News September 20, 2024

నేడు సుప్రీంలో ఓటుకు నోటు కేసు విచారణ

image

ఓటుకు నోటు కేసును నేడు సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని BRS MLA జగదీశ్‌రెడ్డితో పాటు మరికొందరు నేతలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై ఈరోజు జస్టిస్ బీఆర్.గవాయ్, జస్టిస్ కేవీ.విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు విచారణకు రాగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వాయిదా వేస్తూ వచ్చింది.

News September 20, 2024

తిరుమల లడ్డూ వ్యవహారంపై స్పందించిన పవన్

image

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ‘వైసీపీ హయాంలో పనిచేసిన TTD బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేశంలోని దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలి. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా మనమంతా కలిసిరావాలి. బోర్డు ఏర్పాటుపై చర్చ జరగాలి’ అని పేర్కొన్నారు.

News September 20, 2024

147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి..

image

చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ బాదిన అశ్విన్ ఓ ప్రపంచ రికార్డును సృష్టించారు. 20 సార్లు 50 కంటే ఎక్కువ రన్స్, 30+ సందర్భాల్లో 5 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా నిలిచారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ సాధించింది ఈయనే కావడం విశేషం. అశ్విన్ 101 మ్యాచ్‌లలో 14 హాఫ్ సెంచరీలు, 6 శతకాలు, 36 సార్లు 5W, 8 సార్లు 10W తీశారు.

News September 20, 2024

రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ విచారణ

image

అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీని పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. గోవా నుంచి ఇవాళ తెల్లవారుజామున HYDకు తరలించి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఆయనను ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

News September 20, 2024

మోడల్ పాఠశాలల్లో 1,115 టెంపరరీ టీచర్లు

image

TG: రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో 1,115 మంది తాత్కాలిక టీచర్లను నియమించుకోవడానికి విద్యాశాఖ అనుమతిచ్చింది. 507 మంది PGTలు, 371 మంది TGTలు, 143 మంది హిందీ టీచర్లు, ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్స్ ఉన్న చోట అదనంగా 94 మందిని విధుల్లోకి తీసుకోనుంది. వీరు అవర్లీ బేస్డ్ టీచర్లు(HBT)గా వ్యవహరిస్తారు. నెలకు వేతనం రూ.18,200 ఇవ్వనుంది.

News September 20, 2024

సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం: వాలంటీర్ల అసోసియేషన్

image

AP: ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలోనూ వాలంటీర్లపై నిర్ణయం తీసుకోకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. 100 రోజులుగా కూటమి ప్రభుత్వం తమను మోసం చేస్తోందని వాలంటీర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల 2 నుంచి 26 వరకు శాంతియుతంగా వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తామని తెలిపారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలోగా న్యాయం చేయకపోతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

News September 20, 2024

మాల్దీవులకు మళ్లీ సాయం

image

మాల్దీవుల రిక్వెస్ట్ మేరకు మరో $50 మిలియన్ల ఆర్థికసాయం అందించేందుకు భారత్ సిద్ధమైంది. ఆ దేశ ఫైనాన్స్ మినిస్ట్రీ జారీచేసిన టీ-బిల్స్‌ను SBI సబ్‌స్క్రైబ్ చేసుకుంది. దీంతో ఆ నిధులను వాడుకొనేందుకు వీలవుతుంది. మేలో చేసిన సాయానికి ఇది అదనం. ‘మాలెకు ఢిల్లీ చిరకాల మిత్రుడు. బడ్జెటరీ సపోర్టు అందించినందుకు మా ప్రజల తరఫున థాంక్స్’ అని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అన్నారు.

News September 20, 2024

వాటర్ హీటర్ వాడుతున్నారా?

image

వాటర్ హీటర్‌తో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిన్న NZB జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నీళ్లు వేడెక్కాయో లేదో చూసేందుకు హీటర్ ఉండగానే బకెట్‌లో చేయి పెట్టడంతో షాక్ తగిలి మరణించాడు. స్విచ్ఛాఫ్ చేసి ప్లగ్ తీసేసిన తర్వాతే నీటిని ముట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇనుము లేదా స్టీల్ కాకుండా ప్లాస్టిక్ బకెట్లు వాడాలని, అవి కరగకుండా ఓ చెక్క ముక్క ఉపయోగించాలంటున్నారు.
>SHARE IT

News September 20, 2024

మాజీ మంత్రి విడదల రజనిపై హోంమంత్రికి ఫిర్యాదు

image

AP: మాజీ మంత్రి రజని, ఆమె PA తమను బెదిరించి ₹2.20cr వసూలు చేశారని పల్నాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ సంస్థ సహ యజమాని చలపతిరావు హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. 2020లో తనను పిలిచి మాట్లాడారని, డబ్బులు ఇవ్వకపోతే కంపెనీని సీజ్ చేయిస్తామని బెదిరించారన్నారు. 2021లో ₹2.20cr ఇచ్చినట్లు తెలిపారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై హోంమంత్రి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

News September 20, 2024

కొత్త రేషన్ కార్డులపై రేపే తుది నిర్ణయం!

image

TG: కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం రేపు సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై తుదినిర్ణయం తీసుకోనుంది. రైతు భరోసాపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.