India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి రేపు ఓ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలిపారు. కాగా అది రెండో సాంగ్ గురించేనని, ఈ నెల 27న దాన్ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. DEC 20న ఈ చిత్రం వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది.
హెజ్బొల్లా సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 500 మందికిపైగానే మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు 100కుపైగా ఉన్నారు. 1,650 మందికిపైగా గాయపడ్డారు. 2006 తర్వాత లెబనాన్పై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. 2006లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 1,300 మంది లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 5 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.
గత ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరలు అందించగా ప్రస్తుత ప్రభుత్వం వాటి స్థానంలో నగదు అందించేందుకు యోచిస్తోంది. రూ.500 లేదా ఆపైనే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో వేయాలా? లేక నేరుగా చేతికి ఇవ్వాలా? అనేది ఇంకా నిర్ణయించలేదని సమాచారం. రేషన్ కార్డు లేదా స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం ప్రామాణికంగా అర్హులను గుర్తించేందుకు కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది.
AP: హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ.లక్ష, మసీదుల నిర్వహణ కోసం రూ.5వేలు సాయం అందించే స్కీమ్లకు రూపకల్పన చేయాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు అంగీకరించారు. పాస్టర్లకు నెలకు రూ.5వేలు, ఇమామ్, మౌజమ్లకు నెలకు రూ.10 వేలు, రూ.5వేల గౌరవ వేతనం, MSMEలకు రాయితీ రుణాలు ఇస్తామన్న హామీలను అమల్లోకి తీసుకురావాలన్నారు. వక్ఫ్ భూముల సర్వే రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ వ్యవహారం మరువకముందే తాజాగా లడ్డూలో పొగాకు రావడం భక్తులను కలవరపెడుతోంది. ఖమ్మం(D) గొల్లగూడెంలోని కార్తికేయ టౌన్షిప్లో ఓ కుటుంబం ఇటీవల తిరుపతికి వెళ్లొచ్చింది. పంచేందుకు లడ్డూ బయటకు తీయగా అందులో పొగాకు పొట్లం రావడంతో షాకయ్యారు. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యత పాటించడం లేదని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించవద్దని వారు కోరుతున్నారు.
టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ది గ్రేటెస్ట్ కంబ్యాక్ అని ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ ప్రశంసించారు. ‘పంత్ నాకంటే దూకుడుగా ఆడతాడు. ఎవరి బౌలింగ్లోనైనా ఎలాంటి భయం లేకుండా ఆడటం నాకు నచ్చుతుంది. ఆటలో ఎప్పుడు దూకుడుగా ఆడాలో, ఎప్పుడు వేగం తగ్గించాలో తనకు తెలుసు’ అని ఆయన పేర్కొన్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్ తొలి మ్యాచ్లో (39, 109) రాణించారు.
AP: విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకోసం 30 ఎకరాలు సేకరించాలని, రూ.200 కోట్లతో పనులు తక్షణమే ప్రారంభించాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అటు హిజ్రాలకు సింగిల్ రేషన్కార్డు ఇవ్వాలని, వారికి ప్రత్యేకంగా రాష్ట్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిన్న దివ్యాంగుల సంక్షేమ శాఖపై సమీక్షలో సీఎం వెల్లడించారు.
తమ టెక్నాలజీని పరీక్షించేందుకు పొటాటో వేస్ట్, పీల్స్ను ఇథనాల్గా మార్చే పైలట్ ప్లాంట్ ఏర్పాటును CPRI ప్రతిపాదించినట్టు తెలిసింది. వీటిద్వారా బయో ఫ్యూయల్ తయారీని ఇప్పటికే ల్యాబుల్లో టెస్ట్ చేశారు. చైనా తర్వాత ఎక్కువగా పొటాటో పండించేది భారతే. ఏటా 56 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేస్తుంది. కుళ్లడం, చిప్స్ ప్రాసెస్ తర్వాత 10% వృథా అవుతోంది. ఇథనాల్ ఫీడ్స్టాక్గా కుళ్లిన పొటాటోను వాడేందుకు అనుమతి ఉంది.
TG: కాంగ్రెస్ చేపట్టిన ‘మంత్రులతో ప్రజల ఫేస్ టు ఫేస్’ రేపు ప్రారంభం కానుంది. ప్రతి బుధ, శుక్రవారాల్లో గాంధీభవన్లో ఉ.11-మ.2గంటల మధ్య మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉంటారు. రేపు మంత్రి దామోదర రాజనర్సింహ, 27న శ్రీధర్ బాబు, అక్టోబర్ 4న ఉత్తమ్, 9న పొన్నం, 11న సీతక్క, 16న కోమటిరెడ్డి, 18న సురేఖ, 23న పొంగులేటి, 25న జూపల్లి, 30న తుమ్మల ప్రజలతో మాట్లాడనున్నారు.
PM మోదీ 3 రోజుల అమెరికా పర్యటన ముగిసింది. కెనడీ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో ఆయన భారత్కు బయల్దేరారు. ఈ పర్యటనలో ఆయన బిజీగా గడిపారు. క్వాడ్ సమ్మిట్లో US, జపాన్, ఆసీస్ అధినేతలతో చర్చించారు. ఓ సభలో భారతీయులతో మాట్లాడారు. టెక్ కంపెనీల CEOలను కలిసి కీలక రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించారు. యుద్ధ సంక్షుభిత పాలస్తీనా, ఉక్రెయిన్ నేతలతో మాట్లాడారు. ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లారు.
Sorry, no posts matched your criteria.