India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇప్పుడు అంతటా రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ గురించే చర్చ జరుగుతోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాటను ప్రస్తావిస్తూ బన్నీపై రేవంత్ నిన్న అసెంబ్లీలో <<14942545>>ఫైర్<<>> అయ్యారు. దీనిపై వెంటనే స్పందించిన అర్జున్ ప్రెస్మీట్ పెడుతున్నట్లు ప్రకటించారు. రా.8 గంటలకు మీడియా ముందుకొచ్చి CM వ్యాఖ్యలు <<14946087>>సరికాదన్నారు<<>>. దీంతో INC, బన్నీ ఫ్యాన్స్ వారి వీడియోలు SMలో షేర్ చేస్తూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి వరుసగా యువ దర్శకులకు అవకాశాలిస్తున్నారు. వశిష్టతో ‘విశ్వంభర’ రెడీ అవుతుండగా శ్రీకాంత్ ఓదెలతో మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ రావిపూడితోనూ ఓ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. వీరి తర్వాత తమిళ దర్శకుడు మిత్రన్తో మూవీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆయన కార్తీతో ‘సర్దార్’ సినిమాను తీశారు. మిత్రన్ చెప్పిన స్టోరీ లైన్ చిరుకు నచ్చిందని, పూర్తి కథను డెవలప్ చేయమని సూచించారని సమాచారం.

మాజీ ప్రధాని షేక్ హసీనా హయాంలో ప్రజలు అదృశ్యమైన ఘటనల్లో భారత్ హస్తం ఉందని బంగ్లా ప్రభుత్వ ఎంక్వైరీ కమిషన్ ఆరోపించింది. బంగ్లా ఖైదీలు భారతీయ జైళ్లలో మగ్గుతున్నారని పేర్కొంది. భారత్లో నిర్బంధంలో ఉన్న తమ జాతీయులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని బంగ్లాదేశ్ విదేశాంగ, హోం శాఖలకు కమిషన్ సిఫార్సు చేసింది. తమ పౌరులు 3,500 మంది అదృశ్యమైనట్టు కమిషన్ అంచనా వేసింది.

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ విభాగాల్లో 1036 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 7- ఫిబ్రవరి 6 మధ్యలో తమ <

దేశవ్యాప్తంగా అటవీ సంపద గణనీయంగా తగ్గిందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 2021తో పోలిస్తే గత ఏడాది 138.66 చదరపు కిలోమీటర్లు, తెలంగాణలో 100.42 చ.కి అటవీ భూమి తగ్గిపోయిందని పేర్కొన్నారు. తొలి స్థానంలో మధ్యప్రదేశ్(371.54 చ.కి) ఉండగా రెండో స్థానంలో ఏపీ, మూడో స్థానంలో తెలంగాణ ఉండటం గమనార్హం.

ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చేది లేదని తెలంగాణ CM రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం ప్రభావం వచ్చే నెలలో విడుదల కానున్న పెద్ద సినిమాలపై పడనుంది. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూవీలు రానున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు ఎక్కువ రోజులు ఆడని నేపథ్యంలో బెనిఫిట్ షోల రద్దు నిర్ణయంతో పెద్ద బడ్జెట్ సినిమాలకు షాక్ తప్పదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

HYDలో Oct-Dec క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు 47% తగ్గే అవకాశం ఉందని PropEquity అంచనా వేసింది. గత ఏడాది Q3తో పోలిస్తే అమ్మకాలు 24,004 నుంచి 12,682 యూనిట్లకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే దేశంలోని 9 మహా నగరాల్లో అమ్మకాలు 21% తగ్గొచ్చని సంస్థ వెల్లడించింది. బెంగళూరులో, చెన్నైలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. High Base Effect ఇళ్ల అమ్మకాల్లో క్షీణతకు కారణంగా తెలుస్తోంది.

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులతో ఈ పేపర్లను ప్రాక్టీస్ చేయించాలని స్కూళ్లకు సూచించింది. <

టీమ్ ఇండియాకు నెట్ సెషన్లలో వరస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఓపెనర్ రాహుల్ చేతికి గాయం కాగా తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడ్డారు. ఎంసీజీ నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన ఎడమ మోకాలికి బంతి బలంగా తాకింది. దీంతో ఆయన నొప్పితో పక్కన కూర్చుండిపోయారు. అయితే మ్యాచ్ జరిగేందుకు ఇంకా 4 రోజులున్న నేపథ్యంలో ఆటగాళ్లు కోలుకుంటారని టీమ్ ఇండియా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ ఏడాది అత్యధిక శాతం లాభాలు పొందిన తెలుగు సినిమా ఏది? పుష్ప-2 సినిమా ఇప్పటికే రూ.1500 కోట్ల మార్కును దాటేసినా తొలి స్థానంలో ఉన్నది ఆ మూవీ కాదు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి వరల్డ్ వైడ్ రూ.350 కోట్ల వరకూ వసూలు చేసిన హనుమాన్ మూవీ అగ్రస్థానంలో ఉంది. ఆ సినిమాకు 650 శాతం నుంచి 775 శాతం మేర లాభాలు వచ్చినట్లు అంచనా.
Sorry, no posts matched your criteria.