News September 13, 2024

BRS నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకు దెబ్బ తీయండి: కోమటిరెడ్డి

image

TG: BRS పార్టీ నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకి దెబ్బ తీయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం, ప్రభుత్వంపై BRS నేతలు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు సహించకండి. రోడ్లపై తిరగకుండా అడ్డుకోండి. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీయాలనేదే వాళ్ల ఉద్దేశం. పదేళ్లు సెంటిమెంట్‌తో పరిపాలన చేశారు. మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. ఆంధ్రా వాళ్లు ఓట్లేయకపోతే గెలిచేవారా?’ అని ప్రశ్నించారు.

News September 13, 2024

కౌశిక్‌ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి: ఎమ్మెల్యే దానం

image

TG: BRS MLA కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. హరీశ్ రావు కూడా దీనిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని అన్నారు. ‘కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా? పార్టీ స్టాండా? వ్యక్తిగతమైతే కౌశిక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.

News September 13, 2024

UNలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తాం: అమెరికా

image

UN భద్రతా మండలిలో భారత్, జర్మనీ, జపాన్ శాశ్వత సభ్యత్వాలకు తాము మద్దతిస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఆఫ్రికా దేశాలకు తాత్కాలిక సభ్యత్వాలతో పాటు 2 శాశ్వత సభ్యత్వాల సృష్టికి తమ మద్దతు కొనసాగుతుందని UNలో US అంబాసిడర్ లిండా థామస్ పేర్కొన్నారు. ‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం భారత్. మండలిలో నిజంగానే వారికి మేం మద్దతిస్తాం. వారి శాశ్వత సభ్యత్వాన్ని తిరస్కరించే పరిస్థితులే లేవు’ అని అన్నారు.

News September 13, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

image

AP: తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇటు టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,544 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,942 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.3.37 కోట్ల ఆదాయం లభించింది.

News September 13, 2024

‘దేవర’కు అరుదైన ఘనత

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమాకు అరుదైన ఘనత లభించింది. లాస్ ఏంజెల్స్‌లోని బియాండ్ ఫెస్ట్‌లో ఈ మూవీ ప్రదర్శించనున్నారు. ఈనెల 26న సాయంత్రం 6.30 గంటలకు ప్రఖ్యాత ఈజిప్షియన్ థియేటర్‌లో షో వేయనున్నారు. ఈ విషయాన్ని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రీమియర్‌ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ పాల్గొననున్నట్లు తెలిపాయి. హాలీవుడ్ సెలబ్రిటీలూ ‘దేవర’ చూడనున్నట్లు సమాచారం.

News September 13, 2024

ఊరట ఓకే.. సీఎం ఆఫీస్, సెక్రటేరియట్‌‌కు వెళ్లలేని కేజ్రీవాల్

image

<<14090235>>బెయిల్‌పై<<>> బయటకొస్తున్న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించే పరిస్థితి కనిపించడం లేదు. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు పెట్టిన కండీషన్లే ఇక్కడా వర్తిస్తాయని చెప్పడమే ఇందుకు కారణం. దీంతో ఆయన సీఎం ఆఫీస్, సెక్రటేరియట్‌కు వెళ్లలేరు. ఈ కండీషన్లపై అభ్యంతరం ఉన్నా జుడీషియల్ డిసిప్లిన్, ట్రయల్ కోర్టు తీర్పును గౌరవిస్తూ వాటిపై వ్యతిరేక ఆదేశాలు ఇవ్వడం లేదని జస్టిస్ భూయాన్ అన్నారు.

News September 13, 2024

ఎర్రదళాన్ని నడిపించే కొత్త సారథి ఎవరో?

image

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంతో పార్టీ నూతన సారథిపై చర్చ నడుస్తోంది. 1964లో పార్టీ ఏర్పాటైన తర్వాత పదవిలో ఉండగా ప్రధాన కార్యదర్శి మరణించడం ఇదే తొలిసారి. కాగా త్వరలోనే పార్టీ అగ్రనేతలు సమావేశమై తదుపరి కార్యదర్శి ఎంపికపై చర్చిస్తారని తెలుస్తోంది. బెంగాల్ CPM కార్యదర్శి మహమ్మద్ సలీం, కేరళ CPM కార్యదర్శి ఎంవీ గోవింద్, త్రిపుర మాజీ CM మాణిక్ సర్కార్ పేర్లు రేసులో ఉన్నట్లు సమాచారం.

News September 13, 2024

కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

image

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో సీబీఐ నమోదు చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సమీప భవిష్యత్తులో ట్రయల్ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను ట్యాంపర్ చేస్తారన్న సీబీఐ వాదనలను అంగీకరించలేదు. కేజ్రీవాల్ బెయిల్‌కు అర్హుడని పేర్కొంది. కేసుపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, ఈడీ కేసులోని <<14090397>>షరతులే<<>> ఇక్కడా వర్తిస్తాయని తెలిపింది.

News September 13, 2024

వారిని సురక్షితంగా తీసుకొస్తాం: లోకేశ్

image

కేదార్‌నాథ్‌లో 18 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్న <<14089394>>ఘటనపై <<>> ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘వారిని స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నాం. ఈలోగా వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరాం. యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండండి’ అని భరోసా ఇచ్చారు.

News September 13, 2024

కివీస్VSఅఫ్గాన్.. ఒక్క బాల్ పడకుండానే చరిత్ర!

image

నోయిడాలో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్ రద్దయింది. వర్షం కారణంగా 5 రోజుల్లో ఒక్క రోజూ ఆట సాగలేదు. దీంతో ఒక్క బాల్ కూడా పడకుండానే రద్దయిన మ్యాచ్‌గా ఇది రికార్డులకెక్కింది. ఇలా జరగడం గత 26 ఏళ్లలో ఇదే తొలిసారి అని క్రీడా వర్గాలు తెలిపాయి. చివరిగా 1998లో న్యూజిలాండ్, భారత్ మ్యాచ్ ఒక్క బాల్ పడకుండానే రద్దయింది.