News December 21, 2024

BIG BREAKING: రాష్ట్రంలో మళ్లీ భూప్రకంపనలు

image

AP: ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, ముండ్లమూరు, మారెళ్ల, తూర్పుకంభంపాడు, శంకరాపురం సహా పలుచోట్ల కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ముండ్లమూరు స్కూలు నుంచి విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.

News December 21, 2024

చేతకాని దద్దమ్మ: జర్మనీ దేశాధినేతను తిట్టిన మస్క్

image

జర్మనీ ఛాన్స్‌లర్ ఓలాఫ్ షూల్జ్‌పై భూలోక కుబేరుడు ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. ఆయన్ను ‘చేతకాని దద్దమ్మ’ అనేశారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైట్ వింగ్ పార్టీ AfD మాత్రమే ఆ దేశాన్ని కాపాడగలదని పేర్కొన్నారు. మాగ్డెబర్గ్‌లోని క్రిస్మస్ హాలిడే మార్కెట్లో షాపింగ్ చేస్తున్న జనాలపై కారు <<14938865>>దాడిని<<>> ఖండించారు. టెర్రరిస్టు అటాక్‌గా అనుమానిస్తున్న ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 68 మంది గాయపడ్డారు.

News December 21, 2024

సంక్రాంతికల్లా రైతు భరోసా ఇస్తాం: తుమ్మల

image

TG: సంక్రాంతికల్లా రైతు భరోసా అందివ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ చర్చలో తెలిపారు. ‘గత ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు రూ.80 వేలకోట్లు ఇచ్చింది. సాగుచేయని భూములకు కూడా డబ్బులు అందాయి. అలా కాకుండా కేవలం సాగుభూములకే భరోసా అందించేందుకు సబ్‌కమిటీ ఏర్పాటు చేశాం. రైతు భరోసాపై సభ్యులు సలహా ఇస్తే స్వీకరిస్తాం’ అని పేర్కొన్నారు.

News December 21, 2024

$92,281 నుంచి $97,454కు పెరిగిన బిట్‌కాయిన్

image

క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో కొంతమేర పుంజుకున్నాయి. బిట్‌కాయిన్ $92,281 నుంచి $97,454 (Rs83 లక్షలు) స్థాయికి పెరిగింది. మార్కెట్ డామినెన్స్ 56.95 శాతంగా ఉంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 1.48% పెరిగి $3,471 వద్ద ట్రేడవుతోంది. $3098 కనిష్ఠ స్థాయి నుంచి ఎగిసింది. BNB, USDT, DOGE, ADA, AVAX, LLINK, TON, SUI, SHIB లాభపడ్డాయి. XRP, SOL, USDC, TRX, LINK, XLM నష్టపోయాయి.

News December 21, 2024

వైఎస్ జగన్ గారూ.. హ్యాపీ బర్త్ డే: సీఎం చంద్రబాబు

image

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ గారు. మీకు చక్కటి ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రత్యర్థికి చంద్రబాబు విషెస్ చెప్పడంపై నెట్టింట వైసీపీ, టీడీపీ ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.

News December 21, 2024

పవన్.. గిరిజనులపట్ల మీ నిబద్ధత అద్భుతం: లక్ష్మీనారాయణ

image

AP: డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల పర్యటనపై జైభారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ‘గిరిజన ప్రాంతాల అభివృద్ధి పట్ల మీ నిబద్ధత అద్భుతం. గిరిజనులకు నిధుల సమీకరణలో ట్రైబల్ సబ్-ప్లాన్, కేంద్ర ప్రత్యేక సాయం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పథకాలు కీలకం. మీ నాయకత్వంలో గిరిజనులకు నిధుల కేటాయింపు జరిగి, సంక్షేమ ఫలాలు అందుతాయని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

News December 21, 2024

త్వరలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీ

image

AP: పోలీసు, జైళ్లు, న్యాయశాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. అన్ని శాఖలు సమర్థంగా పనిచేసేలా తమ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని చెప్పారు. అటు ప్రత్యేక, ఫాస్ట్‌ట్రాక్, ఏసీబీ కోర్టుల ద్వారా మహిళలకు సత్వర న్యాయం అందించేలా న్యాయవ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు.

News December 21, 2024

ఇదేనా రేవంత్… నువ్వు తీసుకొచ్చిన మార్పు?: కేటీఆర్

image

TG: ఆటోడ్రైవర్లకు ఇస్తానన్న ₹12వేల సాయం ఏమైందని CM రేవంత్‌ను KTR ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లతో పాటు అన్ని వర్గాలను మోసగించారని విమర్శించారు. సిద్దిపేటలో అప్పుల బాధతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న వార్తను షేర్ చేశారు. ‘ఇదేనా రేవంత్ నువ్వు తీసుకొచ్చిన మార్పు? పైసలతో ధగ ధగ మెరిసిన చేతుల్లోకి పురుగు మందుల డబ్బాలు రావడమే మార్పా? ఆనందమయ జీవితాల్లోకి ఆత్మహత్య ఆలోచన చొరబడటమే మార్పా?’ అని ట్వీట్ చేశారు.

News December 21, 2024

EUకు వార్నింగ్: అట్లుంటది మరి ట్రంప్‌తో..

image

తన రెండో హయాం ఎలావుంటుందో డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు పంపిస్తున్నారు. శత్రు, మిత్రభేదాలేమీ లేవు. అమెరికాకు నష్టం జరుగుతుందంటే టారిఫ్స్ కొరడా ఝుళిపించడమే అజెండాగా పెట్టుకున్నారు. EU తమ నుంచి భారీ స్థాయిలో ఆయిల్, గ్యాస్ కొనాలని, లేదంటే టారిఫ్స్ తప్పవని తాజాగా బెదిరించారు. 2022 డేటా ప్రకారం EU, US వాణిజ్య లోటు $202B ఉంది. EU నుంచి US దిగుమతులు $553B ఉండగా, ఎగుమతులేమో $350Bగా ఉన్నాయి.

News December 21, 2024

బంగ్లాదేశ్: 3 ఆలయాలు, 8 విగ్రహాలు ధ్వంసం

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. హిందూ ఆలయాల విధ్వంసం కొనసాగుతోంది. తాజాగా మైమెన్‌సింగ్, దినాజ్‌పూర్‌లోని 3 ఆలయాల్లో 8 విగ్రహాలను ముష్కరులు ధ్వంసం చేశారు. గురు, శుక్రవారాల్లో మైమెన్‌సింగ్‌లోని 2 గుళ్లలో 3 మూల విరాట్టులను పగలగొట్టారని పోలీసులు తెలిపారు. కేసు నమోదవ్వలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. పొలాష్‌ఖండ్ కాళీ మందిరం దాడి ఘటనలో అలాలుద్దీన్ (27)ను అరెస్టు చేసినట్టు వెల్లడించారు.