News December 4, 2024

మహిళలను ఆర్థికంగా బలపరచండి: CM CBN

image

AP: రాష్ట్రంలోని మహిళలను స్వయం సహాయక సంఘాల(SHG) ద్వారా ఆర్థికంగా బలపరచాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. SHGలను MSMEలుగా రిజిస్ట్రేషన్లు చేస్తూ కేటగిరీలుగా విభజించాలన్నారు. ఏటా రూ.లక్షకు తక్కువ ఆదాయం వచ్చే గ్రూపును ‘నాన్ లాక్‌పతి’గా, రూ.లక్ష-రూ.10 లక్షలు ‘లాక్‌పతి’, రూ.10లక్షలు పైనుంటే ‘మైక్రో’, రూ.50లక్షల పైన ‘స్మాల్’, రూ. కోటికి ఎక్కువ ఆర్జిస్తే ‘మీడియం’ కేటగిరీలుగా విభజించాలన్నారు.

News December 4, 2024

BIG BREAKING: మళ్లీ భూకంపం వచ్చే అవకాశం: NGRI

image

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వారాల్లో మరోసారి భూప్రకంపనలకు అవకాశం ఉందని NGRI శాస్త్రవేత్త డా. శేఖర్ అంచనా వేశారు. అయితే ప్రస్తుతంతో పోలిస్తే తక్కువ తీవ్రతతో ఈ ప్రకంపనలు ఉంటాయన్నారు. పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడం మేలని సూచించారు. 1969లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందన్నారు. రిక్టర్ స్కేలుపై 6 లోపు ప్రమాదాలు జరగవని, మన దగ్గర ఈ ముప్పు లేదని శేఖర్ తెలిపారు.
Share It

News December 4, 2024

సంతోషాన్ని పంచుకునేందుకు వస్తున్నా: CM

image

TG: తమ ఏడాది పాలనలో నిరుద్యోగం తగ్గిందని సీఎం రేవంత్ అన్నారు. 55వేల ఉద్యోగాల నియామకాలు పూర్తి చేశామని, పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. ‘మొన్న కొలువులే ఆలంబనగా కొలిమిలా మండిన ఉద్యమం. నిన్న కొలువులే ఆకాంక్షగా జంగ్ సైరనై మోగిన నా రణం. నేడు కొలువుల కలలు నిజమైన క్షణం. ఈ సంతోషాన్ని యువ మిత్రులతో పంచుకునేందుకు నేడు పెద్దపల్లికి వస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News December 4, 2024

పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ కొట్టివేత

image

TG: లగచర్ల ఘటనలో A1గా ఉన్న కొడంగల్ మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కొడంగల్ కోర్టు తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు.

News December 4, 2024

ఇంకా 1,87,473 ఉద్యోగాలు బాకీ: KTR

image

TG: ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి భర్తీ చేసిన జాబ్స్ 12,527 మాత్రమేనని KTR ట్వీట్ చేశారు. నిరుద్యోగులకు ఇంకా 1,87,473 జాబ్స్ బాకీ ఉందని పేర్కొన్నారు. BRS ప్రభుత్వం ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లు పబ్లిసిటీ చేసుకుని, 55,143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులను మోసం చేస్తే కాంగ్రెస్‌కు అధోగతే అని అన్నారు.

News December 4, 2024

‘బ్లడ్ ప్రామిస్’.. నెత్తుటిలో మెగాస్టార్-శ్రీకాంత్ చేతులు

image

మెగాస్టార్ చిరంజీవితో తీయనున్న సినిమా పోస్టర్‌ను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, పోస్టర్‌లో ఉన్న చెయ్యి చిరంజీవిది కాదని, శ్రీకాంత్‌ది అంటూ ఓ నెటిజన్ డౌట్ పడ్డారు. ఈక్రమంలో ఇది చిరుదేనని నిరూపించేందుకు ఎరుపు రంగుతో నిండిన చిరు చేతిని శ్రీకాంత్ పట్టుకున్నట్లు ఉన్న ఫొటోను పంచుకున్నారు. దీనిని ‘బ్లడ్ ప్రామిస్’ అని హీరో నానీ సైతం షేర్ చేశారు.

News December 4, 2024

పవన్‌తో దిగిన సెల్ఫీ షేర్ చేస్తా: హీరోయిన్ నిధి

image

‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న వేళ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు నిర్మాత SKN ఓ రిక్వెస్ట్ చేశారు. గత వారం జరిగిన షూటింగ్‌లో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకోవాలని ఆయన ఆమెను Xలో కోరారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘మై డియర్ రాక్‌స్టార్. పవన్ గారితో నేను తీసుకున్న మొదటి సెల్ఫీని త్వరలో పోస్ట్ చేస్తా’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం పవన్ సైతం HHVM షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

News December 4, 2024

ప్లేయింగ్ 11లో ఉండటం నాకు ముఖ్యం: KL

image

ఏ పొజిషన్‌లోనైనా బ్యాటింగ్ చేసేందుకు తాను సిద్ధమని భారత బ్యాటర్ KL రాహుల్ తెలిపారు. ప్లేయింగ్ 11లో ఉండటమే తనకు ముఖ్యమని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. BGT తొలి టెస్టులో ఓపెనింగ్‌పై తనకు ముందే సమాచారం ఉందని, అందుకు తగ్గట్లుగా ప్రిపేర్ అయ్యానని తెలిపారు. రెండో టెస్టులో ఏ స్థానంలో ఆడాలనేది డిసైడ్ చేశారని, కానీ ఇప్పుడే బయటకు చెప్పలేనన్నారు. తనకిది తొలి పింక్ బాల్ టెస్ట్ అని పేర్కొన్నారు.

News December 4, 2024

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9.17 గంటలకు 117 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 80,962 వద్ద, 35 పాయింట్ల లాభంతో నిఫ్టీ 24,492 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలపై మదుపర్లు దృష్టి పెట్టి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.68గా ఉంది.

News December 4, 2024

IRCTC: ట్రైన్ ఆలస్యమైతే భోజనం ఫ్రీ

image

తాము ప్రయాణించాల్సిన ట్రైన్ 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ప్రయాణికులకు IRCTC ఉచిత భోజనం అందించనుంది. ప్రస్తుతం ఈ సర్వీస్ రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో అందుబాటులో ఉంది. టీ, కాఫీ, బిస్కెట్లు, బ్రెడ్, భోజనం ఆర్డర్ చేయొచ్చు. ట్రైన్ ఎక్కకముందే 3 గంటల కన్నా ఎక్కువ సమయం ఆలస్యమైతే టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. వెయిటింగ్ రూమ్స్‌లో అదనపు ఛార్జీలు కూడా ఉండవు.