News August 12, 2025

మందుబాబులకు శుభవార్త

image

AP ప్రభుత్వం మందుబాబులకు తీపికబురు అందించింది. మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ఎక్సైజ్ రూల్-2024కు సవరణ చేసింది. పర్మిట్ రూమ్‌లు లేకపోవడం వల్ల బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ 2.77 లక్షల మంది పట్టుబడినట్లు పేర్కొంది. పొలాలు, పార్కులు, రోడ్ల పక్కన మద్యం సేవించడాన్ని తగ్గించేలా లైసెన్స్‌తో కూడిన పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు అనుమతించినట్లు వెల్లడించింది.

News August 12, 2025

‘వార్ 2’కు టికెట్ రేట్ల పెంపు.. ఎంతంటే

image

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ మూవీకి టికెట్ రేట్లు పెంచుతూ AP ప్రభుత్వం జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో రూ.75, మల్టీప్లెక్సుల్లో రూ.100 చొప్పున పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎల్లుండి రిలీజ్ రోజు ఉదయం 5 గంటలకు స్పెషల్ షోకు రూ.500 టికెట్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్లు ఈనెల 23 వరకు కొనసాగనున్నాయి. మరోవైపు తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు లేదు.

News August 12, 2025

ఈ ఎన్నికలను రద్దు చేయాలి: YS జగన్

image

AP: పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను తీవ్రవాదుల్లా టీడీపీ నేతలు హైజాక్ చేశారని YS జగన్ Xలో ఫైరయ్యారు. ‘చంద్రబాబు గుండాలా అరాచకాలు చేశారు. రౌడీల రాజ్యం నడిపిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని గాయపరిచిన ఈరోజు బ్లాక్‌డే. ఆయన CMగా ఉండగా ప్రజాస్వామ్యం డొల్లని రుజువైంది. చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు ఒట్టిమాటలే. ఈ ఎన్నికలను రద్దు చేసి, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ నిర్వహించాలి’ అని జగన్ డిమాండ్ చేశారు.

News August 12, 2025

రజినీ ‘కూలీ’ టికెట్ రేట్ల పెంపు

image

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ మూవీ టికెట్ రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో రూ.75, మల్టీప్లెక్సుల్లో రూ.100 చొప్పున పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 14 నుంచి 23 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయి. అలాగే రిలీజ్ రోజు ఉదయం 5 గంటలకు అదనపు షోకు కూడా అనుమతించింది. తెలంగాణలో మాత్రం ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు లేదు.

News August 12, 2025

అటవీశాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలి: రేవంత్

image

TG: అటవీశాఖలో ప్రమోషన్లతో పాటు ఉద్యోగాల భర్తీ చేపట్టాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. మంత్రి సురేఖతో కలిసి ఆయన ఎకో టూరిజం అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ‘ఆమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు సందర్శకులను పెంచాలి. నైట్ సఫారీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. అటవీ-రెవెన్యూ శాఖల మధ్య భూవివాదాలు పరిష్కారం చేయాలి’ అని ఆయన ఆదేశించారు.

News August 12, 2025

రికార్డులు కొల్లగొట్టిన డెవాల్డ్ బ్రెవిస్

image

AUSతో 2వ T20లో సౌతాఫ్రికా బ్యాటర్ బ్రెవిస్(125*) విధ్వంసం సృష్టించారు. దీంతో SA తరఫున అత్యధిక T20 వ్యక్తిగత స్కోర్(గతంలో డుప్లెసిస్ 119 రన్స్) కొట్టారు. AUSపై ఫాస్టెస్ట్ సెంచరీ 41బంతుల్లో(గతంలో కోహ్లీ 52బాల్స్), SA తరఫున సెంచరీ కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు(గతంలో రిచర్డ్ లెవి 24Y). కాగా బ్రెవిస్ IPLలో CSKకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

News August 12, 2025

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి 10 గంటల లోపు వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. మరి మీ ఏరియాలో వర్షం మొదలైందా? కామెంట్ చేయండి.

News August 12, 2025

కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నాదెండ్ల బ్రహ్మం

image

AP: రాష్ట్రంలో 31 నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్-నాదెండ్ల బ్రహ్మం, SC కార్పొరేషన్ ఛైర్మన్-ఆకేపోగు ప్రభాకర్, బ్రాహ్మణ-బుచ్చి రామ్ ప్రసాద్, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్-దాసరి శ్రీనివాసులు, విశ్వబ్రాహ్మణ-కమ్మరి పార్వతి, దూదేకుల-నాగుల్ మీరా కాసునూరి, వైశ్య-రమేశ్ మొదలవలస, జంగం-వి.చంద్రశేఖర్, వడ్డెర-గుంటసల వెంకటలక్ష్మి, OUDA ఛైర్మన్‌గా షేక్ రియాజ్‌ను నియమించింది.

News August 12, 2025

WOW.. మూడు రోజుల్లో 343L పాలిచ్చిన ఆవు

image

బ్రెజిల్‌కు చెందిన హోల్‌స్టెయిన్-ఫ్రైసియన్ జాతి ఆవు ప్రపంచ రికార్డును నెలకొల్పింది. సాధారణ ఆవులు రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తుంటే ఇది మాత్రం సగటున రోజుకు 114 లీటర్ల చొప్పున 3 రోజుల్లో 343L పాలు ఉత్పత్తి చేసింది. జెనెటిక్స్, సరైన పోషణ, సంరక్షణ, మోడ్రన్ డెయిరీ టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముర్రా & నీలి-రవి గేదెలు కూడా ఈ జాతిలానే ఎక్కువ పాలు ఇవ్వగలవు.

News August 12, 2025

స్కూళ్లకు సెలవులపై సీఎం కీలక ఆదేశాలు

image

TG: అల్పపీడనంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని బట్టి స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని సూచించారు. ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు <<17383239>>రద్దు<<>> చేయాలని CM ఇప్పటికే ఆదేశించారు.