News September 8, 2024

రాష్ట్రంలో వరద నష్టం ప్రాథమిక అంచనా ఇదే..

image

AP: రాష్ట్రంలో వరదల వల్ల రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. అత్యధికంగా R&B రూ.2164.5 కోట్లు, నీటివనరులు రూ.1568.5 కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.1160 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. రెవెన్యూశాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖ రూ.481 కోట్లు, వ్యవసాయం రూ.301 కోట్లు, పంచాయతీ రోడ్ల విభాగం రూ.167.5 కోట్లు, మత్స్య శాఖకు రూ.157.86 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది.

News September 8, 2024

నిలబడి నీళ్లు ఎందుకు తాగకూడదంటే?

image

నీరు మనిషి శరీరానికి గొప్ప ఇంధనం. ప్రతి ఒక్కరూ రోజుకు 4లీటర్లు తాగడం చాలా అవసరం. అయితే నీళ్లు ఎలా తాగుతున్నామనేది కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యలతోపాటు జీర్ణవ్యవస్థ ప్రభావితమవుతుంది. నీరు త్వరగా పొట్టలోకి చేరి శరీరం కింది భాగంలో నొప్పిగా ఉంటుంది. అదే కూర్చొని తాగితే ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్డ్స్‌గా ఉండి బాడీకి అవసరమైన ఖనిజాలూ అందుతాయి.

News September 8, 2024

YCP శ్రేణుల ఫైర్.. ట్వీట్ డిలీట్ చేసిన బ్రహ్మాజీ

image

మాజీ CM జగన్‌పై సెటైరికల్ ట్వీట్ చేసిన <<14048027>>బ్రహ్మాజీపై<<>> YCP శ్రేణులు సోషల్ మీడియాలో ఫైరయ్యాయి. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా జగన్‌నే విమర్శించడం కొందరికి ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డాయి. వరద సహాయక చర్యల్లో లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీకెందుకు కోపం వచ్చిందని నిలదీశాయి. రూ.కోటితోపాటు YCP ప్రజాప్రతినిధులు నెల జీతాన్ని కేటాయించడం కనిపించలేదా? అని దుయ్యబట్టాయి. దీంతో ఆయన ట్వీట్ డిలీట్ చేశారు.

News September 8, 2024

ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం

image

రాష్ట్రంలో అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు కావాలంటే తప్పనిసరిగా NRC నంబర్‌ను సమర్పించాలని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు. రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు.

News September 8, 2024

నేటితో ముగియనున్న పారిస్ పారాలింపిక్స్

image

పారిస్ పారాలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ పోటీలు 11 రోజులపాటు కొనసాగాయి. 216 పతకాలతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ 29 పతకాలతో 16వ ప్లేస్‌లో ఉంది. మొత్తం 4,463 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. 22 క్రీడల్లో 549 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఇండియా నుంచి 84 మంది అథ్లెట్లు పారాలింపిక్స్‌లో పాల్గొన్నారు. 25 పతకాలు సాధించాలనే లక్ష్యాన్ని మన దేశం నెరవేర్చుకుంది.

News September 8, 2024

త్వరలో ‘సై’ రీరిలీజ్

image

రాజమౌళి డైరెక్షన్‌లో నితిన్ నటించిన ‘సై’ సినిమా మళ్లీ థియేటర్లలో అలరించనుంది. త్వరలోనే రీరిలీజ్ తేదీని ప్రకటిస్తామని డిస్ట్రిబ్యూషన్ సంస్థ మెగా ప్రొడక్షన్ వెల్లడించింది. రగ్బీ ఆట కథాంశంతో ఎమోషనల్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందింది. 2004లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో జెనీలియా, శశాంక్, ప్రదీప్ రావత్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, వేణు మాధవ్ కీలక పాత్రల్లో నటించారు.

News September 8, 2024

అత్యంత భారీ వర్షాలు.. ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్

image

AP: వాయుగుండం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. అల్లూరి, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

News September 8, 2024

కృష్ణా నదికి మళ్లీ వరద.. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత

image

AP: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది ప్రవాహం మళ్లీ పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ 65 గేట్లు ఎత్తి 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

News September 8, 2024

భారీ వర్షాలు.. పరిస్థితిపై మంత్రి ఆరా

image

TG: మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీని మంత్రి సీతక్క ఆరా తీశారు. ఖమ్మం మున్నేరుకు వరద ప్రవాహం 14 అడుగులకు చేరింది. ఇప్పటికే వరద పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. మరోవైపు రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.

News September 8, 2024

థర్డ్ అంపైర్ లేకుండానే సిరీస్ ఆడేశారు

image

థర్డ్ అంపైర్ లేకుండానే ఆస్ట్రేలియా-స్కాట్లాండ్ T20 సిరీస్ ముగిసింది. థర్డ్ అంపైర్ లేకపోవడంతో DRS, రనౌట్, స్టంపౌట్‌ను ఫీల్డ్ అంపైర్లే ప్రకటించారు. ఈ విషయంలో ఆసీస్ బ్యాటర్ మెక్‌గుర్క్‌కు కలిసొచ్చింది. రెండో T20లో అతడు స్టంపౌటైనా ఫీల్డ్ అంపైర్ ఔటివ్వలేదు. రీప్లేలో ఔటైనట్లు స్పష్టంగా కనిపించింది. కాగా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ఆసీస్ ఆడుతున్నా థర్డ్ అంపైర్ లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.