News October 4, 2024

భారీ ఎన్‌కౌంటర్.. 30 మంది మావోలు మృతి

image

మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 30 మంది మరణించారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.

News October 4, 2024

తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇవాళ రాత్రికి ఆయన కొండపైనే బస చేయనున్నారు. రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

News October 4, 2024

ఆ జిల్లా పేరు మార్చాలని సీఎంకు మంత్రి సత్యకుమార్ లేఖ

image

AP: వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ CM చంద్రబాబుకు లేఖ రాశారు. జిల్లాకు కడప అని పేరు పెట్టడం వెనుక చారిత్రక నేపథ్యం ఉందన్నారు. తిరుమలకు వెళ్లే భక్తులు ముందుగా కడపలోని వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారన్నారు. అవగాహనా రాహిత్యంతో వైసీపీ ప్రభుత్వం జిల్లా పేరును మార్చిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రస్తావించినట్లు పేర్కొన్నారు.

News October 4, 2024

తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదు: టీటీడీ

image

AP: తిరుమలలో బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం సందర్భంగా గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిందనే ప్రచారాన్ని నమ్మొద్దని TTD ట్వీట్ చేసింది. బ్రహ్మోత్సవాలలో ప్రతీదీ తనిఖీ చేయడం ఆనవాయితీ అని, దీనిలో భాగంగా భిన్నమైన వాటిని తొలగించి కొత్త వాటిని అమర్చడం సంప్రదాయమని తెలిపింది. ఈ క్రమంలో పాడైన కొక్కిని తొలగించి కొత్త దాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని పేర్కొంది.

News October 4, 2024

హర్షసాయి కేసులో మరో ట్విస్ట్

image

TG: యూట్యూబర్ హర్షసాయి లైంగిక వేధింపుల కేసులో ఆయన తండ్రి రాధాకృష్ణ, యూట్యూబర్ ఇమ్రాన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కేసులో నిందితులుగా చేర్చకముందే బెయిల్ ఎలా ఇస్తారని పిటిషనర్లను ప్రశ్నించింది. కాగా ఇప్పటికే హర్షసాయితోపాటు రాధాకృష్ణ, ఇమ్రాన్‌లపై కూడా అత్యాచార బాధితురాలు ఫిర్యాదు చేశారు. హర్షతో తనకు పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చి మోసం చేశారని ఆమె పేర్కొన్నారు.

News October 4, 2024

దేశంలో మళ్లీ ఎగ్జిట్ పోల్స్ సందడి

image

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌రువాత మ‌రోసారి దేశంలో ఎగ్జిట్ పోల్స్ సందడి నెలకొంది. జ‌మ్మూక‌శ్మీర్‌, హ‌రియాణ ఎన్నిక‌లకు సంబంధించి శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల త‌రువాత ప‌లు సంస్థ‌లు తమ అంచ‌నాల‌ను వెల్ల‌డించ‌నున్నాయి. ఇప్ప‌టికే JK ఎన్నిక‌లు ముగిశాయి. శ‌నివారం హ‌రియాణా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల మేర‌కు పోలింగ్ స‌మ‌యం ముగిసిన త‌రువాత ఫ‌లితాల అంచ‌నాలు వెలువ‌డ‌నున్నాయి.

News October 4, 2024

స్విగ్గీకి హోటళ్లు, రెస్టారెంట్ల ఝలక్

image

AP: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. స్విగ్గీ, జొమాటో వల్ల తమకు తీవ్ర నష్టం కలుగుతోందని పేర్కొంది. తమ అభ్యంతరాలకు జొమాటో ఒప్పుకోగా, స్విగ్గీ అంగీకరించలేదని తెలిపింది. నగదు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నందుకే స్విగ్గీని బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది.

News October 4, 2024

గ్రూప్-1పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

image

TG: గ్రూప్-1 పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా ప్రిలిమ్స్‌లో తప్పుడు ప్రశ్నలు తొలగించి, మెరిట్ జాబితా మరోసారి విడుదల చేయాలని పిటిషనర్లు కోరారు. అయితే 7వేలకు పైగా అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాతే రిజల్ట్స్ ఇచ్చామని TGPSC కోర్టుకు తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 21న మెయిన్స్ ఉండటంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

News October 4, 2024

ఫ్లాప్ అయితే హీరోయిన్లనే తిడతారు: మాళవిక మోహన్

image

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యం తమకు ఇవ్వరని హీరోయిన్ మాళవిక మోహన్ అన్నారు. హీరోయిన్ల కష్టాన్ని ఏమాత్రం గుర్తించరని చెప్పారు. ‘ఓ సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్ అన్ లక్కీ అంటారు. ఆమె వల్లే పరాజయం పాలైందన్నట్లు చూస్తారు. సినిమా హిట్ అయితే మాత్రం హీరోలకు భారీ కానుకలు ఇస్తారు. హీరోయిన్లకు ఏమీ ఇవ్వరు’ అని చెప్పుకొచ్చారు. ప్రియాంక ఇటీవల బాలీవుడ్‌లో హిట్ ఐన ‘యుధ్రా’ సినిమాలో నటించారు.

News October 4, 2024

రేపే హ‌రియాణా అసెంబ్లీ ఎన్నిక‌లు

image

హ‌రియాణా అసెంబ్లీ ఎన్నిక‌లు శనివారం జ‌ర‌గ‌నున్నాయి. 73 జ‌న‌ర‌ల్ స్థానాలు, 17 ఎస్సీ రిజ‌ర్వ్ స్థానాలు క‌లిపి మొత్తం 90 స్థానాల‌కు ఒకే విడ‌త‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.1 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 14 ల‌క్ష‌ల మంది మొద‌టిసారి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. వాస్త‌వానికి హ‌రియాణా ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 1న జ‌ర‌గాల్సి ఉన్నా కొన్ని పార్టీల విజ్ఞ‌ప్తితో EC 5కు వాయిదా వేసింది.