India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా ₹12K అందించే పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకున్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయనుంది. ఈమేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. అయితే ఇప్పటికీ మార్గదర్శకాలు వెల్లడించకపోవడంపై పేదలు ఆందోళన చెందుతున్నారు. తొలి విడతలో ఈ నెల 28న ఖాతాల్లో ₹6K చొప్పున జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

అగ్నివీర్తో సహా ప్రతి ఉద్యోగ నియామక పరీక్షల దరఖాస్తులపై కేంద్రం 18% జీఎస్టీ విధిస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. యూపీలోని ఓ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాల దరఖాస్తుకు ఫీజు ₹1000 ఉంటే దానిపై జీఎస్టీ ₹180 అని పేర్కొన్నారు. పిల్లల్ని చదివించడం కోసం పేరెంట్స్ రూపాయి రూపాయి కూడబెడితే, ప్రభుత్వం వారి కలల్ని ఇలా ఆదాయ వనరుగా మార్చుకుంటోందని మండిపడ్డారు.

TG: మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రభుత్వం 18005994007 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కాల్ సెంటర్ను HYDలోని మిషన్ భగీరథ హెడ్ ఆఫీసులో నిన్న ప్రారంభించారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ 24/7 పనిచేస్తుంది. రాత్రి పూట వచ్చే కాల్స్ రికార్డు అవుతాయి. ఫిర్యాదు స్వీకరించిన 24 గంటల్లో సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

రష్యా తరఫున తమతో యుద్ధం చేస్తోన్న ఉత్తరకొరియా సైనికులు 3వేల మంది చనిపోవడం లేదా తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. కుర్స్క్ రీజియన్ నుంచి తమకు ఈ ప్రాథమిక నివేదిక అందిందన్నారు. మరిన్ని అదనపు బలగాలు, ఆయుధ సామగ్రిని నార్త్ కొరియా పంపనుందని, ఆ ముప్పును ఎదుర్కొనేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట- అల్లు అర్జున్ విషయంపై INC నేతలెవరూ మాట్లాడొద్దని CM రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు TPCC చీఫ్ మహేశ్కుమార్కు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. చట్టం తనపని తాను చేస్తున్నందున ఇక ఎవరూ జోక్యం చేసుకోకుండా చూడాలని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో విపక్షాల ప్రశ్నలకు సమాధానంగా తాను బన్నీపై మాట్లాడానని CM పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

కలెక్షన్లలో అదరగొడుతున్న పుష్ప-2 టీమ్కు యశ్ రాజ్ ఫిల్మ్స్(YRF) కంగ్రాట్స్ చెప్పింది. ‘రికార్డులున్నది బద్దలవడానికే. మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా ప్రతి ఒక్కరినీ కొత్త రికార్డులు ముందుకు నెడతాయి. చరిత్ర పుస్తకాలను తిరగరాస్తున్న పుష్ప-2 చిత్రబృందానికి శుభాకాంక్షలు. ఇది ఫైరు కాదు వైల్డ్ ఫైరు’ అని పేర్కొంది. దీంతో అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ రికార్డును YRF బద్దలుకొడుతుందని ఆశిస్తున్నానన్నారు.

AP: మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ఇడుపులపాయలోని YSR ఘాట్ వద్ద నివాళులర్పించి పులివెందుల చేరుకుంటారు. 25న CSI చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. 26న పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27న పులివెందుల విజయా గార్డెన్స్లో ఓ వివాహానికి హాజరై బెంగళూరుకు వెళ్తారు.

సిరియాలో తిరుగుబాటుతో రష్యాలో తలదాచుకుంటున్న మాజీ అధ్యక్షుడు బషర్ అసద్కు ఇప్పుడు ఇంటిపోరు మొదలైంది. అతని భార్య అస్మా విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె రష్యా కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. లండన్ తిరిగెళ్లేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్కోలో ఆశ్రయం పొందడం ఇష్టం లేకపోవడమే డివోర్స్ కారణమట. అయితే ఈ వార్తలను అధికారులు ఖండించారు.

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర మంత్రులతోనూ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తారు. రేపు రాత్రి అమరావతికి తిరిగొస్తారు.

మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి NOVలో భారత్ క్రూడాయిల్ కొనుగోళ్లు 9 నెలల గరిష్ఠానికి చేరాయి. గత నెల ప్రతి రోజూ 2.28M బ్యారెళ్ల ముడిచమురు దిగుమతి జరిగింది. OCTతో పోలిస్తే ఇది 10.8% ఎక్కువ. ఇది మొత్తం దేశీయ క్రూడాయిల్ దిగుమతుల్లో 48%. ఇదే సమయంలో రష్యా నుంచి దిగుమతి తగ్గడం గమనార్హం. OCTలో రోజూ 1.58 మిలియన్ బ్యారెళ్ల కొనుగోళ్లు జరగగా, NOVలో 13% తగ్గింది. మొత్తం దిగుమతుల్లో ఇది 32%.
Sorry, no posts matched your criteria.