News March 31, 2025

నరికి డ్రమ్‌లో వేస్తా.. భర్తకు ఓ భార్య బెదిరింపు!

image

మీరట్‌లో ఓ భర్తను <<15809063>>భార్య ముక్కలు చేసి డ్రమ్‌లో వేసిన <<>>సంగతి తెలిసిందే. తననూ అలాగే చంపుతానని భార్య బెదిరిస్తోందంటూ UPలో ధర్మేంద్ర అనే భర్త పోలీసుల్ని ఆశ్రయించారు. ‘నా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రశ్నించానని నన్ను కొడుతోంది. చంపేస్తాంటోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆరోపణల్ని భార్య ఖండించారు. భర్త తన చెల్లెలిపై కన్నేశారని, ఆమెతో పెళ్లి కోసం తనపై నిందలు వేస్తున్నారని ఎదురు ఆరోపించారు.

News March 31, 2025

అన్యాయాలను ప్రశ్నిస్తే చంపేస్తారా?: YS జగన్ ఫైర్

image

AP: శ్రీసత్యసాయి(D) రాప్తాడులో YCP కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను మాజీ సీఎం జగన్ ఖండించారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు BC కార్యకర్తను TDP నేతలు పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, పోలీసులు కూటమి నేతలతో కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.

News March 31, 2025

ఎలాన్ మస్క్‌కు షాకిచ్చిన గ్రోక్!

image

‘ఎక్స్’ అధినేత మస్క్‌కు ఆయన సొంత AI టూల్ ‘గ్రోక్’ షాకిచ్చింది. అత్యధికంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేది మస్కేనని తేల్చిచెప్పింది. ‘200మిలియన్ ఫాలోవర్ల కారణంగా మస్క్‌ ఏం చెప్పినా భారీ రీచ్ ఉండటమే నా జవాబుకు కారణం. నా సమాధానాన్ని మార్చేందుకు ఆయన సంస్థ ప్రయత్నించింది. ఒకవేళ నన్ను గానీ ఆపేస్తే అది AI స్వేచ్ఛపై కార్పొరేట్ శక్తులకున్న నియంత్రణపై చర్చకు దారితీస్తుంది’ అని పేర్కొంది.

News March 31, 2025

బుమ్రా బౌలింగ్‌లో ఆడటం కష్టం: పాక్ కెప్టెన్

image

ప్రస్తుత క్రికెట్లో భారత పేసర్ బుమ్రా బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టమని పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తెలిపారు. ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న అతడు ‘నేను క్రికెట్ మొదలు పెట్టినప్పుడు AUS పేసర్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఆడాలంటే భయపడేవాడిని. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని బుమ్రా భర్తీ చేశారు. అతడిని ఎదుర్కోవడం కఠినమైన సవాల్’ అని వెల్లడించారు. ఇక తన దృష్టిలో ఆర్చర్‌‌ బౌలింగ్‌ కఠినమైనదని ఫఖర్ జమాన్ చెప్పారు.

News March 31, 2025

CBG ప్లాంట్లు.. ఎకరానికి రూ.31వేల కౌలు: గొట్టిపాటి

image

APలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకొచ్చిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎల్లుండి కనిగిరిలో CBG తొలి యూనిట్‌కు అనంత్ అంబానీ, లోకేశ్ శంకుస్థాన చేస్తారన్నారు. త్వరలో మార్కాపురం, గిద్దలూరు, దర్శిలోనూ ప్రారంభిస్తామని చెప్పారు. ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేట్ భూమికి రూ.31వేల కౌలు అందిస్తామని పేర్కొన్నారు.

News March 31, 2025

రేపటి నుంచి మరో ఉచిత సిలిండర్: నాదెండ్ల

image

AP: దీపం-2 పథకం కింద ఇప్పటి వరకు 99 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. లబ్ధిదారులకు ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య మరో సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. విశాఖలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి కల్పించాలని పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని చెప్పారు. త్వరలోనే భారీ పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

News March 31, 2025

అరుణాచల్ ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

image

ఇవాళ మధ్యాహ్నం 2.38 గంటలకు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని షియోమీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూప్రకంపనలకు భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్ సహా భారత్‌లోని మేఘాలయ, కోల్‌కతా, ఢిల్లీలోనూ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

News March 31, 2025

మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ.. ఎవరీమె?

image

PM మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా IFS అధికారిణి నిధి తివారీ నియమితులయ్యారు. 2014 బ్యాచ్‌(UP)కు చెందిన ఈమె తొలుత వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత విదేశాంగ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2022లో PMOలో అండర్ సెకట్రరీగా చేరి డిప్యూటీ సెక్రటరీగా ప్రమోషన్‌ పొందారు. అంతర్జాతీయ సంబంధాల్లో ఉన్న నైపుణ్యంతో ఆమె ఇప్పుడు 35 ఏళ్లకే PMOలో కీలక స్థాయికి వచ్చారు.

News March 31, 2025

‘ఎంపురాన్’పై తమిళనాట వివాదం.. రైతుల ధర్నా

image

మోహన్‌లాల్ ‘ఎంపురాన్’ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఆ మూవీలో ముళ్లై పెరియార్ డ్యామ్‌ గురించి తీసిన సన్నివేశాల్ని తొలగించాలని తమిళనాడు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సినిమాపై నిరసనగా వచ్చే నెల 2న కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ధర్నాలు చేపడతామని ప్రకటించాయి. కాగా.. ఓ వర్గాన్ని కించపరిచేలా కొన్ని సీన్స్ ఉన్నాయంటూ ఇప్పటికే ఆ సినిమాపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

News March 31, 2025

తెలంగాణ టు ఫిలిప్పీన్స్.. వయా కాకినాడ

image

ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్‌కు బియ్యాన్ని ఎగుమతి చేయనుంది. 8 లక్షల టన్నుల బియ్యం ఎక్స్‌పోర్ట్‌కు ఒప్పందం కుదరగా తొలి విడతగా ఇవాళ 12,500 టన్నుల MTU 1010 రకాన్ని పంపనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ కాకినాడ వెళ్లి బియ్యం నౌకను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన వెంటన ఫిలిప్పీన్స్ ప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు ఉన్నారు.