News September 18, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల ప్రైవసీ కోసం కొత్త ఫీచర్

image

టీనేజ్ యూజర్ల ప్రైవసీ కోసం ఇన్‌స్టాలో ‘టీన్ అకౌంట్స్’ ఫీచర్ రానుంది. దీనితో 13-17ఏళ్ల వయసున్న యూజర్ల అకౌంట్లు ఆటోమేటిక్‌గా ప్రైవేట్‌లోకి వెళ్తాయి. వారి కంటెంట్ ఫాలోవర్స్‌కు మాత్రమే కనిపిస్తుంది. వీరు యాక్సెప్ట్ చేస్తేనే కొత్త ఫాలోవర్స్ యాడ్ అవుతారు. పేరెంట్‌ను యాడ్ చేసి వారి అనుమతితో ఈ సెట్టింగ్స్‌ మార్చుకోవచ్చు. త్వరలో US, UK, AUS, CANలో, 2025 JAN నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకి రానుంది.

News September 18, 2024

నేడు NPS వాత్సల్య పథకం ప్రారంభం.. ప్రయోజనాలివే

image

బాల, బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించే NPS వాత్సల్య పథకం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. పిల్లల పేరుతో పేరెంట్స్/సంరక్షకులు ఈ ఖాతా తీసుకోవచ్చు. వారికి 18 ఏళ్లు నిండాక ఇది NPS అకౌంట్‌గా మారుతుంది. ఏడాదికి రూ.1,000 నుంచి ఎంతైనా జమ చేసుకోవచ్చు. ఏటా వడ్డీ జమవుతుంది. ఇందులో పెట్టుబడితో సెక్షన్ 8CCD(1B) కింద రూ.50వేల పన్ను మినహాయింపు ఉంటుంది. 60 ఏళ్లు వచ్చాక NPS నిధిలో 60% డబ్బులు ఒకేసారి తీసుకోవచ్చు.

News September 18, 2024

ఏపీలో టీచర్‌గా చేసిన ఢిల్లీ కొత్త సీఎం

image

ఢిల్లీ కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న ఆతిశీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. పాలిటిక్స్‌లోకి రాకముందు ఆమె టీచర్‌గా పనిచేశారు. ఏపీలోని మదనపల్లె సమీపంలోని రిషివ్యాలీ స్కూల్‌లో పిల్లలకు పాఠాలు చెప్పారు. ఆ తర్వాత 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ విద్యాశాఖ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాకు సలహాదారుగానూ వ్యవహరించారు. అనంతరం ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలో కీలక నేతగా ఎదిగారు.

News September 18, 2024

నేడు ఏపీ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం

image

AP: రాష్ట్రంలో నేడు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశముంది. MLAల పనితీరు, భవిష్యత్తు కార్యచరణపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

News September 18, 2024

ఆ కారణంతో రాబోయే 25 ఏళ్లలో 3.9 కోట్ల మంది మృతి!

image

వైద్యానికి లొంగని సూపర్ బగ్స్ లేదా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(AMR) వల్ల గత 31 ఏళ్లలో 10 లక్షల మంది మరణించారని ఓ గ్లోబల్ సర్వే పేర్కొంది. రాబోయే 25 ఏళ్లలో ఈ సంఖ్య 3.9 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ తదితర దక్షిణాసియా దేశాల్లో సుమారు 1.18 కోట్ల మంది మరణిస్తారని హెచ్చరించింది. వైద్యరంగంలో ఎంతో సాంకేతికత సాధించినా AMR ఇప్పటికీ సవాల్‌గానే ఉంది.

News September 18, 2024

రూ.లక్ష కడితే టీడీపీలో శాశ్వత సభ్యత్వం: చంద్రబాబు

image

AP: ₹లక్ష చెల్లించిన వారికి TDP శాశ్వత సభ్యత్వం కల్పిద్దామని పార్టీ నేతలతో CM చంద్రబాబు అన్నారు. లక్ష మంది సభ్యులు చేరితే, వచ్చిన డబ్బును కార్యకర్తల సంక్షేమానికి ఉపయోగించవచ్చని తెలిపారు. పలువురు నేతలతో నిన్న ఆయన సమావేశమయ్యారు. కార్యకర్తలకు లబ్ధి చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. గత 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేశారు.

News September 18, 2024

మండుతున్న ఎండలు.. 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత

image

రెండు వారాల క్రితం తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తగా ఇప్పుడు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నిన్న ఏపీలోని కావలిలో 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నైరుతి గాలులు పూర్తిగా పొడిగా మారడం, మేఘాలు లేకపోవడంతో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఏసీ, ఫ్యాన్లు లేకుండా ఉండలేకపోతున్నామని, వేసవి పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు చెబుతున్నారు.

News September 18, 2024

పంటల వారీగా నష్టపరిహారం ఇలా..

image

AP: నీట మునిగిన పంటలకు CM చంద్రబాబు పరిహారం ప్రకటించారు. హెక్టార్ల ప్రకారం తమలపాకు తోటలకు ₹75వేలు, అరటి, పసుపు, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, సపోటా తదితర తోటలకు ₹35వేలు, పత్తి, వేరుశనగ, వరి, చెరకు, టమాటా, పువ్వులు, ఉల్లి, పుచ్చకాయ పంటలకు ₹25వేలు, సజ్జలు, మినుములు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొగాకు, కొర్రలు, సామలకు ₹15వేలు, ఆయిల్‌పామ్, కొబ్బరిచెట్లకు ఒక్కోదానికి ₹1,500.

News September 18, 2024

వారికి రూ.3వేల నిరుద్యోగ భృతి!

image

AP: రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నవారికి రూ.3,000 నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాదాయశాఖ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ ఈ నెల 17న మెమో పంపినట్లు సమాచారం. అయితే ఆ మెమోలో ఈ నెల 16లోపు పంపాలని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

News September 18, 2024

ఆకట్టుకుంటున్న ‘దేవర’ కొత్త పోస్టర్లు

image

‘దేవర’ మూవీ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా మూవీ టీమ్ రిపీటెడ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మూవీ టీమ్ కొత్త పోస్టర్లను రిలీజ్ చేసింది. మరోవైపు నిన్న చెన్నైలో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ రేపు చండీగఢ్‌కు, ఈనెల 23న అమెరికా వెళ్తారని సమాచారం. ఈలోగా 22న HYDలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనుంది.