India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సూర్దాస్: 16వ శతాబ్దానికి చెందిన సూర్దాస్కు కళ్లు కనిపించేవి కాదు. అయినా కృష్ణుడి కోసం వేలాది కవితల్ని రాశారు.
రూజ్వెల్ట్: పోలియోతో నడుం కింది భాగం చచ్చుబడిపోయినా పట్టుదలతో అమెరికాకు 4సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు.
ఫ్రీడా కాహ్లో: మెక్సికోకు చెందిన ఫ్రీడా కాహ్లో పోలియో, బస్సు ప్రమాదం కారణంగా దివ్యాంగురాలయ్యారు. అయినప్పటికీ తనను తాను దిగ్గజ పెయింటర్గా తీర్చిదిద్దుకున్నారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య కిమ్ కియోన్-హీ రక్షించడానికే దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సైనిక పాలన విధించినట్టు తెలుస్తోంది. కిమ్పై దర్యాప్తునకు విపక్ష డెమోక్రటిక్ పార్టీ(DP) ప్రయత్నిస్తోంది. మరోవైపు అధికార పార్టీ తెచ్చిన బడ్జెట్ను DP తిరస్కరించింది. నేషనల్ అసెంబ్లీలో మెజారిటీ ఉన్న DP నిర్ణయాన్ని అధ్యక్షుడు రద్దు చేయలేరు. ఈ పరిణామాల నేపథ్యంలో యూన్ సైనిక పాలన విధించారు.

AP: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్పై ప్రభుత్వం వేటు వేసింది. సంజయ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని విజిలెన్స్ దర్యాప్తులో తేలడంతో చర్యలకు దిగింది. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సంజయ్కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్లో ఉంచింది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఈయన సీఐడీ చీఫ్గా ఉన్నారు.

బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుకు LS ఆమోదం తెలిపింది. దీని ద్వారా అకౌంట్ ఖాతాదారులు నలుగురు నామినీలను కలిగిఉండే వెసులుబాటు కల్పించారు. ఏకకాలంలో లేదా ఒకరి తర్వాత ఒక నామినీని ఎంచుకునే అవకాశం ఉంది. దీంతో పాటు పలు మార్పులు చేయనున్నారు. ఈ బిల్లును కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టగా మూజువాణి ఓటు ద్వారా సభ ఆమోదం తెలిపింది. కాగా ప్రస్తుత బ్యాంకు ఖాతాకు ఒకే నామినీకి అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.

PV సింధుకు కాబోయే <<14775039>>భర్త<<>> వెంకట దత్తసాయి పొసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. మాజీ IRS ఆఫీసర్ అయిన ఈయన తండ్రి GT వెంకటేశ్వరరావు MDగా వ్యవహరిస్తున్నారు. సాయి డిప్లొమా, ఫ్లేమ్ వర్సిటీలో BBA చదివారు. IIITలో డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్ పూర్తి చేశారు. JSW గ్రూపులో కన్సల్టెంట్గా పని చేశారు. IPLలో DCతోనూ కలిసి పనిచేసినట్లు సమాచారం. దత్తసాయి ఆస్తి సుమారు రూ.50కోట్లు ఉంటుందని అంచనా.

దక్షిణ కొరియాలో సైనిక పాలన ఎత్తివేతకు నేషనల్ అసెంబ్లీ తీర్మానించింది. 300 మంది సభ్యులున్న అసెంబ్లీలో 190 మంది ఈ ఓటింగ్కు హాజరయ్యారు. ఓటింగ్లో పాల్గొన్న ప్రతిఒక్కరూ మూకుమ్మడిగా సైనిక పాలనకు వ్యతిరేకంగా తీర్మానించారు. మరోవైపు అధ్యక్షడు యూన్ ప్రకటనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజలు అసెంబ్లీ వద్దకు చేరుకుంటున్నారు. బలగాలు వారిని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఏపీలో సంక్షేమ పథకాల అమలుపై ప్రజాస్పందనను సీఎం చంద్రబాబు నేరుగా తెలుసుకోనున్నారు. ఇందుకోసం చంద్రబాబు వాయిస్తో లబ్ధిదారులకు ఫోన్ కాల్స్ వెళ్లనున్నాయి. IVRS విధానంలో కొనసాగే ఈ కాల్లో తాము పొందుతున్న పథకం, దానిపై స్పందనను నమోదు చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో పథకాలు అమలు చేసినా ప్రజల అభిప్రాయం తెలుసుకోకపోవడంతో ఫలితం బెడిసికొట్టడంతో తమ విషయంలో అలా జరగొద్దని బాబు ఈ నిర్ణయం తీసుకున్నారట.

సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారనే ప్రచారంపై బాలీవుడ్ హీరో విక్రాంత్ మాస్సే స్పందించారు. <<14766262>>తన పోస్ట్పై<<>> తప్పుగా ప్రచారం జరిగిందని తెలిపారు. తాను కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తాను రోటిన్గా ఫీలవుతున్నానని, ఇంకాస్త బెటర్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. కాగా 12TH FAIL సినిమాతో విక్రాంత్ అందరి దృష్టిని ఆకర్షించారు.

AP: ఈ నెల 6 నుంచి జనవరి 8 వరకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. గ్రామస్థాయిలో భూవివాదాలను ఈ సమావేశాల్లో పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భూఆక్రమణలు, 22ఏ, ఫ్రీహోల్డ్పై ఫిర్యాదులు స్వీకరించనుంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో షెడ్యూల్ ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

పుష్ప-2ను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తీశారని శ్రీశైలం అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. సినిమా చూశాకే విడుదలకు సెన్సార్ బోర్డ్ అనుమతించిందని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వాదించారు. ఊహాజనితంగా తీసిన మూవీ విడుదలను నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు సమయం వృథా చేసినందుకు జరిమానా విధిస్తామని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Sorry, no posts matched your criteria.