India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రస్తుత NDA పాలనలోనే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టితో మోదీ 3.0 పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎర్రకోటపై తన ప్రసంగంలో మోదీ జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షత ఏర్పాటు చేసిన కమిటీ కేంద్రానికి నివేదిక కూడా సమర్పించింది.
తెలుగు బిగ్ బాస్-8 షో ఈ సారి అంచనాలకు అందకుండా సాగుతోంది. రెండో వారంలో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారని హోస్ట్ నాగార్జున తెలిపారు. నామినేషన్స్ ఫైనల్స్లో ఓం ఆదిత్య, బాషా మిగలగా ఇంటి సభ్యుల ఓటింగ్తో అతడిని ఎలిమినేట్ చేశారు. శేఖర్ ఎలిమినేట్ కావడంతో పలువురు హౌస్ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి హౌస్లో బాషా పంచ్లు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిన సంగతి తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. మళ్లీ పాత టెండరింగ్ విధానాన్నే అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది.
AP: ఏపీలోని 35 మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా <
NTR, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఈ సినిమా ఔట్ డోర్ ప్రీరిలీజ్ ఈవెంట్కు పోలీసుల నుంచి అనుమతి రాలేదని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్టీఆర్కు ఉన్న పాపులారిటీ దృష్ట్యా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండటంతో భద్రతా కారణాలతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. కాగా ఈ మూవీ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది.
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మరోసారి కొండెక్కాయి. భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. దీంతో ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో కొత్తిమీర, పుదీనా కట్టలు రూ.60-రూ.100 పలుకుతున్నాయి. కిలో ఉల్లి రూ.60-80, పచ్చిమిర్చి 70, చిక్కుడు రూ.100, బీరకాయ రూ.80, బెండ రూ.70, క్యారెట్ రూ.100, కాకర రూ.80, టమాటా రూ.40-50 పలుకుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆయనకు ఆహ్వానం అందింది. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు మెక్సికోలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ, వ్యూహాలను ఈ సమావేశాల్లో రూపొందిస్తామని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. ఈ ఆహ్వానం అందటం తనకు ఎంతో గర్వకారణమని భట్టి ఆనందం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్తో జరగనున్న టెస్టు సిరీస్కు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ జోరు పెంచారు. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే తొలి టెస్టుకు కింగ్ కోహ్లీ నెట్స్లో భారీ షాట్లు ప్రాక్టీస్ చేశారు. ఈ క్రమంలో విరాట్ కొట్టిన ఓ బంతి వేగానికి డ్రెస్సింగ్ రూమ్ సమీపంలోని గోడకు పెద్ద రంధ్రం పడింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తొలి టెస్టులోనూ కోహ్లీ ఇలాంటి దూకుడునే ప్రదర్శించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
TG: రేపు మధ్యాహ్నం 3.45 గంటలకు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పాల్గొంటారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాగా కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక రావట్లేదని సమాచారం.
అల్లు అర్జున్, అట్లి కాంబినేషన్లో మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ నిర్మించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. గీతా ఆర్ట్స్తో సంయుక్తంగా సినిమాను తెరకెక్కించే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ డిసెంబర్ 6న విడుదల కానుంది.
Sorry, no posts matched your criteria.