News April 3, 2025

ALERT: నేడు రాష్ట్రంలో భిన్న వాతావరణం

image

AP: రాష్ట్రంలో నేడు భిన్న వాతావరణం నెలకొంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్లూరి, ప్రకాశం, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో ఎండలు మండిపోతాయని వెల్లడించింది. భిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News April 3, 2025

ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్య

image

AP: రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులకు ఇంటర్మీడియట్‌తోపాటు జేఈఈ, నీట్‌కు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెన్త్ పాసైనవారికి టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందులో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఎంపిక చేసిన కార్పొరేట్ కళాశాలలో వారు కోరుకున్న కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికయ్యే ఖర్చును వక్ఫ్ బోర్డు భరించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది.

News April 3, 2025

ట్రెండింగ్‌లో ‘వింటేజ్ ఆర్సీబీ’

image

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో ఓడిపోవడంతో ఆర్సీబీపై నెటిజన్లు SM వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. తొలి రెండు మ్యాచుల్లో విజయం గాలివాటమేనని కామెంట్లు చేస్తున్నారు. మూడో మ్యాచులో పరాజయంతో ‘వింటేజ్ ఆర్సీబీ’ తిరిగి వచ్చేసిందని ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ ఒక్క పరాజయంతో తమ జట్టును తక్కువగా అంచనా వేయొద్దని, ఈ సారి కప్పు కొడతామని ఆర్సీబీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News April 3, 2025

వక్ఫ్ బిల్లులోని కీలకాంశాలు..

image

* వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ముస్లింలే ఉంటారు. కనీసం ఇద్దరు మహిళలకు చోటు కల్పించాలి.
* వక్ఫ్ కౌన్సిల్‌, రాష్ట్ర బోర్డుల్లో ఇద్దరు ముస్లిమేతరులను నియమించాలి.
* కొత్త చట్టం అమల్లోకొచ్చిన 6 నెలల్లో ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ డేటా‌బేస్‌లో చేర్చాలి.
* వక్ఫ్ ట్రైబ్యునల్ తీర్పులను 90రోజుల్లో హైకోర్టులో సవాలు చేసుకోవచ్చు.
* ఈ ట్రైబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఉండాలి.

News April 3, 2025

ఆరెంజ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్లు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఉమ్మడి కరీంనగర్, HYD, MBNR, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

News April 3, 2025

ట్రంప్ టారిఫ్స్.. భారత్‌పై ప్రభావమెంత?

image

ప్రతీకార సుంకాలపై US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. ఇందులో భారత్‌పై 26 శాతం సుంకం విధించారు. ఈ చర్యతో వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, వజ్రాలు, రసాయనాలు, యంత్రాలతోపాటు మరికొన్ని వస్తువులపై టారిఫ్స్ ప్రభావం ఎక్కువగా పడుతుందని నిపుణులు అంటున్నారు. సుంకాల కారణంగా భారత్‌కు రూ.26 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ఇది దేశ GDPపై 0.1% ప్రభావం చూపుతుందని విశ్లేషిస్తున్నారు.

News April 3, 2025

ఈ నెలలోనే ఏపీలో PM మోదీ పర్యటన!

image

AP: అమరావతి పనులను పున:ప్రారంభించేందుకు PM మోదీ ఈ నెలలోనే రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో CS విజయానంద్ రాష్ట్ర సచివాలయంలో ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. PM పర్యటన తేదీ త్వరలో ఖరారు కానున్న నేపథ్యంలో శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, ప్రధాని ఇవాళ థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రాగానే AP పర్యటన తేదీ ఫిక్స్ కానుంది.

News April 3, 2025

IPL: KKRపై SRH పైచేయి సాధిస్తుందా?

image

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ KKR-SRH మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు వరుస ఓటములతో డీలాపడ్డ ఆరెంజ్ ఆర్మీ తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. కేకేఆర్‌ను ఓడించి మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి రావాలని పట్టుదలగా ఉంది. మరోవైపు కేకేఆర్ ఒక గెలుపు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ మ్యాచులో గెలిచి సత్తా చాటాలని ఎదురుచూస్తోంది.

News April 3, 2025

భారత్‌లో భూకంపాలు వచ్చే ప్రదేశాలు ఇవే!

image

మయన్మార్‌లో భూకంపం సంభవించి వేలాది మంది ప్రజలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాగా మనదేశంలో కూడా భూప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, JK ప్రాంతాలు 9 తీవ్రతతో భూకంపాలు వచ్చే జోన్ పరిధిలో ఉన్నాయి. ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్రలో 8, రాజస్థాన్, కొంకణ్ తీరంలో 7, కర్ణాటక, TG, AP, ఒడిశా, MPలో 7 కంటే తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు.

News April 3, 2025

స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్.. పిక్స్ వైరల్

image

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. బ్లాక్ అండ్ వైట్ అవుట్‌ఫిట్‌లో కళ్లద్దాలు ధరించి స్టన్నింగ్ లుక్‌లో మెరిశారు. టోక్యోలోని ఓ స్టార్ హోటల్‌లో ఈ ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను తన అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.