India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేంద్రం జమిలి ఎన్నికల బిల్లు తెచ్చిందని ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. జమిలి ఎన్నికల ప్రతిపాదనలను అమలు చేసే ముందు దేశంలో పారదర్శక ఎన్నికల ప్రక్రియను తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు నాగ్పూర్లో జరుగుతున్న MH అసెంబ్లీ సమావేశాల సందర్భంగా CM ఫడణవీస్ను ఉద్ధవ్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మెగాస్టార్ చిరంజీవి సినిమా అనగానే సాంగ్స్, డాన్స్ గుర్తొస్తాయి. కానీ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కనున్న మూవీలో తొలిసారిగా ఆయన ఇవేవీ లేకుండా నటించనున్నారని సమాచారం. హీరో క్యారెక్టరైజేషన్ ఆధారంగా కథ నడుస్తుందని, కమర్షియల్ ఫార్మాట్కు పూర్తి దూరంగా ఉంటుందని తెలుస్తోంది. మూవీలో చిరు సరసన హీరోయిన్ పాత్ర కూడా లేదని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. 2026లో ఈ మూవీ షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

AP: అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. బుధవారం విజయనగరం, విశాఖ, అనకాపల్లిలో, గురువారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

AP: ప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. తప్పు చేసిన వారు చట్టం చేతుల్లోంచి తప్పించుకోలేరన్నారు. ‘పేర్ని నానికి చెందిన రెండో గౌడౌన్పైనా మాకు అనుమానం ఉంది. దాన్నీ తనిఖీ చేస్తాం. ఎవరిపైనా మేం కక్ష సాధింపు చర్యలకు పాల్పడట్లేదు. తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

AP: స్టెల్లా నౌకలో తమ బియ్యం లోడ్ చేయకుండా అడ్డుకుంటున్నారని చిత్ర, యాగ్రీ, ఎక్స్పోర్ట్, పద్మశ్రీ, సూర్యశ్రీ రైస్ మిల్లుల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. లోడ్ చేసేందుకు తమకు అనుమతి ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు బియ్యం లోడ్ చేయకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏంటని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని సర్కార్ను ఆదేశించింది.

జమిలి ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుండడంతో పార్టీ ఎంపీలకు బీజేపీ సోమవారం విప్ జారీ చేసింది. అయితే, మంగళవారం సభలో బిల్లు ప్రవేశపెట్టడంపై జరిగిన ఓటింగ్కు 20 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. దీంతో విప్ను ధిక్కరించిన సభ్యులందరికీ నోటీసులు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కీలక సమయంలో సభకు రాకపోవడంపై పార్టీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.

విజయ్ హజారే ట్రోఫీకి యువ ఆటగాడు పృథ్వీ షాను ముంబై జట్టు పక్కన పెట్టింది. దీంతో షా ఇన్స్టాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘65 ఇన్నింగ్స్లో 55.7 సగటు, 126 స్ట్రైక్ రేట్తో 3399 పరుగులు చేశాను. దేవుడా నేను ఇంకా ఏం చేయాలో చెప్పు? ఈ స్టాట్స్ ఉన్న నేను పనికిరానా? నీపైనే నమ్మకం పెట్టుకున్నా. జనానికి నమ్మకం ఉందని ఆశిస్తున్నా. ఎందుకంటే నేను కచ్చితంగా తిరిగొస్తా. ఓం సాయిరాం’ అని స్టోరీ పోస్ట్ చేశారు.

కులం ఆధారంగానే రిజర్వేషన్లను కొనసాగించాలా? లేక ఆర్థిక స్థితిపై కల్పించాలన్న విషయంలో పార్లమెంటు పునరాలోచించాలని Ex PM దేవెగౌడ వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చినవి ప్రజల స్థితిని మార్చలేకపోయాయని, ఇప్పటికీ రెండు పూటలా భోజనానికి తిప్పలు పడుతున్నవారు అనేక మంది ఉన్నారన్నారు. పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలా? ఆర్థిక స్థితిపై ఇవ్వాలా? అనేదానిపై మనసు పెట్టి ఆలోచించాలన్నారు.

జీమెయిల్కు పోటీగా కొత్తగా ఎక్స్మెయిల్ను తీసుకురానున్నట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. వినియోగదారులకు మరింత సౌకర్యాన్నిస్తామని తెలిపారు. ‘సంప్రదాయ మెయిల్స్లా కాకుండా మెసేజింగ్కు వాడుతున్న చాటింగ్ ఫార్మాట్లో మెయిల్స్ ఉంటాయి. చాలా సింపుల్ డిజైన్తో అందరికీ సులువుగా అర్థమయ్యేలా ఉంటుంది. మెసేజింగ్, ఈమెయిలింగ్ వంటి వాటన్నింటిపై మనం పునరాలోచించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.

APSRTC ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఈ అలవెన్సులు ఉండగా, వైసీపీ హయాంలో ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎత్తివేశారు. దాన్ని ఇప్పుడు తిరిగి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీని వల్ల ఉద్యోగులకు నెలకు రూ.5వేల నుంచి రూ.6వేలు అదనంగా అందనున్నాయి.
Sorry, no posts matched your criteria.