News December 7, 2024

మ్యూజిక్ నుంచి రెహమాన్ బ్రేక్? కూతురు ఏమన్నారంటే?

image

ఏఆర్ రెహమాన్ ఏడాదిపాటు మ్యూజిక్ వర్క్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కూతురు ఖతీజా ఖండించారు. ఇలాంటి పనికిరాని రూమర్స్‌ను ప్రచారం చేయొద్దని మండిపడ్డారు. ఇటీవల రెహమాన్, తన భార్య సైరా భాను విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాతో పాటు పలు ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్నారు.

News December 7, 2024

అల్పపీడనం.. రేపు వర్షాలు

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది మరింతగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.

News December 7, 2024

రైతులు సన్నాలనే పండించాలి.. సీఎం పిలుపు

image

TG: తెలంగాణ రైతులు సన్న వడ్లనే పండించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సన్నవడ్లు పండిస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. రేషన్ కార్డుదారులకు, మధ్యాహ్నభోజనంలో పేద పిల్లలకు రైతులు పండించిన సన్నబియ్యాన్నే పెడతామని పేర్కొన్నారు. ఎవరు అడ్డువచ్చినా సంక్రాంతి తర్వాత రైతుభరోసా డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

News December 7, 2024

ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలిచ్చాం: రేవంత్

image

తాము మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇన్ని ఉద్యోగాలు దేశంలో ఎవరూ ఇవ్వలేదని, ఇదో రికార్డు అని తెలిపారు. శాఖల వారీగా ఎన్ని ఉద్యోగాలిచ్చామో అసెంబ్లీలో రుజువు చేస్తామని, కేసీఆర్ రావాలని సవాల్ విసిరారు. ఉద్యోగాలపై BRS చెప్పిందే బీజేపీ చెప్పిందని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 55వేల ఉద్యోగాలిచ్చారని నిరూపిస్తే ఢిల్లీలో క్షమాపణలు చెప్తానని సవాల్ విసిరారు.

News December 7, 2024

వరంగల్ మిర్చికి అరుదైన ఘనత

image

TG: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసే చపాట మిర్చికి అరుదైన ఘనత లభించింది. దీనికి జీయో ట్యాగ్ గుర్తింపునకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్(IPO) ఆమోదం తెలిపింది. ఈ రకం మిరపకాయలు టమాటా వలె ఉంటాయి. ఇందులో కారం తక్కువ మోతాదులో ఉంటుంది. రెండేళ్ల క్రితం ఈ మిర్చికి వరంగల్ మార్కెట్‌లో రూ.లక్ష ధర పలకడం గమనార్హం.

News December 7, 2024

ఢిల్లీని రిషభ్ పంత్ వదిలేయడానికి కారణమిదే: కోచ్

image

రిషభ్ పంత్‌ను IPL వేలంలో LSG రికార్డు స్థాయిలో రూ.27 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీని పంత్ వదిలేయడానికి గల కారణాన్ని ఆ జట్టు కోచ్ హేమాంగ్ బదానీ వెల్లడించారు. ‘పంత్ వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తానెంత ధర పలుకుతానో చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఎంత ఒప్పించడానికి ట్రై చేసినా వినలేదు. అన్నట్లుగానే భారీ ధర పలికాడు. మంచి ఆటగాడికి న్యాయంగానే భారీ ధర దక్కింది’ అని పేర్కొన్నారు.

News December 7, 2024

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఎన్ని గంటలకంటే?

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సా.6.05 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు ఆహ్వానం పంపారు.

News December 7, 2024

నో ప‌వ‌ర్ షేరింగ్ ఫార్ములా: డీకే శివ‌కుమార్‌

image

CM సిద్దరామ‌య్య‌, త‌న మ‌ధ్య ఎలాంటి ప‌వ‌ర్ షేరింగ్ ఫార్ములా లేద‌ని DK శివ‌కుమార్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో పార్టీ నేత‌లెవ‌రూ మాట్లాడ‌వ‌ద్ద‌న్నారు. తానెప్పుడూ ఏ ఫార్ములా గురించి మాట్లాడ‌లేదని, రాజ‌కీయ అవ‌గాహ‌న‌తో ఇద్దరం క‌లిసి ప‌నిచేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందే CMతో ఒప్పందం కుదిరింద‌ని ఇటీవ‌ల‌ DK వ్యాఖ్యానించగా, అలాంటి ఒప్పందం ఏమీ లేద‌ని CM కొట్టిపారేశారు. దీంతో రచ్చ మొదలైంది.

News December 7, 2024

ఆ కారు పేరు మార్చేసిన మహీంద్రా

image

మ‌హీంద్రా త‌న కొత్త ఎల‌క్ట్రిక్‌ కారు మోడ‌ల్ పేరును మార్చాల‌ని నిర్ణ‌యించింది. ఇటీవ‌ల SUV మోడ‌ల్స్‌లో BE 6e విడుద‌ల చేసింది. అయితే మోడ‌ల్ పేరులో 6e వాడ‌కంపై విమాన‌యాన సంస్థ‌ IndiGo అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ కోర్టుకెక్కింది. ఏళ్లుగా త‌మ బ్రాండ్ ఐడెంటిటీలో 6eని వాడుతున్నామ‌ని, దీనిపై త‌మ‌కు ట్రేడ్‌మార్క్ హ‌క్కులు ఉన్నాయంటూ వాదించింది. దీంతో మ‌హీంద్రా త‌న BE 6e మోడ‌ల్‌ను BE 6గా మార్చింది.

News December 7, 2024

ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ వల్లే ఎక్కువ నష్టం: సీఎం రేవంత్

image

TG: ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పదేళ్ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం కలిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం.. బహిరంగ సభలో మాట్లాడారు. లక్ష ఎకరాలకు నీరందించే బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టును అప్పటి సీఎం వైఎస్సార్ ప్రారంభిస్తే.. కేసీఆర్ పదేళ్లు పట్టించుకోలేదని మండిపడ్డారు. SLBC ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఫ్లోరైడ్ సమస్య తీరేదని వ్యాఖ్యానించారు.