News September 23, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం
* AP: రేపు తిరుమలలో శాంతియాగం: చంద్రబాబు
* 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
* చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రధాని మోదీకి జగన్ లేఖ
* నెయ్యిలో కల్తీ జరిగితే చంద్రబాబుదే బాధ్యత: అంబటి
* TG: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సీఎల్పీ సమావేశం
* అమృత్ టెండర్లు.. మంత్రి పొంగులేటికి KTR సవాల్
* బంగ్లాపై తొలి టెస్టులో భారత్ విజయం

News September 23, 2024

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, భువనగిరి, సూర్యాపేటలో మోస్తరు వర్షాలు పడతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News September 23, 2024

మెగాస్టార్‌కు రాజమౌళి అభినందనలు

image

మెగాస్టార్ చిరంజీవికి దర్శక ధీరుడు రాజమౌళి అభినందనలు తెలియజేశారు. తన కెరీర్‌లో 24 వేల డాన్స్ మూవ్స్ చేశారని ఇప్పుడే చదివినట్లు ట్వీట్ చేశారు. 46 ఏళ్ల అసాధారణ ప్రయాణం అద్భుతమని కొనియాడారు. భారత చిత్ర సీమలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటుడిగా గిన్నిస్ రికార్డు సాధించినందుకు కంగ్రాట్స్ తెలిపారు.

News September 23, 2024

వారికే జిల్లా అధ్యక్ష పదవులు: సీఎం రేవంత్

image

TG: బీసీ కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన అని సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే జనాభాను లెక్కించాల్సిందేనన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్ నేతృత్వంలో సబ్ కమిటీ వేస్తామన్నారు. సుప్రీం తీర్పును అధ్యయనం చేస్తూ సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పారు. ప్రజల్లో ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని సూచించారు. జమిలి ఎన్నికల అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

News September 23, 2024

అన్నయ్య.. అభినందనలు: పవన్ కళ్యాణ్

image

మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ రికార్డు సాధించడం సంతోషంగా ఉందని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అన్నారు. ‘అన్నయ్యకు సినీ ప్రపంచంలో రికార్డులు, విజయాలు కొత్త కాదు. ఈరోజు ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం. 156 చిత్రాలు, 537 పాటలు, 24వేల స్టెప్స్‌తో అలరించిన నటుడిగా నిలవడం ఎంతో సంతోషం కలిగించింది. ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

News September 22, 2024

రాజకీయాల్లో తమ్ముడు.. సినిమాల్లో అన్నయ్య

image

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వేర్వేరు విభాగాల్లో ప్రపంచ రికార్డులు అందుకోవడం విశేషం. APలో ఒకే రోజు 13,326 గ్రామాల్లో సభలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు Dy.CM పవన్ సర్టిఫికెట్ అందుకున్నారు. మరోవైపు <<14167123>>చిరు<<>> ఇవాళ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇది అరుదైన ఘటన అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News September 22, 2024

గిన్నిస్ రికార్డ్స్‌లో ఈ టాలీవుడ్ ప్రముఖులూ..

image

తన డాన్సులకు గాను మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో మరికొంత మంది ప్రముఖులు కూడా ఈ ఘనత సాధించారు. అత్యధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు, అత్యధిక చిత్రాల దర్శకుడిగా దాసరి, అత్యధిక చిత్రాల దర్శకురాలిగా విజయనిర్మల, బతికున్న వారిలో అత్యధిక చిత్రాల్లో నటించిన వ్యక్తిగా బ్రహ్మానందం, అత్యధిక పాటలు పాడినవారిగా SPB, సుశీల చరిత్రకెక్కారు.

News September 22, 2024

బిగ్ బాస్-8: అభయ్ ఎలిమినేట్

image

తెలుగు బిగ్ బాస్-8లో మూడో వారం నటుడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. ఈ మేరకు హోస్ట్ నాగార్జున అతడిని ఎలిమినేట్ చేసినట్లు ప్రకటించారు. ఈ వారం అభయ్ ప్రవర్తనకు హోస్ట్ నాగార్జున రెడ్ కార్డు ప్రకటించారు. నిన్ననే హౌస్ నుంచి బయటకు వెళ్తారని భావించినా అనూహ్య పరిస్థితుల నడుమ ఇవాళ ఎలిమినేట్ అయ్యారు.

News September 22, 2024

మోదీజీ.. ఆ ప్రాంతాల మధ్య వందే భారత్ నడపండి: బిహార్ సీఎం

image

బిహార్‌లోని సీతామఢి జిల్లా నుంచి అయోధ్య వరకు వందే భారత్ రైలు నడపాలని ప్రధాని మోదీకి ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆ జిల్లాలోని పునౌరా ధామ్ జానకీ మందిర్‌ను స్థానికులు సీతామాత జన్మస్థలంగా భావిస్తారు. ఆ ప్రాంతాన్ని ఆధ్మాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని బిహార్ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అయోధ్యతో కనెక్టివిటీ ఉంటే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని నితీశ్ ఓ లేఖలో తెలిపారు.

News September 22, 2024

దులీప్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఇండియా-ఏ జట్టు

image

దులీప్ ట్రోఫీని మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా-ఏ జట్టు సొంతం చేసుకుంది. ఇండియా-బీపై IND-A 132 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో టేబుల్‌లో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని అందుకుంది. రుతురాజ్ సారథ్యంలోని ఇండియా-సీ జట్టు 9 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది.