News September 23, 2024

అమెరికా పంపే డ్రోన్లతో ఉపయోగాలేంటి?

image

అమెరికా నుంచి భార‌త్ <<14173073>>స‌మ‌కూర్చుకోనున్న<<>> 31 MQ- 9B ప్రిడేటర్ డ్రోన్లు దేశ స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త‌ను మ‌రింత ప‌టిష్ఠం చేయ‌నున్నాయి. చైనా, ఇండో-ప‌సిఫిక్ ప్రాంతాల్లో 16 గగనతల, 15 సముద్రతీర రక్షణ డ్రోన్లను మోహరించనున్నారు. ఈ డ్రోన్లు 35 గంట‌ల‌పాటు ఏక‌ధాటిగా గాల్లో ఉండ‌గ‌ల‌వు. 50,000 అడుగుల ఎత్తులో 442 km/h అత్యధిక వేగంతో ఎగుర‌గ‌ల‌వు. అంతేకాకుండా అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో 1,700 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలవు.

News September 23, 2024

పిల్లలకు లైంగిక విద్య అవసరం: సుప్రీం కోర్టు

image

పిల్లలకు లైంగిక విద్య అత్యంత ఆవశ్యకమని సుప్రీం కోర్టు తాజాగా అభిప్రాయపడింది. పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌ ఉండాలని పేర్కొంది. ‘లైంగిక విద్య పాశ్చాత్యుల విధానమని, మన వద్ద ప్రారంభిస్తే పిల్లలు చెడిపోతారని ఓ దుష్ప్రచారం ఉంది. ఓ అధ్యయనం ప్రకారం.. సమగ్ర సెక్స్ ఎడ్యుకేషన్ వారిలో అవగాహనను పెంచుతుంది. తద్వారా వారు పోర్న్‌కు, లైంగిక నేరాలకు అలవాటు పడకుండా ఆపే అవకాశం ఉంటుంది’ అని తెలిపింది.

News September 23, 2024

అదే జరిగితే 75% మంది UPI సేవల వినియోగాన్ని ఆపేస్తారు

image

UPI చెల్లింపులకు రుసుములు విధిస్తే మెజారిటీ యూజర్లు వాటి వినియోగాన్ని తగ్గించేస్తారని లోకల్‌ సర్కిల్స్ సర్వేలో తేలింది. లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తే 75 శాతం మంది UPI సేవల వాడకాన్ని వదిలేసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది డిజిటల్ చెల్లింపులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. 38% యూజర్లు రోజులో సగం చెల్లింపులకు UPI వాడుతున్నారు. 10 మంది యూజర్లలో నలుగురు UPIకి ప్రాధాన్యమిస్తున్నారు.

News September 23, 2024

భారత్‌లో ఎంపాక్స్ క్లాడ్ 1బి స్ట్రెయిన్ నిర్ధారణ

image

కేర‌ళ‌లో గ‌త వారం ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలిన‌ వ్య‌క్తిలో క్లాడ్ 1బి స్ట్రెయిన్ నిర్ధార‌ణ అయ్యింది. ఈ స్ట్రెయిన్ వ‌ల్లే డబ్ల్యూహెచ్‌ఓ గ‌త నెల‌లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తిరిగి వచ్చిన కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తిలో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు. ప్ర‌స్తుతం రోగి ఆరోగ్య ప‌రిస్థితి స్థిరంగా ఉంద‌ని అధికారులు తెలిపారు.

News September 23, 2024

దోమలూ తెలివిమీరుతున్నాయి!

image

దోమలు చూడటానికి చిన్నగానే ఉండొచ్చు కానీ వాటికీ తెలివి ఉంటుంది. ఆ తెలివి ఈ మధ్య మరింతగా పెరిగిందంటున్నారు పరిశోధకులు. అవి రాకుండా కట్టే నెట్స్‌లోకి దూరేందుకు సైజ్ తగ్గించుకుంటున్నాయని, గుడ్లు పెట్టే సురక్షిత ప్రాంతాల గురించి ఒకదానికొకటి సమాచారం చెప్పుకొంటున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. వాటిని చంపేందుకు ఉద్దేశించిన వివిధ రసాయనాలకు లొంగని నిరోధకతనూ అభివృద్ధి చేసుకుంటున్నాయని వెల్లడైంది.

News September 23, 2024

దేశంలో 60 కొత్త మెడికల్ కాలేజీలు: జేపీ నడ్డా

image

దేశంలో ఒక్క ఏడాదిలోనే 60 మెడిక‌ల్ కాలేజీలు కొత్త‌గా ప్రారంభించిన‌ట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ న‌డ్డా తెలిపారు. 2023-24లో దేశంలో 706 కాలేజీలు ఉండ‌గా 2024-25 ఏడాదికి ఆ సంఖ్య 766కి (8.07% వృద్ధి) పెరిగింద‌న్నారు. అదే 2013-14 మ‌ధ్య దేశంలో కేవ‌లం 387 కాలేజీలే ఉండేవ‌ని ఆయ‌న వివ‌రించారు. మోదీ 3.0 ప్ర‌భుత్వానికి 100 రోజులు పూర్తైన సంద‌ర్భంగా ఆరోగ్య శాఖ విజ‌యాల‌పై ఆయ‌న వివ‌రాలు వెల్ల‌డించారు.

News September 23, 2024

ALERT.. మరో 2 గంటల్లో పిడుగులతో కూడిన వర్షం

image

TG: మరో 2 గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు నిర్మల్, రంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, RR, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

News September 23, 2024

జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్

image

అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచార కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విషయమై ఆయనను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందన్నారు. కాగా గోవాలో జానీ మాస్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

News September 23, 2024

పుణే విమానాశ్ర‌యం పేరు మార్పు! క్యాబినెట్ ఆమోదం

image

పుణే విమానాశ్రయం పేరు మార్పు ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. ‘జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ పుణే అంత‌ర్జాతీయ‌ విమానాశ్రయం’గా పేరు మార్పున‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త‌దుప‌రి అనుమ‌తుల కోసం కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు పంపింది. విమానాశ్రయానికి పేరు మార్చే దిశగా తొలి అడుగు వేశామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ Xలో తెలిపారు.

News September 23, 2024

2026 అక్టోబరుకల్లా మార్స్‌పైకి వ్యోమనౌకలు: మస్క్

image

2026 అక్టోబరుకల్లా అంగారకుడిపై వ్యోమనౌకలు ల్యాండ్ అయ్యేలా చేస్తామని స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ధీమా వ్యక్తం చేశారు. ఆసక్తి కలవారందరినీ మార్స్‌పైకి పంపించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. రోదసియానం అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. ‘వచ్చే రెండేళ్లలో మానవరహిత వ్యోమనౌకలు ఐదింటిని పంపిస్తాం. అవి సురక్షితంగా ల్యాండ్ అయితే ఆ తర్వాతి నాలుగేళ్లలో మానవసహిత వ్యోమనౌకల్ని ప్రయోగిస్తాం’ అని వెల్లడించారు.