India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లపై కొరడా ఝుళిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విద్యా వ్యవస్థలో తేవాల్సిన సంస్కరణలపై మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ సమావేశం అయింది. కోచింగ్ సెంటర్ల నిర్వహణలో పాటించాల్సిన మార్గదర్శకాలపై భేటీలో చర్చించారు. రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లలో కేంద్రమార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు తనవంతు సాయంగా హీరో సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఏపీ మంత్రి లోకేశ్ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్ను అందించారు. ‘ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చిన చెక్ను లోకేశ్ అన్నకు అందించా’ అని ట్వీట్ చేశారు. కాగా, తేజ్ను అభినందిస్తూ లోకేశ్ రిప్లై ఇచ్చారు.
TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాను ఆవిష్కరించాలని పేర్కొంది. HYDలో జరిగే కార్యక్రమంలో CM రేవంత్ రెడ్డి, జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేస్తారు. కాగా 17న కేంద్రం ‘విమోచన దినోత్సవం’గా ప్రకటించి వేడుకలు నిర్వహిస్తోంది.
భారత్లో సిక్కుల ఉనికికి ముప్పుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ప్రో ఖలిస్థానీ నేత గురుపత్వంత్ పన్నూన్ సమర్థించారు. SFJ ఖలిస్థానీ రెఫరెండం ప్రచారం న్యాయమేనని ఆయన ఉద్ఘాటించినట్టు అయిందన్నారు. ‘ప్రో ఖలిస్థానీలు హాజరైన సమావేశంలోనే రాహుల్ ఇలా వ్యాఖ్యానించారు. సిక్కులకు ముప్పుందన్న ఆయన మాటలు సాహసోపేతమైనవి. చారిత్రకంగా సరైనవే. వారికి ప్రత్యేక దేశం ఉండాలన్న SFJ వైఖరిని సమర్థించినట్టైంది’ అని అన్నారు.
వన్డే ప్రపంచ కప్ వల్ల భారత్కు లాభమే జరిగిందని ICC పేర్కొంది. గతేడాది OCT 5 నుంచి NOV 19 వరకు 10 నగరాల్లో ICC మ్యాచ్లు నిర్వహించింది. దీని ద్వారా 1.39 బిలియన్ డాలర్ల (రూ.11,637 కోట్లు) బిజినెస్ జరిగిందని ICC ఓ ప్రకటనలో తెలిపింది. మ్యాచులు చూసేందుకు వచ్చిన ఇంటర్నేషనల్ టూరిస్టుల వసతి, ఆహారం, రవాణా వంటివి అత్యధిక బిజినెస్ను అందించాయి. దీంతోపాటు రాష్ట్రాల్లోని స్టేడియాలు అప్గ్రేడ్ అయ్యాయి.
ప్రపంచంలో ఎక్కువ కాలం ఉపయోగంలో ఉన్న దేశాల జెండాల గురించి తెలుసుకుందాం. 1625వ సంవత్సరం నుంచి వినియోగిస్తున్న డెన్మార్క్ దేశ జెండా అత్యంత పురాతనమైనది. దీని తర్వాత నెదర్లాండ్(1660), నేపాల్(1743), యూకే(1801), చిలీ (1817), అర్జెంటినా(1818), పెరూ(1825), ఫ్రాన్స్(1830), బెల్జియం(1831) ఉన్నాయి. ఇక 1947 నుంచి ఉపయోగిస్తోన్న భారత జాతీయ జెండా 59వ ఓల్డెస్ట్ ఫ్లాగ్గా నిలిచింది.
TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘రాష్ట్ర ప్రజలు వరదలతో అల్లాడుతుంటే ఆయన బయటకు ఎందుకు రావడం లేదు? ప్రజలే KCRకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఆయనకు మళ్లీ రీ ఎంట్రీ కలే. KCR కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్కు సాధ్యం కావడం లేదు. బీజేపీ గెలిస్తే కేసీఆర్ అంతుచూసేటోళ్లం. ఆయనే దశమ గ్రహం. ఇంకా నవగ్రహ యాగం చేయడం విడ్డూరంగా ఉంది’ అని ఫైరయ్యారు.
అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కొన్ని సిక్కు సంఘాలు భగ్గుమన్నాయి. బుధవారం సోనియా గాంధీ ఇంటిముందు ఆందోళన చేపట్టాయి. ఆయన మాటలు సరికాదంటూ నిరసన వ్యక్తం చేశాయి. మత స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ భారత్లో సిక్కుల ఉనికికి ముప్పు ఉందంటూ రాహుల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దేశంలో సిక్కులు తలపాగా ధరించేందుకు అనుమతించే పరిస్థితి ఉందా అన్నారు. RSS, BJPతో తాము సైద్ధాంతిక పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ నుంచి రిలీజైన ట్రైలర్ యూట్యూబ్ను షేక్ చేసింది. రిలీజైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్కు 55 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతోపాటు యూట్యూబ్లో ట్రైలర్ ట్రెండ్ అవుతోందని తెలిపారు. కాగా, ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని, ఓ ట్రైలర్కు ఇన్ని వ్యూస్ రావడం ఇదే తొలిసారని సినీవర్గాలు చెబుతున్నాయి.
AP: గుంటూరు GGHలో మీరాబీ అనే గర్భిణీ ఇటీవల మృత శిశువుకి జన్మనిచ్చింది. ఆమె మనోవేదన చూసి తల్లడిల్లిన స్నేహితురాలు ప్రభావతి ఆవేదన తీర్చాలనుకుంది. అనారోగ్యంతో చనిపోయిన ఓ బాలింత భర్తను సంప్రదించి రూ.2లక్షలకు వారి ఆడ శిశువును కొనుగోలు చేసి, బిడ్డను మీరాబీ ఒడిలోకి చేర్చింది. అయితే ఆస్పత్రి సిబ్బంది అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా శిశువు విక్రయం సంగతి బయటపడింది.
Sorry, no posts matched your criteria.