గుర్తుగానే ఏటా మే 22ను బిట్కాయిన్ పిజ్జాడేగా జరుపుకుంటారు. BTC హోల్డర్లకు డిస్కౌంట్లు ఇస్తుంటారు.

ఆటో రంగ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనానికి ఒప్పందం కుదిరింది. 2 కంపెనీలకు మాతృ సంస్థగా జాయింట్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు చేసి దానికి షేర్లు బదిలీ చేయనున్నాయి. 2026 AUG నాటికి డీలిస్టింగ్ పూర్తి చేసి కంపెనీ షేర్లను టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. టయోటా, ఫోక్స్వేగన్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు విలీనం జరుగుతున్నట్లు బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.

AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనిస్తోందని IMD తెలిపింది. దీని ప్రభావంతో 3 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఇవాళ ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని పేర్కొంది. మరోవైపు AP, తమిళనాడుల్లోని అన్ని పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
Sorry, no posts matched your criteria.