News September 12, 2024

చరిత్ర సృష్టించేందుకు 58 రన్స్ దూరంలో కోహ్లీ

image

క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకు సమీపంలో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 591 ఇన్నింగ్స్‌లో 26,952 పరుగులు చేశారు. మరో 58 పరుగులు చేస్తే అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 27వేల పరుగుల్ని చేరుకున్న తొలి ఆటగాడిగా నిలుస్తారు. ప్రస్తుతం సచిన్‌ టెండూల్కర్(623 ఇన్నింగ్స్‌) పేరిట ఆ రికార్డు ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సచిన్, పాంటింగ్, సంగక్కర మాత్రమే 27వేలకు పైగా రన్స్ చేశారు.

News September 12, 2024

చంద్రబాబుతో కేంద్ర బృందాల భేటీ

image

ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాలు సచివాలయంలో CM చంద్రబాబుతో భేటీ అయ్యాయి. వరద నష్టంపై తాము చేపడుతున్న ఎన్యూమరేషన్ గురించి CMకి వివరించాయి. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం కేంద్ర బృందాలను కోరారు. పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందని చంద్రబాబు వివరించారు. కాగా రూ.6882 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇప్పటికే కేంద్రానికి ప్రభుత్వం నివేదిక అందించింది.

News September 12, 2024

ఇందిరాగాంధీతో JNUకి రిజైన్ చేయించిన సీతారాం

image

సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించేవారు. 1977లో JNU ఛాన్సలర్‌గా ఉన్న అప్పటి PM ఇందిరాగాంధీ ఆ పోస్టుకు రిజైన్ చేయాలన్న డిమాండ్‌ను ఆమె ఎదుటే నిల్చుని వినిపించారాయన. JNU విద్యార్థుల్ని సంఘటితం చేసి ప్రధాని నివాసానికి తీసుకెళ్లి ఆమెపై చేసిన తీర్మానాన్ని చదివారు. ఆ తర్వాత ఇందిర ఆ పదవికి రిజైన్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

News September 12, 2024

ఎర్రమట్టి దిబ్బలపై విచారణకు ఆదేశం

image

AP: విశాఖ జిల్లా భీమిలి మండలంలోని ఎర్రమట్టి దిబ్బలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. సర్వే నంబర్ 118/5Aలో 250 ఎకరాలకు పైగా భూములను ఓ హౌసింగ్ సొసైటీకి కేటాయించారు. అయితే ఆ భూములన్నీ వారసత్వ సంపదగా ఉన్న ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో ఉన్నాయని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించి చర్యలకు ఆదేశించింది.

News September 12, 2024

సీతారాం ఏచూరి మృతిపై ప్రధాని మోదీ సంతాపం

image

సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. లెఫ్ట్ పార్టీలకు ఆయనో దిక్సూచిలా వ్యవహరించారని, రాజకీయాలకు అతీతంగా అందరితో అనుబంధం ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. ఏచూరి కుటుంబానికి, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక దేశ రాజకీయాలకు ఏచూరి మృతి తీరని లోటని కేరళ సీఎం పినరయి విజయన్, ఎంపీ కపిల్ సిబల్ ఆవేదన వ్యక్తం చేశారు.

News September 12, 2024

మనుషుల నుంచీ కాంతి వెలువడుతోంది!

image

మానవుడి నుంచి సైతం చిన్నపాటి వెలుగు ఉత్పన్నమవుతుందనే విషయాన్ని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవులు తమ కణాలలో జరిగే రసాయన ప్రతిచర్యల కారణంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయని తెలిపారు. ఈ కాంతి గుర్తించేందుకు చాలా రోజులుగా అల్ట్రా-సెన్సిటివ్ కెమెరాలను వినియోగించారు. బుగ్గలు, నుదుటి, మెడ నుంచి ప్రకాశవంతమైన కాంతి వెలువడే దృశ్యాలను బంధించారు.

News September 12, 2024

హరియాణా అసెంబ్లీ రద్దు

image

హరియాణా అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉత్తర్వులు జారీ చేశారు. 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అదేనెల 8న ఫలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారు.

News September 12, 2024

ఇందుకేనా మిమ్మల్ని ఎన్నుకున్నది?: అంబటి రాంబాబు

image

AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో సెటైర్లు వేశారు. ‘ఏలేరు వరదలకీ జగనే, బుడమేరు వరదలకీ జగనే, అచ్యుతాపురం పేలుళ్లకీ జగనే.. ఇలా అన్నింటికీ జగనే అని చెప్పడానికా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది?’ అని ప్రశ్నించారు.

News September 12, 2024

నెగ్గిన ఏచూరి ప్రతిపాదన.. రాజ్యసభలో అరుదైన ఘటన

image

తనదైన శైలిలో సమస్యల్ని పార్లమెంట్‌లో ప్రస్తావించడంలో <<14084560>>సీతారాం ఏచూరి<<>> దిట్ట. సబ్జెక్టుపై సమగ్రమైన అవగాహనతో సభలో ఆయన విలువైన సూచనలు చేసేవారు. 2015 మార్చి 3న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై ఓటింగ్‌లో ఆయన ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలో ఇలా జరగడం అరుదు.

News September 12, 2024

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు

image

AP: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు గడువును సర్కార్ మరోసారి పొడిగించింది. ఈ నెల 22వ తేదీ వరకు ట్రాన్స్‌ఫర్లు చేపట్టొచ్చని తెలిపింది. సెప్టెంబర్ 23 నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. ఇటు ఎక్సైజ్ శాఖలో బదిలీల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం యంత్రాంగం మొత్తం వరద సహాయక చర్యల్లో ఉండటంతో బదిలీల గడువును పొడిగించినట్లు తెలుస్తోంది.