India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఇంటర్ విద్యార్థులకు D-Day వచ్చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. WAY2NEWSలో అత్యంత వేగంగా మీ పరీక్ష ఫలితాల్ని చూసుకోవచ్చు. అంతే వేగంగా మీ సన్నిహితులకు షేర్ చేయొచ్చు. యాప్ ఓపెన్ చేస్తే చాలు. ఒక్క ప్రెస్ రూపంలో మీ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. మీ సన్నిహితులకు ఈ విషయాన్ని షేర్ చేయండి. విద్యార్థులందరికీ కచ్చితంగా మంచి మార్కులొస్తాయి. ఆందోళన చెందకండి. ఆల్ ది బెస్ట్.

నటి రేణూ దేశాయ్ తాజా పాడ్కాస్ట్లో తన రెండో పెళ్లి గురించి మాట్లాడగా సోషల్ మీడియాలో, వార్తాసంస్థల్లో అదే హాట్ టాపిక్ అయింది. దానిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ 44 ఏళ్ల మహిళ రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది సమాజానికి అక్కర్లేని అంశం. నేను మహిళలు, వాతావరణం, ఆర్థిక వృద్ధి వంటి అనేక అంశాలపై మాట్లాడాను. అన్నీ వదిలేసి అనవసరమైన విషయంపై దృష్టి పెట్టారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

TG: హైడ్రా నిఘా నేత్రం మరింత బలపడింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC)తో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ హైడ్రాకు హెచ్డీ శాటిలైట్ డేటాను సమకూర్చనుంది. దీన్ని కబ్జాల నియంత్రణకు హైడ్రా వినియోగిస్తామని హైడ్రా చీఫ్ రంగనాథ్ తెలిపారు. ‘భూముల వివరాలు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం. హద్దులతో సహా సమగ్ర సమాచారాన్ని అందిస్తాం’ అని ఆయన వెల్లడించారు.

‘రేర్ ఎర్త్’ లోహాల ఎగుమతిని నిలిపేయాలని చైనా నిర్ణయించింది. ఈ నెల 4నే ఈ నిర్ణయం తీసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. అరుదైన ఈ లోహాల్ని రక్షణ, ఇంధన, ఆటోమోటివ్ తదితర రంగాల్లో వినియోగిస్తారు. ట్రంప్ సుంకాలకు ప్రతీకారంగా చైనా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన లోహాల దిగుమతుల్లో సుమారు 90శాతం చైనా నుంచే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ ధరలు పెరగొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈరోజు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా రాముడిపై సాగే పాటను ‘విశ్వంభర’ టీమ్ రిలీజ్ చేయనున్నారు. ఉదయం 11.12 గంటలకు పాట విడుదల కానుంది. ఆల్రెడీ నిన్న రిలీజ్ చేసిన ప్రోమోకు మంచి స్పందన లభించింది. రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్కు లిరిక్స్ రాయగా కీరవాణి మ్యూజిక్ అందించారు. వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా సోషియో ఫాంటసీ మూవీగా విశ్వంభర తెరకెక్కింది.

తమ జాతకాన్ని మార్చేందుకు దిగ్గజ కెప్టెన్ ధోనీపైనే సీఎస్కే ఆధారపడింది. రుతురాజ్ గాయం అనంతరం ధోనీని కెప్టెన్గా ప్రకటించింది. ఇక కొత్త సీఎస్కేని చూస్తారంటూ ఫ్యాన్స్ కూడా గర్వంగా చెప్పుకొన్నారు. తీరా చూస్తే పాత కథే రిపీట్ అయింది. KKR చేతిలో ఘోరంగా ఓడిపోయింది. 6 మ్యాచులాడిన CSK ఒకటే గెలిచింది. అయితే, ధోనీపై తమకు నమ్మకముందని, మళ్లీ పుంజుకుంటామని చెన్నై ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

TG: అవాస్తవాలతో ప్రతి విషయాన్ని రాజకీయం చేసేందుకు BRS యత్నిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ‘కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే. వాటి విలువ రూ.20,653 కోట్లుగా లెక్కగట్టాం. TGIIC ద్వారా బాండ్లు జారీ చేసి రూ.10వేల కోట్లను సమీకరించాం. అంతే తప్ప తనఖా పెట్టలేదు. BRS సహా ఎవరైనా సరే భూముల విషయంలో ప్రభుత్వంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

TG: నల్లమల అడవుల్లో ప్రకృతి రమణీయత మధ్యలో వెలిసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య జాతర నిన్న ఘనంగా ప్రారంభమైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. సుమారు 18 కి.మీ దట్టమైన అటవీ ప్రాంతంలో నడిచి స్వామివారిని చేరుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ యాత్రను తెలంగాణ అమరనాథ్ అని పిలుస్తుంటారు. 3రోజుల జాతర కోసం అన్ని ఏర్పాట్లూ చేశామని అధికారులు తెలిపారు.

మనం రోజూ తినే కొన్ని ఆహారాల్లో పెట్రోల్ నుంచి సేకరించిన పదార్థాలు వాడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రాసెస్ చేసిన మిల్లెట్స్, ఆలూ చిప్స్, చాక్లెట్స్ ద్వారా పెట్రోల్ శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. చిప్స్ పాడవకుండా టెర్షియరీ బ్యుటైల్ హైడ్రోక్వినన్ వాడతారు. అలాగే డోనట్స్లో పెట్రోల్ నుంచి సేకరించిన ప్రొపైలిన్ గ్లైకాల్
& ఐస్క్రీమ్స్, సలాడ్స్లో ఎమల్సిఫైయర్ వాడతారు’ అని సూచించారు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.